Monday 24 August 2015

ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ

ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ

న్యూఢిల్లీ, ఆగస్టు 25 : ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం ఉదయం సమావేశమయ్యారు. ఏపీకి ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీపై చర్చకొనసాగుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. అయితే విభజన హామీలను నెరవేర్చాలని బాబు ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఏపీలో పారిశ్రామికాభివృద్ధి, పోలవరం ప్రాజెక్టులపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. ఏపీ ఆర్థికంగా నిలదొక్కకునేంత వరకూ సాయం చేయాలని ప్రధానిని చంద్రబాబు కోరినట్లు సమాచారం.
 
అంతకుముందు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, రాజ్‌నాథ్ సింగ్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటామని సమావేశం అనంతరం రాజ్‌నాథ్ తెలిపారు. హోదాను రాజకీయం చేయడం తగదని వెంకయ్య అన్నారు. తెలుగువాడిగా రాష్ట్రానికి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. విభజన చట్టం అమలయ్యేలా చూడాలని హోంమంత్రిని కోరామని వెంకయ్య తెలిపారు.

No comments:

Post a Comment