Friday 1 August 2014

పిచ్చిరాతలు మానుకుంటే మీకే మంచిది - మీడియాపై కేసీఆర్

పిచ్చిరాతలు మానుకుంటే మీకే మంచిది మీడియాపై కేసీఆర్ మరోసారి ఆగ్రహం

Published at: 01-08-2014 13:58 PM
హైదరాబాద్, ఆగష్టు 1 : మీడియాపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే కోసం శుక్రవారం ఉదయం హెచ్ఐసీసీలో జరిగిన సన్నాహక సదస్సులో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రిని డమ్మీ చేశారంటూ ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియా హద్దుల్లో ఉండాలన్నారు. ఇప్పటికీ కొన్ని మీడియా సాధనాలు ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలని భావిస్తున్నాయని, అలాంటి సాధనాలతో వారేమీ చేయలేరని కేసీఆర్ అన్నారు. ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని కేసీఆర్ అన్నారు. త్వరలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పత్రిక తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు కేసీఆర్ తెలిపారు.

No comments:

Post a Comment