Saturday 9 August 2014

కామన్వెల్త్‌లో 1+6 పతకాలు

తెలంగాణకు ఆరు.. ఏపీకి ఒకటి

Published at: 04-08-2014 08:13 AM
గ్లాస్గో కామన్వెల్త్‌లో తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు స్వర్ణం సహా ఏడు పతకాలతో మెరిశారు. తెలంగాణకు చెందిన కశ్యప్‌ బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో పసిడి పతకాన్ని ముద్దాడగా, మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల రతజం గెలుచుకుంది. సింగిల్స్‌లో పీవీ సింధు, గురుసాయి దత్‌ చెరో కాంస్యం నెగ్గారు. ఇక హైదరాబాదీ షార్ప్‌ షూటర్‌ గగన్‌ నారంగ్‌ రజతం (50 మీ. రైఫిల్‌ ఫ్రోన్‌), కాంస్యం (50 మీ. రైఫిల్‌ 3 పొజిషన్స్‌) సాధించాడు. కాగా ఆంధ్రప్రదేశ్‌కు ఒకే పతకం దక్కింది. ఏపీ లిఫ్టర్‌ మత్స సంతోషి మహిళల 53కిలోల వెయిట్‌ లిఫ్టింగ్‌లో రజతం సాధించింది. కాగా 2010 ఢిల్లీ కామన్వెల్త్‌లో ఉమ్మడి రాష్ర్టానికి  19 పతకాలు దక్కాయి. అయితే ఈ సారి తెలుగు ఆటగాళ్ల పతకాల సంఖ్య గణనీయంగా తగ్గింది.

No comments:

Post a Comment