Friday 20 June 2014

ప్రపంచబ్యాంకు ప్రతినిధులతో హరీశ్ భేటీ

ప్రపంచబ్యాంకు ప్రతినిధులతో హరీశ్ భేటీ

Published at: 21-06-2014 08:20 AM
ప్రపంచబ్యాంకు ప్రతినిధులతో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రపంచబ్యాంకు ఆర్థిక సాయంతో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ/అభివృద్ధి పథకం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ పథకంపై చర్చించారు. ప్రపంచబ్యాంకు రుణాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజించడంతో.. ఆయా పథకాలకు సంబంధించిన అధికారులను కూడా నియమించాలని ప్రపంచబ్యాంకు అధికారులు హరీశ్‌రావును కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి బి. అరవిందరెడ్డి, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment