Friday 24 July 2015

ప్లాన్‌ ఓకే... ప్లాట్లు ఎప్పుడు?

ప్లాన్‌ ఓకే... ప్లాట్లు ఎప్పుడు?
ఏపీ రాజధాని రైతుల మదిలో సందేహాలు

విజయవాడ, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ‘నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులు 2035 వరకు దశల వారీగా పూర్తవుతాయి. 2018 నాటికి తొలి దశ పనులు పూర్తవుతాయి’- రాజధాని ప్లాన్‌లో సింగపూర్‌ ప్రభుత్వం ఈ వాక్యాలను చేర్చడం భూములు ఇచ్చిన రైతులను అయోమయానికి గురి చేస్తోంది. రాజధాని భూములను దశలవారీగా అభివృద్ధి చేస్తే తమకు ఇవ్వాల్సిన ప్లాట్లను ఎప్పుడు ఇస్తారనే సందేహాలు వారిని ముసురుకుంటున్నాయి. ‘‘మాస్టర్‌ ప్లాన్‌, సీడ్‌ కేపిటల్‌ ప్లాన్‌ రెండూ చాలా బాగున్నాయి. కానీ, 2018 నాటికి తొలిదశ పనులు పూర్తవుతాయని అంటున్నారు. అప్పటికి సీడ్‌ కేపిటల్‌ మాత్రమే పూర్తవ్వవచ్చు. మరి మిగిలిన భూముల మాటేమిటి? వాటి అభివృద్ధి సంగతి ఏమిటి? వాటిని ఎప్పటికి అభివృద్ధి చేసి మాకు ప్లాట్లు కేటాయిస్తారు?’’ అని రాజధానికి భూమి ఇచ్చిన ఒక రైతు ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో ఉండగానే అన్ని ప్రాంతాలను కొంతమేరకు అభివృద్ధి చేయడంతోపాటు ప్లాట్ల విభజన కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి తమకు పట్టాలు ఇవ్వాలని రాజధాని రైతులు కోరుతున్నారు. భూ సమీకరణ నుంచి పైసా ఖర్చు లేకుండా రాజధాని నిర్మాణం వరకూ ప్రతిపక్షాలు రకరకాల సందేహాలను వ్యక్తం చేసినా.. విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసినా రైతులంతా ముఖ్యమంత్రి చంద్రబాబుపై విశ్వాసం ఉంచారు. ఆయనను నమ్మి భూములు ఇచ్చారు. చంద్రబాబు తమ ప్రాంతాన్ని అద్భుత మహా నగరంగా తీర్చిదిద్దగలరని కూడా నమ్ముతున్నారు. అయితే, దశలవారీగా రాజధానిని నిర్మిస్తే ప్లాట్ల విభజన, కేటాయింపు ఆలస్యం అవుతుందేమోనన్న ఆందోళన వారిని వేధిస్తోంది. వాస్తవానికి, భూ సమీకరణ పూర్తయిన తర్వాత.. రాజధాని నిర్మాణానికి ముందే ప్లాట్ల విభజన పూర్తవుతుందని, ఏ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు ఆ ప్రాంతంలోనే భూములు కేటాయిస్తామని చంద్రబాబు గతంలోనే ప్రకటించారు. కానీ, తాజా పరిణామాల నేపథ్యంలో వారిని సందేహాలు ముసురుకుంటున్నాయి.

తెలుగు జాతిది విడిపోయి కలిసే చరిత్ర

తెలుగు జాతిది విడిపోయి కలిసే చరిత్ర

  • చరిత్రను, భాషను మరిచిపోతే మనుగడ లేదు
  • తెలుగు భాష- సంస్కృతి సదస్సులో ఏపీ సీఎం 
రాజమండ్రి, జూలై 24: ‘‘తెలుగు జాతి చరిత్రలో అనేకసార్లు విడిపోయింది. శాతవాహనుల కాలంలో కూడా విడిపోయింది. మళ్లీ కలిసింది. ఇటీవల మళ్లీ విడిపోయింది. తెలుగు జాతికి విడిపోయి కలిసే చరిత్ర ఉంది. మనకు సుమారు 3000 ఏళ్లకుపైగా సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాచీన భాష, కళలు ఉన్నాయి. వాటిని కాపాడుకోవాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. గోదావరి పుష్కరాల సందర్భంగా స్థానిక ఆనం కళాకేంద్రంలో శుక్రవారం జరిగిన ‘తెలుగు భాష - సంస్కృతి’ సదస్సులో ఆయన మాట్లాడారు. చరిత్రను, భాషను మరిచిపోతే మనుగడ లేదని, భవిష్యత్‌ తరాల కోసం చరిత్రను నెమరువేసుకోవాలని, గుర్తుంచుకోవాలని, పరిణతి చెందుతూ భవిష్యత్‌ తరాలకు అవసరమైన నూతన శకానికి నాంది పలకాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పుష్కరాల సందర్భంగా తెలుగు జాతిని తిరుగులేని శక్తిగా నిలపాలన్నదే తన ఆశయమని చెప్పారు. ‘‘11 రోజుల్లో సుమారు 4.28 కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారు. ఇతర రాష్ట్రాలు.. ప్రాంతాల నుంచి వచ్చారు. ఇటువంటి మహా యజ్ఞాన్ని నిర్వహించడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. సదస్సులో మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ, సిరివెన్నెల సీతారామశాస్ర్తి, చేగొండి అనంత శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ కవి సిరివెన్నెలకు పుష్కర జ్ఞాపికను చంద్రబాబు అందజేశారు.
మనది ఆనంద ఆంధ్ర
‘‘భారతదేశంలో గొప్ప కుటుంబ వ్యవస్థ ఉంది. అమెరికాలో 20 ఏళ్లకే పిల్లలు ఇంటి నుంచి వెళ్లిపోతారు. భార్యాభర్తలు విడాకులు తీసుకుంటారు. 60-70 ఏళ్లలో ఒంటరి బతుకు. చైనాలో కుటుంబ నియంత్రణ తర్వాత కొంత మార్పు వచ్చింది. అక్కడ కొన్ని సమస్యలున్నాయి. జపాన్‌లో వృద్ధాప్య సమస్య మొదలైంది. యువకులు లేరు. మాట్లాడాలన్నా, మందులు వేసుకోవాలన్నా రోబోట్లతోనే! మనకు ఆ పరిస్థితి లేదు. ఇంటికెళ్లేసరికి పిల్లలు, కుటుంబ సభ్యులు అందరూ హాయిగా ఆహ్వానిస్తారు. అందరం కలిసి ఉంటాం. ఇది మన గొప్పతనం’’ అని చంద్రబాబు కొనియాడారు. ఇటీవల బాగా చదువుకున్న పిల్లలు పెళ్లిళ్ల తర్వాత స్వార్థం పెరిగి పిల్లలు వద్దనుకుంటున్నారని, తల్లిదండ్రులను వదిలేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు. ‘‘ఎంత సంపద ఉన్నా.. ఎన్ని సౌకర్యాలున్నా ఆనందముండాలి. కొందరు బంగారు కుర్చీలు, మంచాలు కూడా చేయించుకుంటున్నారు. పడుకోవడానికి గట్టిగా ఉండచ్చు ఉపయోగమేముంది? కొన్ని దేశాలకు సంపద ఉంది. కానీ, మనకున్న ఆనందం వాళ్లకు లేదు’’ అని చెప్పారు.

ఒవైసీవి మత రాజకీయాలు!

ఒవైసీవి మత రాజకీయాలు!
  • మెమన్‌కు ఉరిశిక్షపై వివాదం వద్దు: దత్తన్న
  • ఎంఐఎం గుర్తింపు రద్దు చేయాలి: కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : ‘యాకూబ్‌ మెమన్‌ ముస్లిం కాబట్టే ఆయనకు ఉరిశిక్ష విధించారు’ అన్న ఎంఐఎం అధినేత అసరుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. ‘‘మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయొద్ద్దు’’ అంటూ కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ గట్టిగా స్పందించారు. ముంబై పేలుళ్ల దోషి అయిన మెమన్‌ విషయంలో వివాదం లేవదీయొద్దని ఒవైసీకి ఘాటుగా సూచించారు. ఇంత జరిగినా, ఇప్పటికీ ఎంఐఎం ఆలోచన మారకపోవడం ఆక్షేపణీయమని మంత్రి ఢిల్లీలో మండిపడ్డారు. ఒవైసీ వ్యాఖ్యలు ఉగ్రవాదులు, నేరస్థులకు ఊతం ఇచ్చేలా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆయనపై చర్య తీసుకోవాలని టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. న్యాయస్థానం తీర్పునే వ్యతిరేకిస్తున్న ఎం ఐఎం పార్టీ గుర్తింపు రద్దుకు ఎన్నికల కమిషన్‌ ఆలోచన చేయాలన్నారు. దీని పై తాము ఈసీకి అప్పీలూ చేస్తామని హైదరాబాద్‌లో వెల్లడించారు. న్యాయవ్యవస్థపై గౌరవం లేని వారు పాకిస్థాన్‌ వెళ్లిపోవాలని బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌ అన్నారు. ఉగ్రవాదానికి మతంతో ముడిపెట్టడంకంటే నీచమైన పనిలేదని ఒవైసీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావదేకర్‌ మండిపడ్డారు

ప్రేమలో వైఫల్యం..నపుంసకత్వం.. వల్లే రైతు ఆత్మహత్యలు

ప్రేమలో వైఫల్యం..నపుంసకత్వం.. వల్లే రైతు ఆత్మహత్యలు
  • మన రైతులు భగ్న ప్రేమికులు
  • కేంద్ర వ్యవసాయ మంత్రి 
  • రాధామోహన్‌ వివాదాస్పద వ్యాఖ్య
  • సభకు లిఖితపూర్వక స్పష్టీకరణ
న్యూఢిల్లీ, జూలై 24: మన రైతులు భగ్న ప్రేమికులట. ప్రేమలో విఫలమయ్యే వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారట! దేశవ్యాప్తంగా జరుగుతున్న వేలాది రైతు ఆత్మహత్యలకు భగ్న ప్రేమలు కూడా ఒక కారణమట! ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసింది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌ సింగ్‌! రైతు ఆత్మహత్యలపై అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో ఆయన లిఖితపూర్వక జవాబు ఇచ్చారు. అందులో ఆత్మహత్యలకు పలు కారణాలను ప్రస్తావించారు. పెరిగిపోయిన అప్పులు.. పంటలు దెబ్బతినడం.. కరువు.. సామాజిక, ఆర్థిక, వ్యక్తిగత కారణాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా, ఆత్మహత్యలకు సాధారణ కారణాలు అంటూ జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ఇచ్చిన నివేదికను ఆయన చదివారు. అందులో భాగంగానే, ప్రేమలో విఫలం కావడం, నపుంసకత్వం, గర్భవతులు కాలేకపోవడం తదితరాలను ప్రస్తావించారు. ఇవి కూడా రైతు ఆత్మహత్యలకు కారణమని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు దారుణమని విమర్శించారు. ‘రైతుల ఇళ్లకు వెళ్లాల్సిందిగా మీ మంత్రులను ఆదేశించండి. అక్కడ ఏం జరుగుతోందో కళ్లారా చూడమని చెప్పండి’ అని ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ గాంధీ సూచించారు. మంత్రి రాధా మోహన్‌ సింగ్‌ క్షమాపణ చెప్పాలని ఎస్పీ నేత నరేశ్‌ అగర్వాల్‌ డిమాండ్‌ చేశారు. ఆత్మహత్యలకు మంత్రి చెప్పిన కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయని, క్షేత్రస్థాయి పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నమని సీపీఎం నేత సీతారాం ఏచూరి తప్పుబట్టారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది కాలంలో నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయిన రైతు ఆత్మహత్యలు 26 శాతం పెరిగాయని చెప్పారు. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని మంత్రి జవాబు స్పష్టం చేస్తోందని సీపీఐ నేత డి.రాజా విమర్శించారు. మంత్రి వ్యాఖ్యలు రైతులను అవమానించడమేనని, పార్లమెంటును తప్పుదోవ పట్టించిన మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రతిపాదిస్తామని జేడీయూ నేత కేసీ త్యాగి స్పష్టం చేశారు. అయితే, ప్రతిపక్షాల నుంచి విమర్శలు తీవ్రం కావడంతో మంత్రి రాధామోహన్‌సింగ్‌ వివాదాన్ని కాస్త సర్దుమణచడానికి ప్రయత్నించారు. ఎన్సీఆర్బీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే జవాబు ఇచ్చామని తెలిపారు.

Thursday 23 July 2015

రాహుల్ డైరక్ట్ అటాక్

రాహుల్ డైరక్ట్ అటాక్

న్యూ ఢిల్లీ, జులై 23: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సూటిగా విమర్శలు ఎక్కుపెట్టారు. లలిత్ మోదీ, వ్యాపం కుంభకోణంపై ప్రధాని మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. మౌనం వీడి సమాధానం చెప్పాలన్నారు. సుష్మా స్వరాజ్ లలిత్ మోదీకి సహకరించారని ఆరోపించారు. 

పుష్కరాల వైఫల్యానికి క్రైస్తవసంఘాల కుట్ర

రాజమండ్రి: పుష్కరాల వైఫల్యానికి క్రైస్తవసంఘాల కుట్ర-బండారు రమేష్‌

రాజమండ్రి, జూలై 23 : పుష్కరాల వైఫల్యానికి మాజీ ఎంపీ హర్షకుమార్‌తోపాటు కొన్ని క్రైస్తవ సంఘాలు కుట్ర పన్నాయని శ్రీరామ్‌సేన రాష్ట్ర అధ్యక్షుడు బండారు రమేష్‌ ఆరోపించారు. రాజమండ్రి తొక్కిసలాటకు వీరు చేసిన ప్రచారమే కారణమని ఆయన పేర్కొన్నారు. హర్షకుమార్‌ దీక్షను భగ్నం చేశారన్న కక్షతో కరెంటు వైర్లు తెగిపడ్డాయని పుకార్లు సృష్టించారని రమేష్‌ చెప్పారు. రాజమండ్రిలో నిన్న జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సైతం అనుమానాలున్నాయని రమేష్‌ ఆరోపించారు.

హైదరాబాద్‌ : రాజమండ్రి ఘటనపై హైకోర్టుకు వెళతా - మాజీ ఎంపీ హర్షకుమార్‌ కుమారుడు శ్రీరాజ్‌

హైదరాబాద్‌, జూలై 23 : రాజమండ్రిలో పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై తాను హైకోర్టుకు వెళతానని మాజీ ఎంపీ హర్షకుమార్‌ కుమారుడు శ్రీరాజ్‌ చెప్పారు. అధికారులు, పోలీసుల వైఫల్యం వల్లే రాజమండ్రి పుష్కరఘాట్‌ వద్ద తొక్కిసలాట జరిగిందని ఆయన ఆరోపించారు. సీఎం చంద్రబాబు, జిల్లా ఎస్పీ, కలెక్టరు, బోయపాటి శ్రీనులపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

తొక్కిసలాటలో విద్రోహ చర్యపై చర్చ
రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో విద్రోహ చర్య అంశం మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ‘‘పుష్కరాలు మొదలు కావడానికి ముందు రాజమండ్రి మాజీ ఎంపీ హర్షకుమార్‌ అక్కడ వేరేవారి సమస్యలపై దీక్ష చేశారు. ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి నిరసనగా ఆయన అనుచరులు పుష్కరాల ప్రారంభ సమయంలో కరెంటు తీగలు తెగిపడ్డాయని, షాక్‌ కొడుతోందని ప్రజలను భయబ్రాంతులను చేశారని, దాని వల్లే తొక్కిసలాట జరిగిందని మాకు బయటి నుంచి సమాచారం వస్తోంది. దీనిపై విచారణ జరపాలి’’’ అని మంత్రులు అచ్చెన్నాయుడు, పీతల సుజాత కోరారు. ఇది కొత్త కోణమని, దీనిని కూడా న్యాయ విచారణ పరిధిలోకి చేరుద్దామని చంద్రబాబు అన్నారు. తొలి రోజు తాను పుష్కరాల్లో పూజ ముగించి బయటకు వస్తున్నప్పుడు ఒక మహిళ తనను ఆపి కరెంటు తీగలు తెగి పడ్డాయని అంటున్నారని చెప్పారని చంద్రబాబు గుర్తు చేసుకొన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో భవనాల క్రమబద్ధీకరణ పథకం ప్రవేశపెట్టడానికి మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

ఈ శిక్ష సమాజానికి మంచి చేస్తుందా?

ఈ శిక్ష సమాజానికి మంచి చేస్తుందా?

భారతదేశానికి కావలసింది ముంబై హింసాకాండలూ పేలుళ్లూ గుజరాత్‌లూ పునరావృత్తం కాని పరిస్థితి. దేశంలో విధింపబడిన అవాంఛనీయమైన వాతావరణాన్ని పటాపంచలు చేసే సామరస్యం. ఈ శిక్షలూ కక్షలూ వాటిని సాధిస్తాయా? నేరానికి పాల్పడిన ముఖ్యవ్యక్తులు విదేశాల్లో భద్రంగా ఉంటే, దొరికిన వాడెవడో ఒకడిని ఉరితీయడం శిక్షావాదులకు మాత్రం మనోస్థైర్యాన్నిస్తుందా?... అభిప్రాయభేదాలతో నిమిత్తం లేకుండా ఉరిశిక్ష పడ్డ వారందరి తరఫునా మాట్లాడేవారెవరూ దేశంలో లేరు.

పదిహేనేళ్ల కిందట వచ్చిన హృతిక్‌రోషన్‌-కరిష్మాకపూర్‌ సినిమా ‘ఫిజా’ పెద్దగా ఆడలేదు కానీ ప్రశంసలు మాత్రం పొందింది. సంక్లిష్టమయిన పరిస్థితుల మధ్య సోదరుని కోసం అన్వేషిస్తూ వెళ్లిన ముస్లిం యువతిగా కరిష్మా నటన ఒక ఎత్తు అయితే, ఆ పరిస్థితుల చిత్రణలో కనిపించిన కించిత్‌ ధైర్యమూ వాస్తవికతా మరొక ఎత్తు. 1992-93లో జరిగిన ముంబయి హింసాకాండలో బాధితుడై తరువాత మాయమై టెర్రరిస్టుగా మారిన వ్యక్తి ఆ సినిమా కథానాయకుడు (హృతిక్‌రోషన్‌). సినిమా చూసిన వారికి దేశంలోని సంఘటనలు, వాటి స్పందనలు, స్పందనల ప్రతిస్పందనలు ఎటువంటి పరిణామాలను సృష్టిస్తున్నాయో స్ఫురిస్తుంది. 2007లో సంచలనం సృష్టించిన ‘బ్లాక్‌ ఫ్రైడే’ సంగతి చెప్పనక్కరలేదు. 1993 మార్చి 12 నాడు ముంబయిలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఇతివృత్తంగా నిర్మించిన, డాక్యుమెంటరీ అనదగ్గ చిత్రం అది. కార్యకారణ సంబంధాలను, నేరానికి పాల్పడిన, చిక్కుకుపోయిన వ్యక్తుల డోలాయమానస్థితిని, అనివార్యతలను కథనం చేసింది ఆ సినిమా. ముంబై పేలుళ్ల తీర్పును ప్రభావితం చేయగలదేమోనని మూడేళ్లపాటు ఆ సినిమా ప్రదర్శనను నిలిపివేశారు కూడా.
నిజాన్ని ఏ కొంచెం చెప్పినా కృతజ్ఞతగా ఉండవలసిన పాడు కాలం కాబట్టి కానీ, సినిమాల ప్రస్తావనా సహాయమూ అనవసరం. అంతా కళ్లకు కట్టినట్టు గుర్తున్నది. దలాల్‌సీ్ట్రట్‌ పేలుడుతో అప్పుడప్పుడే రంగం మీదకు వచ్చిన కేబుల్‌ టీవీ రంగుల్లో కంపించిపోవడం గుర్తున్నది. నడుస్తున్న చరిత్రకు నిర్ఘాంతపోవడమే తప్ప అర్థం చేసుకోగలిగిన తెరిపి ఇవ్వకుండా పదమూడు పేలుళ్లు వరుసగా గుండెల్లో పేలడం గుర్తున్నది. సాయంత్రానికల్లా వందల కొద్దీ మరణాల లెక్క తేలడమూ గుర్తున్నది. మొత్తం మీద మూడువందల పై చిలుకు చావులు, వెయ్యిమందికి పైగా క్షతగాత్రులు. అక్కడ నెత్తురోడినవారే కాదు, దృశ్యాలను చూసినవారు, వార్తలను చదివినవారూ అందరూ బాధితులే. ఎక్కడో ఏదో తెగింది. పెంచిపోషించిన వ్రణాలు ఏవో పగలిపోతున్నాయి. కొత్తకొత్త రణక్షేత్రాలు పురుడుపోసుకుంటున్నాయి.
ఎవరు మాత్రం దీన్ని సహిస్తారు? పొగిలిన దుఃఖం ఆగ్రహం కావలసిందే కదా? దేశంలో మునుపెన్నడూ తెలియని బీభత్సం అది. తొలిసారి ఆర్డీఎక్స్‌ వాడిన పేలుళ్లు అవి. లక్ష్యం అంటూ లేకుండా వీలయినచోట్లల్లా మానవహననానికి ఉద్దేశించిన దుర్మార్గం అది. అమాయక జనాన్ని ఉద్దేశించి జరిగిన తొలి ఉగ్రదాడికి ఇరవైరెండేళ్ల వయస్సు. అది ఆరంభమే కానీ అంతం కాదు, జరుగుతూనే ఉన్నాయి. హాహాకారాలూ ఆర్తనాదాలూ దేశవ్యాప్తం అయిపోయాయి. యాకుబ్‌ మెమన్‌కు ఉరిశిక్ష దాదాపుగా ఖాయం అయి పోయింది. ముంబై పేలుళ్ల కేసులో మరణశిక్ష ఖాయపడిన ఏకైక నిందితుడు. ‘స్వయంగా విధ్వంసంలో పాల్గొనలేదు కానీ చేసిన వాళ్ల వెనుక ఇతనున్నాడు’ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రాష్ట్రపతి క్షమాభిక్ష నిరాకరించారు. రివ్యూపిటిషన్‌ను కొట్టివేసింది. విచారణలోనో నిర్ధారణలోనో లోపాలూ అసమగ్రతలు ఉంటే శిక్ష నుంచి ఉపశమనం కలిగించే క్యూరేటివ్‌ పిటిషన్‌ను కూడా ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మహారాష్ట్ర గవర్నర్‌ కూడా క్షమాభిక్షను కాదంటే, జులై 30 నాడు మెమన్‌ను భారత రాజ్యం మరణింపజేస్తుంది. మెమన్‌ ఉరికంబం ఎక్కితే, ఎంతో కొంత న్యాయం జరిగిందని మూడువందల బాధిత కుటుంబాలు, కాళ్లూ చేతులూ పొగొట్టుకుని నిత్యనరకం అనుభవిస్తున్నవారూ సంతోషిస్తుండవచ్చు. వారిలో అతి కొద్ది మంది అయినా, న్యాయాన్యాయాలకు అతీతమైన నిర్వేదానికో, వైరాగ్యానికో, క్షమాగుణానికో లోనై ఇటువంటి శిక్షను కోరుకోకపోయీ ఉండవచ్చు. సాధారణ మానవ స్పందనకే అధికారం లభిస్తే కంటికి కన్ను పంటికి పన్ను మాత్రమే న్యాయం అవుతుంది. కానీ వేల ఏళ్ల నాగరికతా ప్రస్థానం, న్యాయశాస్త్ర పురోగమనం శిక్షల విచారణకు కూడా ఒక వ్యవస్థను, సర్వసమానతను, సభ్యతను అలవరిచాయి. అటువంటి న్యాయవ్యవస్థే మెమన్‌ను దోషిగా నిర్ధారించింది. కోర్టులకు ఏ రాగద్వేషాలూ ఉండవు. అవి సాక్ష్యాన్ని, చట్టాన్ని, దేశ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని తీర్పులు రాస్తాయి. కానీ ప్రాసిక్యూషన్‌లకు అంతటి పవిత్రతను ఆపాదించలేము. వ్యవస్థాంగాల కంటె మించి, ప్రజాస్వామిక శక్తులు, శ్రేణుల సముదాయాలు దీర్ఘకాలికమైన, సవ్యమయిన ఫలితాలను ఇచ్చే విశ్లేషణలకు, నిర్ధారణలకు రాగలగుతాయి. వారు మెమన్‌ ఉరితీత సందర్భాన్ని ఎట్లా చూస్తారు?
సమస్య ఎక్కడంటే, యాకూబ్‌ మెమన్‌తోనే ఈ నేరం .మొదలయిందా? జరిగిన నేరంలో ఇతని పాలు ఎంత? యాకూబ్‌ మెమన్‌ దోషనిర్ధారణ లోపరహితంగా జరిగిందా? యాకూబ్‌ మెమన్‌ ఉరితీత నేరవాతావరణాన్ని కొనసాగింపజేస్తుందా, సమసిపోయేట్టు చేస్తుందా? మరణశిక్ష వేయదగినంత నేరం మెమన్‌ చేయకపోయి ఉంటే, అప్పుడు కూడా బాధిత కుటుంబాలు హర్షిస్తాయా? అతను నిజానికి నిర్దోషిగానో ప్రాసిక్యూషన్‌కు సహకారిగానో వదిలివేయవలసిన వ్యక్తి అయితే కూడా అతని శిక్షను అతివాద ఉరితీతవాదులు సంతోషిస్తారా? ఇరవైమూడేళ్ల ఏకాంతవాస సుదీర్ఘ నిర్బంధం తరువాత అయినా సరే అతనిని వదిలివేయడం భారతదేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తుందని తెలిస్తే కూడా దేశభక్తులు అతనిని చంపేయమనే అనగలరా? సుప్రీంకోర్టు తుది నిర్ధారణ తరువాత కూడా ఇంకా మెమన్‌ తరఫున వాదనలు సమాధానాలు దొరకక మిగిలే ఉంటే జులై 30కి అతన్ని శిక్షించవలసిందే అనగలమా? భారతదేశానికి కావలసింది ముంబై హింసాకాండలూ పేలుళ్లూ గుజరాత్‌లూ పునరావృత్తం కాని పరిస్థితి. దేశంలో విధింపబడిన అవాంఛనీయమైన వాతావరణాన్ని (ఫిజా అంటే వాతావరణమే) పటాపంచలు చేసే సామరస్యం. ఈ శిక్షలూ కక్షలూ వాటిని సాధిస్తాయా? నేరానికి పాల్పడిన ముఖ్యవ్యక్తులు విదేశాల్లో భద్రంగా ఉంటే, దొరికినవాడెవడో ఒకడిని ఉరితీయడం శిక్షావాదులకు మాత్రం మనోస్థైర్యాన్నిస్తుందా?
ఆపరేషన్‌బ్లూస్టార్‌కూ ఇందిర దారుణ హత్యకు వేలాది సిక్కుల ఊచకోతకూ పంజాబ్‌ ఉగ్రవాదం విస్తరణకూ సంబంధం లేదనగలమా? ఐపీకేఎఫ్‌కూ రాజీవ్‌గాంధీ విషాదనిష్క్రమణకూ లంకె ప్రత్యేకంగా పెట్టాలా? ప్రతిసమస్యకూ సంఘటనకూ మూలకారణాలుంటాయి. ముంబై పేలుళ్ల దుఃఖాన్ని గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు అంతకు మూడు నెలల ముందు 1992 చివర-1993 మొదట జరిగిన ముంబై హింసాకాండ కూడా గుర్తుకు రావాలి. 1992 డిసెంబర్‌ 6న జరిగిన బాబ్రీమసీదు విధ్వంసం కూడా స్ఫురించాలి. బాబ్రీమసీదు కూల్చివేతకు నిరసనలపై పెద్ద ఎత్తున జరిగిన పోలీసుకాల్పులు, అనంతరం అది పౌరహింసగా పరిణమించి జరిగిన వేయి మరణాలు దేశచరిత్రలో మచ్చ వంటివి. ఆ క్రమంలోనే ముంబై పేలుళ్లు జరిగాయి. ఉద్వేగాలు, ప్రతీకారాలు ఏ నేరాన్ని మాఫీ చేయవు, నిజమే. కానీ ప్రతి నేరానికి పూర్వాపరాలుంటాయి. బాబ్రీమసీదు సంఘటనపై ఇంకా విచారణే పూర్తి కాలేదు. ముంబై హింసాకాండలో ఏ ఒక్క దోషికీ మరణశిక్ష పడలేదు. జస్టిస్‌ శ్రీకృష్ణ కమిషన్‌ చేసిన సూచనలను, సిఫార్సులను ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. అనేక నేరాల వరుసలో ఒక నేరానికి మాత్రమే శిక్ష విధిస్తే, అది ఎటువంటి అర్థాలను ఇస్తుందో తెలియదా? యాకూబ్‌ మెమన్‌ సాంకేతికంగా దోషి అనో నిర్దోషి అనో చెప్పడం లేదు. శేషప్రశ్నల గురించి మాత్రమే చర్చ. ఆ ప్రశ్నలు అందరికీ సంబంధించినవి. టైగర్‌ మెమన్‌కు సోదరుడయినందుకు మాత్రమే అతన్ని శిక్షిస్తున్నారని అతని కుటుంబం అనుకుంటోంది. యాకూబ్‌ మెమన్‌ లేకపోతే ముంబై పేలుళ్ల కేసులో టైగర్‌ మెమన్‌-దావూద్‌ పాత్ర నిర్ధారణ అయ్యేదే కాదని విచారణను దగ్గరగా పరిశీలించినవారు చెబుతున్నారు. ముంబై పేలుళ్లకు ముందే దేశం విడిచిపెట్టి వెళ్లిన మెమన్‌ కుటుంబంలో యాకూబ్‌ ఒక్కడే దేశం తిరిగి వచ్చి, నేరంలో తన భాగాన్ని కడిగేసుకోవడానికి సిద్ధపడ్డాడు. పాక్‌ నుంచే తాను సీబీఐని సంప్రదించానని, అప్రూవర్‌గా మారడానికి సిద్ధపడి నేపాల్‌ సరిహద్దులో లొంగిపోయానని, కానీ భారత హోంశాఖ తనను ఢిల్లీలో అరెస్టు చేసినట్టు ప్రకటించిందని మెమన్‌ న్యూస్‌ట్రాక్‌ ఇంటర్వ్యూలో చెప్పాడు. అతని వాదన అరణ్యరోదనే అయింది. నిజంగానే భారతీయ ప్రాసిక్యూషన్‌ అతని సాయం తీసుకుని, తరువాత అతనినే దోషిగా నిలబెట్టిందా? అదే నిజమయితే దేశానికి అది గౌరవమా? ‘‘పెద్ద గాంధేయవాదిలాగా ఇండియాకు వెడుతున్నావు, వాళ్లు మాత్రం నిన్ను టెర్రరిస్టుగానే చూస్తారు’’ అని టైగర్‌ మెమన్‌ తన సోదరుడితో అన్నాడట. అదే నిజమయిందా? తన పిల్లలను భారతీయులుగానే పెంచాలనుకుంటున్నానని యాకూబ్‌ మెమన్‌ చెప్పాడు. అట్లా అనుకోవడం పొరపాటు అయిందా? దేశంలో మరణశిక్ష పడిన ఖైదీలలో నూటికి 75 శాతం మంది బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలవారేనని లెక్కలు చెబుతున్నాయి. లెక్కలే కాదు, దేశ లా కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఎ.పి. షా మాట్లాడుతూ సాధారణంగా పేదలూ బలహీనులే ఉరికంబం ఎక్కుతారని అన్నారు. దేశంలో మరణశిక్ష విధింపును సమీక్షించవలసిన అవసరం ఉందని కూడా వ్యాఖ్యానించారు. వ్యవస్థను ఏరకంగానూ ఒత్తిడి చేయలేని వారే అంతిమశిక్ష దాకా వెడతారు. దేశంలోని ఏ ఒత్తిడి బృందమూ మెమన్‌ తరఫున వాదించే పరిస్థితి లేదు. నేరానికి కఠిన శిక్షలు వేయడమే భద్రమైన సమాజాన్ని సృష్టిస్తుందని నమ్మేవారు చాలా మంది ఉంటారు. ఎంతటి దుర్మార్గమైన నేరం చేసిన వారికైనా మరణశిక్ష విధించగూ డదని, నేరాలను శిక్షలు నిరోధించలేవని నమ్మేవారూ లోకంలో ఉన్నారు. గాంధీజీని నాథూరామ్‌ గాడ్సే హత్య చేసినప్పుడు, హంతకుడికి మరణశిక్షను వ్యతిరేకించినవారిలో గాంధీగారి ఇద్దరు కుమారులూ ఉన్నారు. అంతే కాదు, జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా ఉన్నారు. వారెవరూ గాడ్సేవాదులు కారు. నేరస్థుడికి క్షమ అడిగినవారిని నేరానికి సమర్థుకులుగా చిత్రించే రోజులు అప్పటికి రాలేదు. ఇవాళ యాకూబ్‌ మెమన్‌ మరణశిక్ష గురించి భారతీయ పౌరసమాజం గంభీరమైన మౌనాన్నే ప్రదర్శిస్తుంది. అభిప్రాయభేదాలతో నిమిత్తం లేకుండా ఉరిశిక్ష పడ్డ వారందరి తరఫునా మాట్లాడేవారెవరూ దేశంలో లేరు.

