Wednesday 27 May 2015

ఓయూ జేఏసీ నేత దరువు అంజన్న అదృశ్యం

ఓయూ జేఏసీ నేత దరువు అంజన్న అదృశ్యం

హైదరాబాద్‌, మే 27 : ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత దరువు అంజన్న అదృశ్యం కలకలం రేపుతోంది. నిన్న(మంగళవారం) రాత్రి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రసమయి నుంచి బెదిరింపు కాల్స్‌ వచ్చాయని, ఆ తర్వాత నుంచి అంజన్న కనిపించకుండా పోయినట్లు సమాచారం. అంజన్న అదృశ్యంపై కుటుంబసభ్యులు కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిన్న సుందరయ్య విజ్ఞానకేంద్రంలో రసమయికి వ్యతిరేకంగా దరువు అంజన్న నిరసన ధూంధాం నిర్వహించిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment