Monday 17 August 2015

యువకుడి హత్య కేసులో ప్రధాన నిందితుడు 14 ఏళ్ల బాలుడు

తూర్పుగోదావరి : యువకుడి హత్య కేసులో ప్రధాన నిందితుడు 14 ఏళ్ల బాలుడు
అమలాపురం, ఆగస్టు 18 : ఓ యువకుడిని కిరాయి గూండాలతో హత్య చేయించిన 14 ఏళ్ల బాలుడి ఉదంతం తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. అమలాపురానికి చెందిన యువకుడిని జులై 27న వాడలరేవు సమీపంలో హత్య చేశారు. ఈ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేయగా ప్రధాన నిందితుడు 14 ఏళ్ల బాలుడని పోలీసులు గుర్తించారు. బాలుడు పరారీలో ఉన్నాడు. కిరాయి గూండాలతో 14 ఏళ్ల బాలుడు యువకుడిని హత్య చేయించాడని పోలీసులు చెప్పారు. 

No comments:

Post a Comment