Wednesday 22 July 2015

రాజధాని గ్రామాల చుట్టూ రోడ్ల అభివృద్ధి

రాజధాని గ్రామాల చుట్టూ రోడ్ల అభివృద్ధి
తాడికొండ : రాజధాని ప్రాంతంలోని గ్రామాల చుట్టూ హద్దు రోడ్లు నిర్మించాలని సింగపూర్‌ నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. ప్రస్తుతం విస్తరించిన గ్రామ కంఠాలతో అనేక గ్రామాల హద్దులు సరిగ్గా లేవు. దీంతో గ్రామాల హద్దులు నిర్ణయించి, ఆయా గ్రామాల చుట్టూ రోడ్లు వేయాలని ప్రతిపాదించారు. భవిష్యత్‌ అవసరాల కోసం గ్రామాల చుట్టూ కొంత భూమిని వదిలి రోడ్లు వేస్తారని అధికారులు చెప్తున్నారు. దీంతో రాజధానిలోని 29 గ్రామాల హద్దులు తెలియజేయడంతో పాటు గ్రామ కంఠాల సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు. రాజధాని చుట్టూ వలయాకారంలో వచ్చే పెద్ద రోడ్లతో పాటు గ్రామానికి గ్రామానికి మధ్య రహదార్లను మరింత విస్తరించనున్నట్లు సమాచారం. రాజధానిలోని గ్రామాలను కదలించబోమని మంత్రులు చెప్తున్నందున గ్రామాల్లో అంతర్గతంగా సిమెంట్లు రోడ్లు వేసి, సుందర గ్రామాలుగా తీర్చిదిద్ధేందుకు సీఆర్‌డీఏ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
భూమిపూజ ప్రదేశం వద్ద
పోలీస్‌ భవనం 

రాజధాని భూమిపూజ ప్రదేశం పర్యాటక స్థలంగా మారుతుండడంతో పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. ఇన్నాళ్లు తాత్కాలికంగా గుడారంలో తలదాచుకుంటున్న పోలీస్‌ సిబ్బందికి పక్కా భవనాన్ని నిర్మించారు. పోలీస్‌ అవుట్‌పోస్టు తరహాలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. మందడంలోని 136 సర్వే నెంబరు భూమిలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానికి భూమిపూజ నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ ప్రదేశంలో 24 గంటల పోలీస్‌ పహరా ఏర్పాటు చేశారు. ఐదుగురు కానిస్టేబుల్స్‌ రోజు మార్చి రోజు విధులు నిర్వర్తిస్తున్నారు. త్వరలో దీనిని పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రారంభించనున్నట్లు చెప్తున్నారు.

