Tuesday 12 August 2014

కేసీఆర్‌వి బఫూన్‌ మాటలు: టీడీపీ

కేసీఆర్‌వి బఫూన్‌ మాటలు: టీడీపీ

Published at: 12-08-2014 08:23 AM
వరంగల్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారం చేపట్టి అరవై రోజలు కావస్తున్నా ప్రజలను మభ్యపెడుతూ బఫూన్‌  మాటలతో మాయచేస్తున్నారని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు.  సోమవారం వరంగల్‌ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. నిత్యం చంద్రబాబు, మోదీలపై విమర్శలు చేస్తే తెలంగాణ ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు.   స్వాతంత్ర దినోత్సవాన్ని గొల్కొండలో నిర్వహించాలను కోవడం మానుకోవాలని హితవు పలికారు. రైతు రుణమాఫీని వెంటనే అమలు చే యాలని లేదంటే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. అధికారం చేపట్టిన తర్వాత టీఆర్‌ఎస్‌ నేతలకు  కన్నూమిన్నూ కానడం లేదని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ ఆరోపించారు. రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెట్టినపుడు పార్లమెంటులోకాని, శాసనసభలో కాని నోరు మెదపని  కేసీఆర్‌, హరీ్‌శ్‌రావు బిల్లును అమలు చేస్తుండగా రాద్ధాంతం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. సర్వేపై ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలిసి ప్రజల్లో ఆందోళనను తొలగించే విధంగా చొరవ చూపుతామన్నారు.

No comments:

Post a Comment