Sunday 16 August 2015

ప్రత్యేక ప్యాకేజి గురించి లేఖలో అడిగి, ప్రత్యేకహోదా అడిగినట్టు చెబుతారా?:జూపూడి

ప్రత్యేక ప్యాకేజి గురించి లేఖలో అడిగి, ప్రత్యేకహోదా అడిగినట్టు చెబుతారా?:జూపూడి
హైదరాబాద్, ఆగస్టు16 : వైసీపీపై టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ రాసిన లేఖలో కోరిందొకటి.. ప్రజలకు చెప్పింది మరొకటని ఆయన దుయ్యబట్టారు. ప్రత్యేక ప్యాకేజి గురించి లేఖలో అడిగి, ప్రత్యేకహోదా అడిగినట్టు చెబుతున్నారని మండిపడ్డారు. జగన్ తీరును ప్రజలు గమనిస్తున్నారనీ, సమయం వచ్చినపుడు ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. ప్రత్యేక హోదాను టీడీపీ సాధించి తీరుతుందని జూపూడి స్పష్టం చేశారు.

No comments:

Post a Comment