Monday 1 June 2015

టీఆర్‌ఎస్‌ వ్యవహారం దొంగే... దొంగా అన్నట్లుగా ఉంది : బాబు!

టీఆర్‌ఎస్‌ వ్యవహారం దొంగే... దొంగా అన్నట్లుగా ఉంది
ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కేసీఆర్‌ కొంటున్నారు :బాబు!

హైదరాబాద్‌, జూన్‌ 1 : టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌లో సోమ వారం చర్చ జరిగింది. టీడీపీని టార్గెట్‌ చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో అన్నట్లు సమాచారం. ముగ్గురు సభ్యులు గెలిచేందుకు 63 మంది సభ్యులు ఉండగా... ఐదుగురు సభ్యులు గెలవాలంటే 85 మంది సభ్యులు కావాలనీ, మొత్తంగా ఇంత మంది సభ్యులను ఏ విధంగా బేస్‌ చూసుకుని ఐదుగురు సభ్యులను కేసీఆర్‌ బరిలోకి దించారన్నదానిపై కూడా చర్చ జరిగినట్లుగా సమాచారం.

అయితే కేసీఆరే టీఆర్‌ఎస్‌ పార్టీని దొంగే... దొంగా...దొంగా అన్నట్లుగా ఉందని, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి డబ్బులకు కొనుగోలు చేస్తున్న కేసీఆర్‌... ఇతర పార్టీలను టార్గెట్‌ చేస్తున్నారని... ఇప్పటికే ఇతర పార్టీలు... టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల సభ్యులను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నది ఎవరు? వారు ఏ విధంగా వెళ్లిందన్నదానిపై చంద్రబాబు మాట్లాడినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థ్థితుల్లో టీడీపీ బలంగా ఉంది కాబట్టి టీడీపీనే టార్గెట్‌ చేస్తూ, పార్టీని దెబ్బతీసే విధంగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని.. అయితే కేసీఆర్‌ది అంత క్రిమినల్‌ మైండ్‌ కాదని కూడా చంద్రబాబు మంత్రులతో అన్నట్లు తెలియవచ్చింది.

No comments:

Post a Comment