Wednesday 20 May 2015

మ్యాగీ నూడుల్స్‌లో అధిక మోతాదులో సీసం!

మ్యాగీ నూడుల్స్‌లో అధిక మోతాదులో సీసం!

  • కలుషితమైనట్లు పరీక్షలలో వెల్లడి
  • సరుకును వాపస్‌ తీసుకోవాలని యూపీ సర్కార్‌ ఆదేశం
న్యూఢిల్లీ, మే 20: పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఇన్‌స్టెంట్‌ మ్యాగీ నూడుల్స్‌ తయారీ కంపెనీ నెస్టిల్‌ ఇండియాపై ఉత్తరప్రదేశ్‌ సర్కార్‌ వేటు వేసింది. దేశవ్యాప్తంగా అన్ని సూపర్‌బజార్లలోనూ, షాప్‌లలో ఒక బ్యాచ్‌లో తయారైన మ్యాగీ నూడుల్స్‌ సరుకును ఉపసంహరించుకోవాల్సిందిగా ఉత్తరప్రదేశ్‌లోని ఆహార భద్రతా, ఔషధ నియంత్రణ విభాగ(ఎ్‌ఫడీఏ) అధికారులు ఆ బ్రాండ్‌ను తయారు చేసే నెస్టిల్‌ ఇండియాను ఆదేశించారు. కొన్ని షాపులలోని మ్యాగీ నూడుల్స్‌ రెండు డజను ప్యాకెట్లను ఒక ప్రభుత్వ ల్యాబ్‌లో పరీక్షించి చూడగా వాటిలో సీసపు పదార్థం అనుమతించదగిన స్థాయికన్నా దాదాపు ఏడు రెట్లు అధికంగా ఉందని యూపీ ఎఫ్‌డీఏ విభాగ డీఐజీ శ్రీవాస్తవ తెలిపారు. ఈ బ్యాచ్‌లో తయారైన ఇన్‌స్టెంట్‌ నూడుల్స్‌ అన్నీ విషపూరితమయ్యాయనీ, వీటిలో సీసపు సాంద్రత 17.2 పీపీఎంగా నమోదయ్యిందని ఆయన అన్నారు.
 
 
సాధారణంగా సీసపు పదార్థం 0.01-2.5 పీపీఎం రేంజిలో ఉంటే ఫర్వాలేదని ఆయన చెప్పారు. రుచి కోసం అధిక మోతాదులో మోనోసోడియం గ్లుటోమేట్‌ను(ఎంఎ్‌సజీ) వినియోగించినట్లు కూడా పరీక్షలలో తేలినట్లు శాస్త్రజ్ఞులు చెప్పారు. కాగా, కంపెనీ ప్రతినిధి ఈ వార్తను ధ్రువీకరించారు. 2014 మార్చి బ్యాచ్‌లో తయారైన మ్యాగ్గీ నూడిల్స్‌ ప్యాకెట్లను ఉపసంహరించుకోవాలని యూపీ సర్కార్‌ ఆదేశించిన మాట వాస్తవమేననీ చెప్పారు. అయితే వీటిలో చాలా సరుకు ఇప్పటికే వినియోగించేశారని అన్నారు.  

No comments:

Post a Comment