Saturday 8 August 2015

జగన్ దీక్షకు సీపీఎం, సీపీఐ మద్దతు‌: వైసీపీ నేత బొత్స

జగన్ దీక్షకు సీపీఎం, సీపీఐ మద్దతు‌: వైసీపీ నేత బొత్స

హైదరాబాద్, ఆగస్టు8‌: జగన్ దీక్ష రాజకీయ స్వార్థంతో చేస్తున్నది కాదని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే రాజకీయాలను పక్కనపెడతామని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా కోసం ఏ పార్టీ కలిసొచ్చినా కలుపుకెళతామని చెప్పారు. ఐదు వేల మందితో ఎల్లుండి ఢిల్లీలో జగన్ దీక్ష జరుగుతుందని బొత్స తెలిపారు. సీపీఎం, సీపీఐ నేతలతో జగన్ మాట్లాడారనీ, జగన్ దీక్షకు సీపీఎం, సీపీఐ మద్దతు పలికాయని అన్నారు. రాజకీయ వ్యాపారంలో టీడీపీ ప్రత్యేక హోదాను మరిచిందని, అందుకే తాము ముందుండి ఉద్యమాన్ని నడిపించాల్సి వస్తోందని ఆయన అన్నారు. పవన్ అధికారపక్షమో, ప్రతిపక్షమో చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment