Sunday 25 October 2015

ప్రధానికి జయదేవ్ క్షమాపణ చెప్పాలి: వీర్రాజు

ప్రధానికి జయదేవ్ క్షమాపణ చెప్పాలి: వీర్రాజు
Updated :25-10-2015 12:17:07
గుంటూరు, అక్టోబర్ 25: రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న,నిరంతర విద్యుత్‌, రుణమాఫీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేసినవేనని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో, బీజేపీ నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రదాని నరేంద్రమోడి ప్రత్యేక హోదా ఇవ్వబోమని ఎప్పుడూ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. అడ్డంకులు తొలగించే ప్రయత్నంలో ఉన్నామని వీర్రాజు తెలియజేశారు. మోదీ ప్రసంగంపై ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యలు సరికాదని ఆయన హితవు పలికారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని మోదీకి క్షమాపణ చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment