Tuesday 11 August 2015

చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు జగన్‌కు లేదు: పల్లె

చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు జగన్‌కు లేదు: పల్లె
హైదరాబాద్,ఆగస్ట్ 11: పార్టీ ఉనికి కోసమే ఢిల్లీలో వైఎస్‌ జగన్‌ దీక్ష చేశారని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. ఏపీకి అన్యాయం జరిగినప్పుడు జగన్‌ ఎప్పుడూ మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు జగన్‌కు లేదని పల్లె అన్నారు. మునికోటి ఆత్మహత్య బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా రాష్ట్రానికి వచ్చి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై త్వరలో చంద్రబాబు ప్రధానిని కలుస్తారని మంత్రి పల్లె తెలిపారు.

No comments:

Post a Comment