Monday 23 June 2014

ప్రభుత్వం వరుణ యాగం చేయాలి : స్వరూపానంద

ప్రభుత్వం వరుణ యాగం చేయాలి : స్వరూపానంద

Published at: 22-06-2014 15:58 PM
విజయవాడ, జూన్ 22 : వరుణ యాగం చేస్తే రాష్ట్రంలో తప్పక వర్షాలు కురుస్తాయని విశాఖ పీఠాధిపతి స్వరూపానంద అన్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఆదివారం జరిగిన అక్షర దీవెన కార్యక్రమంలో స్వామీజీ పాల్గొన్నారు. ప్రభుత్వం వేద పండితులతో శాస్త్రోధికంగా వరుణ పూజలు చేయించడంవల్ల రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని స్వరూపానంద అభిప్రాయడ్డారు.
హిందూ దేవాలయాల్లో పనిచేస్తున్న అన్యమతస్తులను తొలగించాలని స్వరూపానంద డిమాండ్ చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖలో అర్చకులు, పురోహితులకు ఈ యాగం సంబంధం లేకపోవడంచేత... వేద పండితులు ద్వారా వరుణ యాగం చేయిస్తే కుంభవృష్టి కురుస్తుందని ఆయన అన్నారు.

No comments:

Post a Comment