Saturday 17 October 2015

అమరావతి శంకుస్థాపన సంతోషాన్ని కలిగిస్తోంది - పవన్‌కల్యాణ్‌

 పవన్‌కల్యాణ్‌ను కలిసిన ఏపీ మంత్రుల బృందం
Updated :17-10-2015 11:09:57

హైదరాబాద్‌, అక్టోబరు 17 : నానక్‌రాంగూడలో సినిమానటుడు పవన్‌కల్యాణ్‌ను ఏపీ మంత్రుల బృందం కలిసింది. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని కోరుతూ ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, అయ్యన్నపాత్రుడులు పవన్‌కల్యాణ్‌ను ఆహ్వానించారు. రామానాయుడు స్టూడియో దగ్గర సెక్యూరిటీ సిబ్బంది ఓవరాక్షన్‌ చేశారు. మీడియా సిబ్బందిని లోపలకు అనుమతించలేదు. దీంతో మీడియా ప్రతినిధులు, సెక్యూరిటీ సిబ్బంది మధ్య తోపులాట జరిగింది. ఓ చానెల్‌ కెమెరామన్‌ కిందపడిపోయారు.

అమరావతి శంకుస్థాపన సంతోషాన్ని కలిగిస్తోంది - పవన్‌కల్యాణ్‌ 
Updated :17-10-2015 12:00:59
హైదరాబాద్‌, అక్టోబరు 17 : అమరావతి శంకుస్థాపన సంతోషాన్ని కలిగిస్తోందని పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అద్భుతమైన రాజధానిని నిర్మించుకుందామని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన విషయంలో తెలంగాణ - ఏపీ మధ్య సుహృద్భావ వాతావరణం ఉండటం సంతోషకరమన్నారు. ఈ నెల 22న గుజరాత్‌లో షూటింగ్‌ ఉందని, వీలు చూసుకొని హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని పవన్‌కల్యాణ్‌ వివరించారు.

No comments:

Post a Comment