Saturday 29 August 2015

సోంపేట థర్మల్‌ ప్లాంట్‌ రద్దు..ఆ భూముల్లో వ్యవసాయ ఆధార పరిశ్రమలు : అచ్చెన్నాయుడు

సోంపేట థర్మల్‌ ప్లాంట్‌ రద్దు..ఆ భూముల్లో వ్యవసాయ ఆధార పరిశ్రమలు : అచ్చెన్నాయుడు
Updated :29-08-2015 17:22:17
విజయవాడ, ఆగష్టు 29 : సోంపేట థర్మల్‌ ఫ్లాంట్‌ను రద్దు చేస్తూ ఏపీ కేబీనెట్‌ శనివారం నిర్ణయం తీసుకుంది. థర్మల్‌ ఫ్లాంట్‌ నిర్మాణానికి సంబంధించి 1107 జీవోను రద్దు చేసింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా థర్మల్‌ ఫ్లాంట్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. థర్మల్‌ ఫ్లాంట్‌కు ఏపీఐఐసీ కేటాయించిన 972 ఎకరాల భూమిలో మల్టీ ప్రొడక్ట్‌ వ్యవసాయ ఆధార పరిశ్రమలు నెలకొల్పుతామని ఆయన వెల్లడించారు. జీవోను రద్దు చేసినందున థర్మల్‌ ఫ్లాంట్‌కు వ్యతిరేకంగా చేస్తున్న దీక్షలను నిలిపివేయాలని సోంపేట వాసులకు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. థర్మల్‌ ప్లాంట్‌కు వ్యతిరేకంగా అక్కడ ఐదున్నర ఏళ్ల నుంచి ప్రజలు దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే.

No comments:

Post a Comment