Wednesday 26 August 2015

బాలీవుడ్ సినిమాను తలపిస్తోన్న షీనా మర్డర్ స్టోరీ

బాలీవుడ్ సినిమాను తలపిస్తోన్న షీనా మర్డర్ స్టోరీ

ముంబై, ఆగస్ట్ 26: స్టార్ ఇండియా సిఈఓ పీటర్ ముఖర్జీ భార్య ఇంద్రాణి ముఖర్జీ అరెస్టయ్యాక ఆమె ముంబై పోలీసులకు వెల్లడించిన విషయాలు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. కుమార్తెను సోదరిగా పరిచయం చేసిన ఇంద్రాణి భర్త పీటర్‌కు ఏ రోజూ నిజం చెప్పలేదు. ఇదే ఆమె చేసిన తొలి పెద్ద తప్పైంది. పీటర్‌తో వివాహానికి ముందే తనకు పిల్లలున్నారని చెప్పేందుకు ఇంద్రాణి సందేహించింది. పీటర్‌తో ఇంద్రాణి వివాహానికి ముందే ఆయనకు మరో భార్య ద్వారా పుట్టిన కుమారుడు షీనాతో ప్రేమలో పడ్డాడు. అంటే తాను ప్రేమలో పడింది తన చెల్లెలు వరుసైన అమ్మాయితో అని పీటర్ కుమారుడికి తెలియదు. వీరిద్దరి సంబంధం గురించి తెలిశాక ఇంద్రాణి అసలుకే మోసం వస్తుందని గ్రహించి కుమార్తె షీనాను అడ్డు తొలగించుకోవాలనుకుంది. తన డ్రైవర్‌ను ఈ పనికి పురమాయించింది. 2012లో షీనాను చంపేశాక ఆమె మృత దేహాన్ని రాయ్‌గఢ్ అటవీ ప్రాంతంలో పూడ్చేశారు. ఆ తర్వాత ఇంద్రాణి ఏమీ తెలియనట్లు నటించడం ప్రారంభించారు. షీనా గురించి పీటర్ కుమారుడు అడిగినప్పుడల్లా అమెరికాలో ఉందని ఇంద్రాణి చెప్పేవారు. చివరకు పాపం పండి ముంబై పోలీసులు తొలుత ఇంద్రాణి డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. అతడిచ్చిన వివరాల ఆధారంగా ఇంద్రాణి ముఖర్జీని కూడా అరెస్ట్ చేశారు. ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా ఇంటరాగేషన్‌లో షీనా తన కుమార్తె అని, సోదరి కాదని ఇంద్రాణి ఒప్పుకున్నారు. హత్యకు కుట్ర పన్నిన విషయాన్ని కూడా ఒప్పుకున్నారని సమాచారం. భార్య తనకు అబద్ధాలు చెప్పిందని తెలిసి పీటర్ ముఖర్జీ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు.

No comments:

Post a Comment