Tuesday 6 October 2015

టీఆర్‌ఎస్, ఎంఐఎంల పొత్తు కోసమే అసెంబ్లీ సమావేశాలు : లక్ష్మణ్

టీఆర్‌ఎస్, ఎంఐఎంల పొత్తు కోసమే అసెంబ్లీ సమావేశాలు : లక్ష్మణ్
Updated :06-10-2015 15:45:49
 హైదరాబాద్ : టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య పొత్తు కోసమే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నట్లుగా ఉందని భారతీయ జనతాపార్టీ శాసనసభాపక్ష నేత కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాజ్యాంగ సంక్షోభాన్ని నివారించేందుకే ఆరునెలలకోసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయే తప్ప సమస్యలకు పరిష్కారం మాత్రం లభించడం లేదరన్నారు. అలాగే రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ఆదుకునేందుకు కేంద్రం సిద్దంగా ఉందని, అయినా... ఆదిశగా ప్రభుత్వం కృషిచేయడం లేదన్నారు.

No comments:

Post a Comment