వక్ఫ్‌ భూములను అన్యాక్రాంతం కానివ్వొద్దు

వక్ఫ్‌ భూములను అన్యాక్రాంతం కానివ్వొద్దు
గుంటూరు, ఆంధ్రజ్యోతి: జిల్లాలో వక్ఫ్‌ భూములు అన్యా క్రాంతం కాకుండా పరిరక్షించడానికి పకడ్బందీగా చర్యలు చేపట్టాలని మైనార్టీ సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్‌ ఇక్బాల్‌ స్థానిక అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, మైనార్టీ, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇక్బా ల్‌ మాట్లాడుతూ గుంటూరు నగరంలోని సర్వే నెంబర్‌ 234 నుంచి 245 వరకు, నెంబర్‌ 247లలో 180 ఎకరాలు, పెదకాకాని మండలంలోని వెనిగళ్ళలో 50.68 ఎకరాలు, నల్లపాడులో 9 ఎకరాలు, పేరేచర్లలో 8 ఎకరాలు మేర విలువైన వక్ఫ్‌ భూములున్నాయన్నారు. నగరానికి సమీపంలో ఆ భూములున్నందున వాటిని ఆక్రమణదారులు కబ్జా చేసే అవకాశం ఉంటుందన్నారు. దీని దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. వక్ఫ్‌ బోర్డు ఇన్‌స్పెక్టర్‌తో పాటు స్థానిక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, వీఆర్‌వోలు ఒక బృందంగా ఏర్పడి ప్రతీ శుక్రవారం భూములను తనిఖీ చేసి కలెక్టర్‌కు నివేదిక సమర్పించాలన్నారు. మైనార్టీలలో పేద మహిళల వివాహ ఖర్చుల కోసం ప్రభుత్వం దుల్హన్‌ పథకం కింద రూ. 50 వేలు ఆర్థిక సాయం చేస్తోందన్నారు. జిల్లాలో మైనార్టీల సంక్షేమ పథకాల అమలు కోసం రూ. 70 లక్షల సబ్సిడీ అందుబాటులో ఉందని, దానిని వినియోగించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో గుంటూరు ఆర్‌డీవో భాస్కర్‌నాయుడు, రెవెన్యూ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

విజయవాడ కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వండి

విజయవాడ కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వండి.. ట్యాపింగ్‌ కేసులో సుప్రీంకు సర్వీస్‌ ప్రొవైడర్లు.. నేడు విచారణ

న్యూఢిల్లీ, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఈనెల 24వ తేదీలోపు కాల్‌డేటా సమాచారాన్ని సమర్పించాలంటూ విజయవాడ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిసే్ట్రట్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరుతూ సర్వీస్‌ ప్రొవైడర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆరు నెలల సీడీఆర్‌ను భద్రపరచాలని, తెలంగాణ అధికారులు రాసిన లేఖలు ఇవ్వాలని, ట్యాపింగ్‌ జరగకపోతే అదే విషయాన్ని తెలియజేయాలంటూ ఈనెల 17న విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సహా పలు టెలికాం సర్వీసు ప్రొవైడర్లు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌ భానుమతిలతో కూడిన ధర్మాసనం ముందు సీనియర్‌ న్యాయవాది లావు నాగేశ్వరరావు బుధవారం ప్రస్తావించారు. కేసు తీవ్రత దృష్ట్యా, ఆదేశాల అమలుకు మరో రోజు మాత్రమే గడువు ఉన్నందున తక్షణం దీనిపై విచారణ జరపాలని, కింది కోర్టు ఆదేశాలను నిలుపుదల చేస్తూ మధ్యంతర స్టే ఇవ్వాలని కోరారు. అయితే, ఈ పిటిషన్‌పై గురువారం ఉదయం విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది.

కృష్ణ పొడవునా ఆకాశహర్మ్యాలు.. 2050కి కోటిమందికి ఆవాసం.

కృష్ణ పొడవునా ఆకాశహర్మ్యాలు.. 2050కి కోటిమందికి ఆవాసం.. 90 రోజుల్లో ఏపీ సీడ్ కేపిటల్ ఏర్పాట్లు

  • ప్రధాన ఆకర్షణగా కృష్ణా తీర రహదారి
  • రాజ్‌పథ్‌కు దీటుగా కేంద్ర రహదారి
హైదరాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కృష్ణానదీ తీరం పొడవునా ఆకాశహార్మ్యాలు దర్శనమివ్వనున్నాయి. 2050 నాటికి అమరావతిలో కోటి మంది నివాసం ఉండే అవకాశం ఉందని ఏపీ సర్కార్‌ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా నదీ తీరం పొడవునా బహుళ అంతస్థుల నివాస సముదాయాల నిర్మాణానికి సింగపూర్‌ ప్రభుత్వం ఇచ్చిన మాస్టర్‌ప్లాన్‌లో చోటు కల్పించారు. ఈ భారీ అపార్టుమెంట్లను నిర్మించే బాధ్యతను తీసుకునేందుకు సింగపూర్‌ డెవలపర్లు ముందుకొస్తున్నారు. సుమారు 17 చదరపు కిలోమీటర్ల మేర ఆకాశహార్మ్యాల నిర్మాణానికి బిడ్‌ వేసేందుకు సింగపూర్‌ టౌన్‌షిప్‌ డెవలపర్లు సిద్ధమవుతున్నారు. ఇది ఒకే అయితే, దక్షిణ భారత దేశంలో వీరు నిర్మించే మూడో టౌన్‌షిప్‌ ఇదే అవుతుంది. ఏపీ రాజధాని నగరం సుమారు 7వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించనుంది. రాజధాని నగరం నడిబొడ్డున అసెంబ్లీ, సచివాలయం, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, ఇతర ప్రభుత్వ పాలనా విభాగాల కోసం భవంతులు నిర్మిస్తారు. ఈ భవంతుల నడుమ నివాస, వాణిజ్య భవనాలూ ఉంటాయి. వీటిలో నివాస సముదాయాలను నిర్మించేందుకు సింగపూర్‌ డెవలపర్లు ముందుకు వచ్చారు. అమరావతిలో ప్రజావసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని సింగపూర్‌ ప్రభుత్వం తన అధికారిక వెబ్‌సైట్‌లో సగర్వంగాప్రకటించింది. మరోవైపు తాము ఇచ్చిన మాస్టర్‌ ప్లాన్‌ను సమగ్రంగా అమలు చేసే డెవలపర్‌ను ఎంపిక చేసుకునే బాధ్యత ఏపీ సర్కార్‌దని సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ప్రకటించారు. సింగపూర్‌ టౌన్‌షిప్‌ డెవలపర్లు చైనా, వియత్నాంలో బహుళ అంతస్థుల భవనాల నిర్మాణంలో ప్రఖ్యాతిగాంచారని, వారి సేవలనూ ఏపీ సర్కార్‌ వినియోగించుకోవచ్చని ఆయన సూచించారు. అసెండస్‌ సింగ్‌ బ్రిడ్జ్‌, సెంబ్‌కార్ప్‌ వంటి సంస్థల సేవలు వినియోగించుకోవచ్చన్నారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో భవనాల నిర్మాణంలో తాము ముందంజలో ఉన్నామని సెంబ్‌కార్ప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కెవిన్‌ టో వివరించారు. భారతదేశంలోని 7 రాష్ట్రాల్లో 11వేల హెక్టార్లలో 3,300 మెగావాట్ల థర్మల్‌, సంప్రదాయేతర ఇంధనోత్పత్తి ప్లాంట్లను నిర్మించామన్నారు. ఇందులో ఏపీ కూడా ఉందన్నారు.
 
రమ్యమైన రహదారులు..
అమరావతిలో ప్రధాన రహదారులను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సర్కార్‌ భావిస్తోంది. సింగపూర్‌ బృందం ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమైన సందర్భంగా ఈ అంశంపై విస్తృత చర్చ జరిగింది. ‘కృష్ణ’ పేరు మీద పిలిచే కృష్ణాతీర రహదారి రాజధాని నగరంలో 3.8 కిలోమీటర్ల మేర ఉంటుందని అంచనా. దీనికి మధ్యలో ఒక వంతెన వస్తుంది. మొత్తం సీడ్‌ క్యాపిటల్‌లో ఇది కీలకం కానుంది. దీనికి ఒక పక్కన నది, మరో పక్కన వివిధ పర్యాటక ఆకర్షణలు, రెస్టారెంట్లు రానున్నాయి. దీనికి బస్‌రాపిడ్‌ విధానం, రైలు మార్గాలు అనుసంధానమై ఉంటాయి. 1.6కిలోమీటర్ల పొడవైన కేంద్ర రహదారి మరో ఆకర్షణ కానుంది. ఢిల్లీలో ఇండియా గేట్‌నుంచి రాష్ట్రపతి భవన్‌వరకూ ఉన్న విశాలమైన రహదారి తరహాలో ఉంటుంది. నగరం మధ్యలో రద్దీ తగ్గింపుతోపాటు పెద్ద ఆకర్షణగా దీన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించారు. వాణిజ్య ప్రాంతాన్ని అంతర్జాతీయ పరిభాషలో డౌన్‌టౌన్‌ అంటారు. ఇందులోని రహదారులను వీలైనంత వరకూ పాదచారులకు పరిమితంచేసే ప్రతిపాదన ఉంది. వీటికి అనుబంధంగా ఉన్న రహదారుల్లోకి వాహనాలను అనుమతిస్తారు. ఆకాశహర్మ్యాలు, అత్యాధునిక వాణిజ్య సముదాయాలు డౌన్‌టౌన్‌లో వస్తాయి.
దేశంలోనే తొలిసారిగా వాటర్‌ టాక్సీలు
దేశంలో మరెక్కడా లేనివిధంగా అమరావతిలో వాటర్‌ టాక్సీల విస్తృత వినియోగానికి ప్రణాళికలో ప్రాధాన్యమిచ్చారు. ఈ రాజధాని ప్రాంతం కృష్ణా నదికి అభిముఖంగా వస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు ఒక పాయను ప్రత్యేకంగా నగరంలోకి తీసుకువచ్చి అది మళ్లీ నదిలో కలిసే ఏర్పాటు చేస్తున్నారు. నదిలోను, అలాగే ఈ పాయలోను వాటర్‌ టాక్సీలను నడుపుతారు. రైల్వే స్టేషన్లు, బస్‌ స్టేషన్లకు బాగా దగ్గర్లో ఈ ట్యాక్సీ స్టేషన్లు కూడా ఉంటాయి. రాజధానిలో హైస్పీడ్‌ రైలు, బస్‌ రాపిడ్‌ సిస్టం, వాటర్‌ టాక్సీలను ఏర్పాటు చేస్తు న్నారు.
ప్రత్యేక నిర్మాణశైలిలో భవనాలు
రాజధానిలో భవనాలు చూడముచ్చటగా కనిపించే నిమిత్తం ఆర్కిటెక్చర్‌పై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ప్రభుత్వ భవనాలను ఆధునిక, సంప్రదాయ శైలి సమ్మేళనంతో నిర్మించనున్నారు. భవనాల్లో కొన్నింటిని లాండ్‌ మార్క్‌ నిర్మాణాలుగా ఎంపిక చేసి వాటిని ప్రత్యేకంగా తీర్చిదిద్దనున్నారు. అమరావతి గేట్‌ వే, కొన్ని ప్రముఖ ప్రభుత్వ భవనాలు ఇలా లాండ్‌ మార్క్‌ భవనాలుగా ఉండనున్నాయి. ఆకాశహర్మ్యాలు, పరిమిత అంతస్తుల భవనాలు కలిసి ఉండేలా చూస్తున్నారు. సీడ్‌ క్యాపిటల్‌ నగరం సరిహద్దులను చంద్రబాబు వద్ద జరిగిన భేటీలో ప్రాథమికంగా ఖరారుచేశారు. ఉండవల్లి గుహలనుంచి అమరావతి గ్రామం మధ్యవరకు సీడ్‌ క్యాపిటల్‌ ఉంటుంది. విజయవాడ-గుంటూరు రహదారిలో ప్రకాశం బ్యారేజి దాటాక కొంత దూరంలో ఉండవల్లి గుహలు ఉన్నాయి. దాని పక్క నుంచి తుళ్లూరు మీదుగా అమరావతికి ప్రస్తుతం ఒక రోడ్డు ఉంది.

రాజధానిలో ఉద్యోగులకు అపార్ట్‌మెంట్లు..

అద్భుత అమరావతి.. రాజధానిలో ఉద్యోగులకు అపార్ట్‌మెంట్లు.. రాజమండ్రిలో ఏపీ కేబినెట్ భేటీ, చర్చ

  • ఆసక్తి చూపుతున్న సింగపూర్‌, జపాన్‌
  • ఏడాదిలో రెవెన్యూ శాఖ ప్రక్షాళన
  • ఏపీలోనూ క్రమబద్ధీకరణకు అవకాశం
  • 80 గజాల్లోపు ఉంటే ఉచితం
  • పుష్కర తొక్కిసలాటపై ఆసక్తికర చర్చ
హైదరాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ఆసియా ఖండానికే తలమానికంగా నిలిచేలా అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మించాలని రాష్ట్ర కేబినెట్‌ తీర్మానించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌ్‌సలో ఏపీ కేబినెట్‌ సమావేశమైంది.ఈ సమావేశంలో పలు అంశాలపై 4 గంటలపాటు చర్చించారు. పుష్కరాల తొలిరోజు తొక్కిసలాటలో మృతిచెందిన వారికి సంతాపం ప్రకటించారు. ఇప్పుడు రాజమండ్రిలో పెట్టినట్లే మున్ముందు రాష్ట్రంలో ఇతర చోట్ల కూడా మంత్రివర్గ సమావేశాలు ఉంటాయని చంద్రబాబు చెప్పారు. నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంలో పాలు పంచుకోవడానికి సింగపూర్‌, జపాన్‌ దేశాలు ఆసక్తిగా ఉన్నాయని, దీనివల్ల రాజధాని నిర్మాణానికి నిధుల సమస్య ఉండకపోవచ్చునని కేబినెట్‌ సమావేశంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేబినెట్‌ సమావేశంలో సింగపూర్‌ ప్రభుత్వం తాజాగా సమర్పించిన సీడ్‌ క్యాపిటల్‌ ప్రణాళికపై చర్చ జరిగింది. ప్రణాళిక బాగుందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. తదుపరి కార్యాచరణ గురించి కూడా చర్చ వచ్చింది. ‘‘ప్రభుత్వానికి...ప్రభుత్వానికి మధ్య ఒప్పందం పేరుతో మనం సింగపూర్‌, జపాన్‌ ప్రభుత్వాలతో నేరుగా ఒప్పందం కుదుర్చుకొని రాజధాని నిర్మాణం వాటికి అప్పగించవచ్చు. కానీ పారదర్శకంగా ఉండాలన్న అభిప్రాయంతో స్విస్‌ చాలెంజ్‌ విధానంలో అమరావతి అభివృద్ధి భాగస్వామిని ఎంపిక చేయాలని నిర్ణయించాం. భాగస్వాములుగా సింగపూర్‌, జపాన్‌ ఎంపికైతే మనకు హాయిగా ఉంటుంది. వాళ్ల వద్ద నిధులున్నాయి. అంతర్జాతీయ అనుభవం ఉంది. సాంకేతిక పరిజ్ఞానం ఉంది. స్విస్‌ చాలెంజ్‌ ప్రక్రియలో పాల్గొనాలని మనం ఆ రెండు దేశాలకూ విజ్ఞప్తి చేద్దాం. వారితోపాటు ఇందులో పాల్గొనడానికి ఇతరులకు కూడా అవకాశం ఉంది. ఆ రెండు దేశాలకు మించిన మంచి ప్రతిపాదనతో మరెవరైనా వస్తే వారికైనా అవకాశం ఇద్దాం. మనకు మంచి రాజధాని త్వరితంగా నిర్మాణం కావాలి’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయన అభిప్రాయానికి మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నామని, స్విస్‌ చాలెంజ్‌ విధానంలో ఎంపికైతే ఈ సంస్థలో 50 శాతం వాటా తీసుకోవడానికి సింగపూర్‌ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. తాము ఎంతపెట్టుబడి పెట్టాలో.. దానిని ఎలా రాబట్టుకోవాలో కూడా సింగపూర్‌ సంస్థలు వాణిజ్యపరమైన అంచనాలు కూడా తయారు చేసుకొన్నాయని, తాము పెట్టిన పెట్టుబడిని రాబట్టుకోవడానికి రాజధాని ప్రాంతంలో మూడు వేల ఎకరాలు ఇస్తే దానిని వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తామని ఆ సంస్థలు ప్రాథమిక చర్చల్లో సంకేతాలు ఇచ్చాయని కూడా ఆయన చెప్పారు. వినోదపరమైన సంస్థలు, పర్యాటక కేంద్రాల ఏర్పాటుకు జపాన్‌ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని, ఇక్కడ పెట్టుబడులు పెడితే అవి సురక్షితంగా ఉండటంతోపాటు అవి తమకు తిరిగి వస్తాయన్న నమ్మకం వారిలో కలిగించగలిగామని ఆయన వివరించారు. 2018 సంవత్సరం నాటికి కొత్త రాజధానిలో పరిపాలనా భవనాల నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని, దానివల్ల రాజధానికి ఒక రూపు వస్తుందని ఆయన వివరించారు. రాజధానిలో ఉద్యోగుల గృహ నిర్మాణంపై కూడా చాలా ఆలోచనలు చేస్తున్నామని, ఎల్‌ ఐసీ నుంచి కేంద్రం ద్వారా రుణం తీసుకొని ఉద్యోగుల కోసం 30 వేల అపార్ట్‌మెంట్లు నిర్మించాలని యోచిస్తున్నామని ఆయన తెలిపారు.ప్రధాని మోదీ సూచన మేరకు పాత సోవియట్‌ రష్యా పరిధిలోని తజకిస్తాన్‌, కజకిస్తాన్‌ దేశాలు కొత్తగా నిర్మిస్తున్న వాటి రాజధానుల పరిశీలనకు ముందు అధికారుల బృందాన్ని పంపి ఆ తర్వాత అవసరం అనుకొంటే తాను...మంత్రులు కలిసి చూసి వస్తామని చంద్రబాబు తెలిపారు.
 
ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై
హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ప్రభుత్వ కార్యాలయాలు తరలించడంపై దృష్టి పెట్టి మంత్రులు పనిచేయాలని, దశలవారీగా తరలింపు చేపట్టాలని కేబినెట్‌ సమావేశం సందర్భంగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. హైకోర్టు విభజనపై కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ‘‘విభజన చట్టంలో దీనిపై పూర్తి స్పష్టత ఉంది. కొత్త రాజధానిలో హైకోర్టు భవన నిర్మాణం జరిగిన తర్వాతే ప్రస్తుతం ఉన్న ఉమ్మడి హైకోర్టు విభజన జరిగి కొత్త హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌కు తరలుతుంది. అప్పటిదాకా ప్రస్తుతం ఉన్న ఏర్పాటే కొనసాగుతుంది’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
 
ఏడాదిలో రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన
పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇవ్వకుండా తిప్పించుకొంటూ వేధిస్తున్నారన్న కారణంతో ఇటీవల ఇద్దరు ముగ్గురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడటంపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఈ పరిస్థితిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ కార్యాలయాల నుంచి ప్రజలు మొత్తం 61 రకాల సర్టిఫికెట్లు పొందాల్సి వస్తోందని ఆయన ఆ జాబితాను మంత్రులకు చదివి వినిపించారు. ‘‘ఈ పరిస్థితి నుంచి ప్రజలను తప్పించాలి. ఏ సర్టిఫికెట్‌ కోసం ప్రజలు రెవెన్యూకార్యాలయం గడప తొక్కాల్సిన అవసరం లేకుండా చేయాలి. భూ వివరాలను పూర్తిగా వెబ్‌ లాండ్‌ వెబ్‌సైట్లో నమోదు చేసి ఎవరైనా నేరుగా దాని నుంచి వివరాలు పొందగలిగే పరిస్థితి తేవాలి. దీని కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం కనీసం ఒక ఏడాదిపాటు క్రమం తప్పకుండా సమావేశమై ఈ వ్యవస్థను పూర్తిగా క్షాళన చేయాలి’ అని ఆయన ఆదేశించారు. ఇటీవల ఇసుక ర్యాంప్‌ నుంచి ఇసుక తరలింపుపై ఎమ్మార్వో వనజాక్షి, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరరావు మధ్య నెలకొన్న వివాదంపై కూడా చర్చ జరిగింది. ‘ఈ సంఘటనపై రెవెన్యూ అధికారులు వెంటనే ఆందోళన కూడా ప్రకటించారు. నేను జపాన్‌ నుంచి వచ్చిన తర్వాత విచారణ చేయిస్తే తప్పు ఎమ్మార్వోదేనని తేలింది. ఆమె పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దులోకి వెళ్లి వాహనాలు ఆపారు. అది ఆమె పరిధి కాదు. టీడీపీ ఎమ్మెల్యేది కూడా తప్పే. ఆయన ఆ సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లకుండా ఉండాల్సింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌ దీనిపై సరిగా స్పందించకపోవడంతో వివాదం పెద్దదైంది. ఆ జిల్లా మంత్రి ఉమా మహేశ్వరరావు కూడా మౌనం వహించారు’ అని చంద్రబాబు ఆక్షేపించారు.
 
సమ్మె విరమిస్తేనే డిమాండ్లు పరిష్కారం
ప్రస్తుతం జరుగుతున్న మునిసిపల్‌ కార్మికుల సమ్మెపై కఠిన వైఖరి అనుసరించాలని నిర్ణయించారు. ‘‘వాళ్లు ముందు విధుల్లో చేరితే వారి డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించడానికి నేను సిద్ధం. ఉద్యోగులకు నేను చాలా చేశాను. అయినా సమ్మెకు దిగడం ఏమిటి? మీరు వాళ్లతో మాట్లాడి ముందు విధుల్లో చేరమని చెప్పండి’’ అని మంత్రులకు సూచించారు. విశాఖ, విజయవాడల్లో 101 పద్దు కింద కిందకు మునిసిపల్‌ సిబ్బందిని చేరిస్తే వారి సమస్య తీరుతుందని ఒక మంత్రి చెప్పినప్పుడు దానికేమీ ఇబ్బంది లేదని, కాని ముందు సమ్మె విరమించాలన్నారు.
 
తొక్కిసలాటలో విద్రోహ చర్యపై చర్చ
రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో విద్రోహ చర్య అంశం మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ‘‘పుష్కరాలు మొదలు కావడానికి ముందు రాజమండ్రి మాజీ ఎంపీ హర్షకుమార్‌ అక్కడ వేరేవారి సమస్యలపై దీక్ష చేశారు. ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి నిరసనగా ఆయన అనుచరులు పుష్కరాల ప్రారంభ సమయంలో కరెంటు తీగలు తెగిపడ్డాయని, షాక్‌ కొడుతోందని ప్రజలను భయబ్రాంతులను చేశారని, దాని వల్లే తొక్కిసలాట జరిగిందని మాకు బయటి నుంచి సమాచారం వస్తోంది. దీనిపై విచారణ జరపాలి’’’ అని మంత్రులు అచ్చెన్నాయుడు, పీతల సుజాత కోరారు. ఇది కొత్త కోణమని, దీనిని కూడా న్యాయ విచారణ పరిధిలోకి చేరుద్దామని చంద్రబాబు అన్నారు. తొలి రోజు తాను పుష్కరాల్లో పూజ ముగించి బయటకు వస్తున్నప్పుడు ఒక మహిళ తనను ఆపి కరెంటు తీగలు తెగి పడ్డాయని అంటున్నారని చెప్పారని చంద్రబాబు గుర్తు చేసుకొన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో భవనాల క్రమబద్ధీకరణ పథకం ప్రవేశపెట్టడానికి మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

నిద్ర లేచే అలవాటు మీరు నేర్పారా?: బాబుపై కేసీఆర్ ఫైర్

హైదరాబాద్‌కు అమరావతి పోటీయా?.. నిద్ర లేచే అలవాటు మీరు నేర్పారా?: బాబుపై కేసీఆర్ ఫైర్

  • మర్యాద ఉండదు.. ఒకటి అంటే పది అంటం
  • నన్ను అనండి.. తెలంగాణను అంటే ఊరుకోను
  • మా పాలన మమ్మల్ని చేసుకోనివ్వరా?
  • దాశరథి జయంతి సభలో కేసీఆర్‌ ఆగ్రహం
  • శ్రీనివాసాచార్యకు దాశరథి అవార్డు ప్రదానం
హైదరాబాద్‌, జూలై 22 (ఆంధ్ర జ్యోతి): ‘‘మాకు నిద్ర లేచే అలవాటును మీరు నేర్పారా? తెలంగాణ సమాజం అంటే అంత చిన్న చూపా? మమ్మ ల్ని స్వతంత్రంగా పరిపాలించుకోనివ్వరా. ఎందుకు అంత అక్కసు, బాధ. పిచ్చి పిచ్చిగా మాట్లాడవద్దు’’ అని ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబునాయుడిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం  వ్యక్తం చేశారు. ‘‘మీ రాజధానిని బాగా నిర్మించుకోండి. మాకు సంతోషం. కానీ హైదరాబాద్‌తో పోటీ ఎందుకు? లక్షలాది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న హైదరాబాద్‌తో అమరావతికి పోటీయా? పద్ధతి మార్చుకో’’ అని హెచ్చరించారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని సగర్వంగా ఎలుగెత్తిచాటిన దాశరథి కృష్ణమాచార్య 91వ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం తొలిసారి అధికారికంగా బుధవారం రవీంద్ర భారతిలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ అస్తిత్వం గురించి పద్యాల ద్వారా ప్రపంచానికి చాటిన మహాకవి దాశరథి అని కొనియాడారు. మాతృభూమిని తల్లిగా భావించిన గొప్ప వ్యక్తి అని కీర్తించారు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఉనికిని దాశరథి ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి వారి చరిత్ర మరుగున పడిందని అభిప్రాయపడ్డారు. అలాగే.. ‘‘హైదరాబాద్‌ జనం లేటుగా నిద్రపోయేవారు. లేటుగా లేచేవారు. కానీ, ఎన్టీఆర్‌ వారికి ఉదయాన్నే లేవడం నేర్పారు’’ అంటూ మూడురోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు రాజమండ్రిలో చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్‌ ఈ సందర్భంగా తీవ్రంగా స్పందించారు. ‘‘నన్ను అంటే భరిస్తానుగానీ.. తెలంగాణ సమాజాన్ని ఏమైనా అంటే సహించేది లేదు. మాకు ఉండేదేదో ఉంది. లేనిదేదో లేదు. మా పాలన మేం చేసుకుంటున్నాం. మీకు అంత అక్కసు, బాధ ఎందుకు? పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు. నిద్ర లేవడాన్ని మీరు నేర్పారా? దీన్ని కవులు, కళాకారులు ఖండించాలి. ఇదేమి సంస్కారం. కేసీఆర్‌ను అంటే పడతాను. కానీ, తెలంగాణ సమాజాన్ని అంటే ఊరుకునేది లేదు. ఇది హెచ్చరిక. రీతి లేని పత్రికలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. వెకిలి రాతల్ని వండి వారుస్తున్నాయి. ఆంధ్రా రాజధానిని బాగా కట్టుకోండి. అయితే.. హైదరాబాద్‌తో అమరావతికి పోలికేంటీ? హైదరాబాద్‌ గొప్ప చరిత్ర ఉన్న నగరం. దీని విస్తీర్ణం 18.30 లక్షల చదరపు ఎకరాలు. ఫారెస్ట్‌కు వదిలినదే 1.50 లక్షల ఎకరాలు ఉంది. అమరావతికి, హైదరాబాద్‌కు ఏ రకంగా పోలిక? ఆంధ్రప్రదేశ్‌లోని మేధావులు కూడా ఆలోచించాలి. సినారే వంటి మేధావులు ఇక్కడ ఉన్నారు. ఆయనకు పోటీ ఉందా? ఎవరి ప్రతిభ వారికి ఉంటుంది. ఇప్పటికైనా బాబు భ్రమను వీడాలి. ఆంధ్రప్రదేశ్‌ పాలనపై దృష్టి పెట్టాలి. మీరు ఒకటి అంటే...మేం పది అంటాం. ఇప్పటికైనా అలాంటివి మానుకోవాలి. లేదంటే మర్యాద ఉండదు.’’ అని తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌ చారిత్రక నగరమని.. హైదరాబాద్‌ రాజధాని కావడం తెలంగాణ అదృష్టమని అన్నారు. తెలంగాణలోని కవుల ప్రతిభను గుర్తించేందుకు ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలను చేపడుతుందని, దీనిపై త్వరలోనే కార్యాచరణను ప్రకటిస్తామని కేసీఆర్‌ తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా దాశరథి సాహితీ పురస్కారాన్ని తిరుమల శ్రీనివాసాచార్యకు ముఖ్యమంత్రి ప్రదానం చేశారు. రూ. ఒక లక్షా వెయ్యి నూట పదహార్లు, మొమెంటో, శాలువాతో శ్రీనివాసాచార్యను ఘనంగా సత్కరించారు. అలాగే ఆయన రచించిన బంగారు తెలంగాణ పాటల పుస్తకం, సీడిలను కూడా ఆవిష్కరించారు. దాశరథి విశ్వకవి అని ఈ సందర్భంగా శ్రీనివాసాచార్య కీర్తించారు. ‘‘సినారె కవిత్వం జగన్మోహనం.. దాశరథి కవిత్వం విద్వత్వం’’ అని కొనియాడారు. ఇక.. ఏ గడ్డమీదైతే తెలంగాణ డైనమిజం అణచివేతకు గురైందో అదే గడ్డ మీద తెలంగాణ కవులను గౌరవించుకుంటున్నామని శాసనసభ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ డైనమిజాన్ని పెంచేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి పలు కవితలు చదివారు. సీఎం కేసీఆర్‌ గురించి రాసిన కవితలు చదివి ఆయనకు అంకితమిచ్చారు. కేసీఆర్‌ చింత అంతా తెలంగాణనే అన్నారు. తెలుగు వర్సిటీ వీసీ ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక విద్వత్తు-విద్యుత్తు.. అనే రెండు అంశాలపై దృష్టి పెట్టారన్నారు. తెలంగాణ తల్లిని మొట్టమొదట కీర్తించిన కవి దాశరథి అని.. దాశరథి బలమంతా తెలంగాణ అని. సీఎంవోలో ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌ అన్నారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కె.వి.రమణాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇంకా.. హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, దాశరథి కుమారుడు లక్ష్మణ్‌, సాంస్కృతిక సారథి చైరన్‌ సమయి బాలకిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

