Monday 4 August 2014

నెల్లూరు జిల్లా : మహిళ మద్యం మత్తులో కారు బీభత్సం, ముగ్గురు దుర్మరణం

నెల్లూరు జిల్లా : మహిళ మద్యం మత్తులో కారు బీభత్సం, ముగ్గురు దుర్మరణం

Published at: 04-08-2014 13:27 PM
నెల్లూరు, ఆగస్టు 4 : జిల్లాలోని హరినాథపురం శివారులో ముత్తుకూరు రోడ్డు వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ యువతి మద్యం సేవించి కారునడుపుతూ బీభత్సం సృష్టించింది. ముత్తుకూరు వైపు వెళుతున్న ఆమె కుడివైపు డివైడర్‌ను ఢీ కొట్టి ఎదురుగా ఉన్న రెండు కార్లు, 4 మోటారు బైక్‌లను ఢీకొట్టింది. తర్వాత ఆ ప్రక్కన ఉన్నటు వంటి విద్యార్థులపైకి కారు దూసుకుపోయింది.
ఈ ఘటనలో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ విషయం సోమవారం ఉదయం జిల్లాలో కలకలం సృష్టిస్తుంది. ఆ యువతి గతంలో కూడా పల్సర్ వాహనాన్ని నడిపి పలు ప్రమాదాలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కారు కొని అతి వేగంగా నడుపుతూ ప్రమాదం చేసింది. ప్రస్తుతం ఆ యువతి ఎక్కడ ఉన్నదన్న విషయాన్ని పోలీసులు చెప్పడం లేదు. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

No comments:

Post a Comment