Saturday 29 August 2015

నా ప్యాకేజీ 2.7 లక్షల కోట్లు: నితీశ్‌

నా ప్యాకేజీ 2.7 లక్షల కోట్లు: నితీశ్‌
Updated :29-08-2015 03:46:45
పట్నా: బిహార్‌కు ప్రధాని మోదీ రూ.1.65 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తే.. ఆ రాష్ట్ర సీఎం నితీశ్‌ కుమార్‌ రూ.2.7 లక్షల కోట్ల అభివృద్ధి ప్యాకేజీని ప్రకటించారు. ప్రతి కుటుంబానికి ఉచిత విద్యుత్తు, మంచినీరు తదితరాలు కల్పిస్తామని, రాబోయే ఐదేళ్లలో ఈ నిధులు ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. మోదీ ప్యాకేజీపై విమర్శలు గుప్పించారు. ‘‘ఆ ప్యాకేజీ అద్భుతమని గొప్పలు చెప్పుకొన్నారు. కానీ, నా 2.7 లక్షల కోట్ల విజన్‌ అమలుకు అవకాశమున్న పథకాలతో కూడి ఉంది. ఇవి నా హృదయంలోంచి వస్తున్న మాటలు (దిల్‌ కీ బాత్‌). మనసులోంచి వస్తున్న మాటలు (మన్‌ కీ బాత్‌) కాదు’’ అని నితీశ్‌ వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment