Monday 17 August 2015

నవ్యాంధ్రకు వెళ్లిపోదాం! - అశోక్‌బాబు

నవ్యాంధ్రకు వెళ్లిపోదాం!
ఎప్పటికైనా హైదరాబాద్‌ను వీడాల్సిందే!

నెల్లూరు: హైదరాబాద్‌లో పని చేస్తున్న ఏపీ ఉద్యోగులు సొంత రాష్ట్రానికి తరలి వెళ్లేందుకు సిద్ధం కావాలని ఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. ఆదివారం రాష్ట్ర జేఏసీ సమావేశంలో పాల్గొనేందుకు నెల్లూరు వచ్చిన ఆ యన విలేకరులతో మాట్లాడారు. తాత్కాలిక రాజధానిని ఎప్పటికైనా వదలాల్సిందేనని చెప్పారు. నూతన రాజధానిలో ఉద్యోగులందరికీ తగిన వసతులు కల్పించడంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదన్నారు. వచ్చేనెల 2న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సమ్మెలో ఎన్జీవోలు భాగస్వాములుకావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment