Friday 20 June 2014

తెగించి పోరాడే జాతే అభివృధ్ధి చెందుతుంది : ఆర్ కృష్ణయ్య

బీసీ రిజర్వేషన్ల కోసం యుద్ధం చేస్తాం

Published at: 21-06-2014 08:28 AMతెగించి పోరాడే జాతే అభివృధ్ధి చెందుతుంది : ఆర్ కృష్ణయ్య 
హైదరాబాద్ : చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు సాధించుకోవడానికి పోరాటం కాదు... యుద్ధమే చేస్తాం అని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. 'ఆకలి పోరాటం కాదు.. మాది ఆత్మగౌరవ పోరాటం... ఆత్మగౌరవం దెబ్బతింటే రాజునే కాదు... దేవుడిని కూడా దించుతాం.. రిజర్వేషన్ల కోసం ఢిల్లీ కోటను ముట్టడిస్తాం' అన్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో బీసీ సంక్షేమ సంఘం మహాసభ జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జిల్లాల బాధ్యులు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. రిజర్వేషన్ల కోసం జాతీయ స్థాయిలో పార్టీలను ఏకం చేస్తామని, మాట వినని పార్టీలను గ్రామగ్రామాన తిరుగుతూ ప్రచారం చేసి ఓడిస్తామని, అవసరమైతే బంద్‌లు, ధర్నాలతో ఆందోళనలన ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. తనకే పదవి అక్కర్లేదని, ఎమ్మెల్యే కాకముందే తనను ప్రజలంతా సీఎంలా చూశారని, బీసీ జాతి కోసం, సిద్ధాంతం కోసమే టీడీపీలో చేరానని తెలిపారు. జాతీయ స్థాయిలో అన్ని సంఘాలతో కలిసి జాతీయ బీసీ సంఘం ఏర్పాటు చేస్తామని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా బీసీ సంక్షేమ సంఘాలను పెడతామని ఆయన వెల్లడించారు. 'ఏడాదిముందు ఆర్.కృష్ణయ్యను సీఎంగా ప్రకటిస్తే తప్పక సీఎం అయ్యే వారు... ఏడాది ముందు మోదీని ప్రకటించినందుకే ఆయన ప్రధాని అయ్యారు' అని బీసీ యువజన సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

No comments:

Post a Comment