Sunday 30 August 2015

విభజన బిల్లును ఆమోదించినప్పుడు జగన్ ఎక్కడ దాక్కున్నారు: చంద్రబాబు

విభజన బిల్లును ఆమోదించినప్పుడు జగన్ ఎక్కడ దాక్కున్నారు: చంద్రబాబు
Updated :31-08-2015 11:59:47
హైదరాబాద్, ఆగస్టు 31: ప్రత్యేక హోదా కోసం చనిపోయిన వారి మృతుల కుటుంబాలకు ఏపీ అసెంబ్లీ సంతాపం తెలిపింది. ఈ తీర్మానంపై మాట్లాడిన జగన్ ప్రత్యేక హోదా కోసం జరిగిన బలిదానాలకు కారణం టీడీపీ, బీజేపీలేనని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష నేత ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం సరికాదన్నారు.వైసీపీ రాజకీయాల వల్లే రాష్ట్రం తగలబడిందని చంద్రబాబు ఆరోపించారు. బెయిల్ కోసం కాంగ్రెస్‌తో లాలూచీ పడింది జగనేనని, తమకు ఎలాంటి లాలూచీలతో పనిలేదని చంద్రబాబు తెలిపారు. కేసుల కోసం కాంగ్రెస్‌తో లాలూచీ పడి రాష్ట్రాన్ని విభజించిన పాపం వైయస్సార్ పార్టీదేనని చంద్రబాబు ధ్వజమెత్తారు. జనం తమపై నమ్మకంతో అధికార పీఠంపై కూర్చోబెట్టారని అన్నారు. పార్లమెంట్‌లో విభజనపై చర్చ జరుగుతున్నప్పడు జగన్ ఎక్కడ దాక్కున్నాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై 15నెలలుగా రాజీలేని పోరాటం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడేది ఎప్పటికైనా టీడీపీయేనని చంద్రబాబు చెప్పారు. హత్యలు చేయడం వైసీపీకి అలవాటని, ప్రజలను కాపాడడం తమ పార్టీకి అలవాటని చంద్రబాబు అన్నారు.

No comments:

Post a Comment