Friday 2 October 2015

పరవాడ హిందూజా పవర్‌ప్లాంట్ వద్ద ఉద్రిక్తత

పరవాడ హిందూజా పవర్‌ప్లాంట్ వద్ద ఉద్రిక్తత
Updated :03-10-2015 11:25:08
విశాఖపట్నం, అక్టోబర్ 3 : జిల్లాలోని పరవాడ హిందూజా వపర్‌ప్లాంట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్లాంట్ వద్ద ధర్నాకు యత్నించిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. హిందూజా పవర్‌ప్లాంట్ నిర్వాసితులు, స్థానిక గ్రామస్తుల సమస్యల పరష్కారం కోసం వైసీపీ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో అప్పికొండ దగ్గర బారికేడ్లను ఏర్పాటు చేసి భారీగా పోలీసులు మోహరించారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వైసీపీ నేతలను, వారి వాహనాలను పూర్తిస్థాయిలో అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. పెద్దఎత్తున వైసీపీ నేతలు అక్కడకు చేరుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

No comments:

Post a Comment