Monday 9 June 2014

పరిటాల కేసును తిరగదోడతా: సునీత

పరిటాల కేసును తిరగదోడతా: సునీత

Published at: 09-06-2014 02:37 AM
విజయవాడ సిటీ, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): పరిటాల రవి హత్య కేసును తిరగదోడి అసలు దోషులకు శిక్షపడేలా చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత తెలిపారు. తనకు ఏ పదవి, ఏ బాధ్యత అప్పగించినా రాష్ట్రాభివృద్ధికి, ప్రజల అభివృద్ధికి పాటుపడతానన్నారు. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి, ఆయన కుమారుడు జగన్ పరిటాల రవిని హత్య చేయించారని, వారి ఆగడాలకు 200 మంది పరిటాల అభిమానులు బలైపోయారని అన్నారు. తనకు మంత్రి పదవి రావడమంటే పరిటాల రవికి రావడమేనన్నారు. ఆయన మంత్రి పదవి కోసం ఎంతో ఎదురు చూశారని, ఆయనకు దక్కాల్సిన పదవి ఆయన స్థానంలో తనకు వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతపురంలో సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె అన్నారు. కరువు జిల్లా అనంతపురం అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె చెప్పారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలందరికీ అందేలా చర్యలు తీసుకుంటానన్నారు.

No comments:

Post a Comment