మాస్టర్‌ ప్లాన్‌లో ఏ ఊరికి ఏమిటి?

మాస్టర్‌ ప్లాన్‌లో ఏ ఊరికి ఏమిటి?

1 రాయపూడి వద్ద: అసెంబ్లీ, సచివాలయం
2 బోరుపాలెం సమీపంలో: పౌర సేవల కేంద్రం
3 అబ్బురాజుపాలెంలో: రాష్ట్ర మంత్రుల కార్యాలయాలు
4 దొండపాడులో: స్టేట్‌ గ్యాలరీ
5 బోరుపాలెం పరిధిలో కృష్ణా నది ఒడ్డున: సివిక్‌ ప్లాజా
6 లింగాయపాలెం ప్రాంతం
7 కొండమరాజుపాలెం పరిధిలో: హాస్పిటాలిటీ నోడ్‌
8 కొండమరాజుపాలెం, తుళ్లూరు మధ్య: ప్రాంతీయ ఆసుపత్రి
9 ఉద్దండ్రాయినిపాలెం ప్రాంతం
10 తాళ్లాయపాలెం, ఉద్దండ్రాయినిపాలెం, వెంకటపాలెం,
ఉండవల్లి సమీపాన: కెనాల్‌ పార్కులు
11 రాయపూడి సమీపంలో నది పక్కన: బొటానికల్‌ గార్డెన్‌
12 లింగాయపాలెం సమీపంలో నది పక్కన: బొటానికల్‌ జట్టి
13 ఉద్దండ్రాయినిపాలెం, తాళ్లాయపాలెం మధ్యలో: వాణిజ్య ప్రాంతం
14 తాళ్లాయపాలెం ప్రాంతం
15 వెంకటపాలెం మిట్ట భూముల్లో: విశ్వవిద్యాలయం
16 ఉండవల్లికి సమీపంలో: గేట్‌వే టౌన్‌
17 వెంకటపాలెం జరీబు భూముల్లో: వెట్‌ల్యాండ్‌ పార్కు
18 తాళ్లాయపాలెం, ఉద్దండ్రాయినిపాలెం సమీపంలో
కరకట్టకు దిగువన: సాంస్కృతిక కేంద్రం
19 తాళ్లాయపాలెం నది ఒడ్డున: కళా కేంద్రం
20 తాళ్లాయపాలెం లంక భూముల్లో: జట్టి డౌన్‌ టౌన్‌
21 తాళ్లాయపాలెం, ఉద్దండ్రాయినిపాలెం కరకట్టకు దిగువన: డౌన్‌టౌన్‌ కోర్‌
22 తాళ్లాయపాలెం, ఉద్దండ్రాయినిపాలెం కరకట్టకు ఎగువన: ఐకానిక్‌ టవర్‌
23 ఉద్దండ్రాయినిపాలెం దగ్గరలో: ఇండోర్‌ స్పోర్ట్స్‌ సెంటర్‌
24 ఉద్దండ్రాయినిపాలెం రేవు సమీపంలో: ఆహారశాలలు
25 ఉద్దండ్రాయినిపాలెం లంక భూముల్లో: గోల్ఫ్‌ కోర్స్‌
26 లింగాయపాలెం సమీపంలో నది ఒడ్డున: కన్వెన్షన్‌ సెంటర్‌
27 తాళ్లాయపాలెం సమీపంలో నది ఒడ్డున: విహార కేంద్రం

Minister paid part of $1 million bribe for Goa project, claims US firm

Minister paid part of $1 million bribe for Goa project, claims US firm

The bribery of USD 976,630 for a Goa project by Louis Berger included that to a minister, the details of which have not been disclosed by the Department of Justice.

PTI  Washington, July 18, 2015 | UPDATED 16:44 IST

MAIL

PRINT

A+ A-
115 SHARES
  
Picture: Wikipedia | Creative commons
A New Jersey-based construction management firm has been charged with bribing Indian officials several crores of rupees to win two major water developmental projects in Goa and in Guwahati. The bribery of USD 976,630 for a Goa project by Louis Berger included that to a minister, the details of which have not been disclosed by the Department of Justice.
On Friday, the company agreed to pay USD 17.1 million criminal fine to resolve charges that it bribed officials in India, Indonesia, Vietnam and Kuwait to secure government construction management contracts. Two of its former executives -Richard Hirsch (61) of Philippines, and James McClung (59) of the UAE - pleaded guilty to the bribery charges.
McClung previously served as senior vice president responsible for the firm's operations in India and in Vietnam. Sentencing hearings for Hirsch and McClung are scheduled for November 5, 2015. The Indian government, assisted by Japanese government, initiated the five-year Goa Water Supply and Sewerage Project to expand, rehabilitate and build water and sewerage facilities.
Louis Berger was part of a consortium for the project in Goa. The consortium included two Japanese firms and an Indian partner. The team developed a project management information system and plan, evaluated bids, reviewed design and construction plans, and ensured quality work was done on time and within budget, the company says on its website.
Federal prosecutors, in their 11-page chargesheet, alleged that Louis Berger maintained a detailed diary and account of bribery made to Indian officials. On August 26, 2010, "a consortium partner prepared a payment tracking schedule stating that the company had paid USD976,630 in bribes in connection with the Goa Project to date," federal prosecutors told a court in New Jersey.
On August 17, 2010, a consortium partner sent an e-mail to James McClung, stating, "As discussed I enclose the details as provided by [third-party intermediary]. I have also added the details of amounts paid to [the Company] as of date by [the consortium partner] in the same sheet."
The attachment included an entry, "Paid by [an agent of the company] to minister on behalf of agent," said federal prosecutors. According to court documents, the company through its employees and agents, together with others, used terms like "commitment fee," "counterpart per diem," "marketing fee" and "field operations expenses" as code words to conceal the true nature of the bribe payments and utilised cash disbursement forms and invoices which did not truthfully describe the services provided of the purpose of the payment.
In India since 1998, Louis Berger has offices in Gurgaon, Mumbai, Chennai and Hyderabad. "Along with several consortium partners, the company won two water development projects in Goa and Guwahati. The company paid bribes to win both of these contracts," federal prosecutors alleged.
According to court documents, the company through its employees and agents and its consortium partners kept track of the bribe payment by a circulating spreadsheet among themselves showing the proportionate share of each bribe that they had paid to the foreign officials overseeing their work on the Goa and Guwahati projects.

Louis Berger paid bribes to win water projects in Goa, Assam

US firm paid bribes to win water projects in Goa, Assam

Bribe for Goa project estimated at $976,630
Highfields - GOHF Offers
Free Modular Kitchen worth Rs.3 Lac   And 2 Year Pre-EMI Offer. Book Now! gohf.magicbricks.com
Ads by Google
A New Jersey-based construction management firm has been charged with bribing Indian officials to win two major water developmental projects in Goa and Guwahati. The bribe, of $976,630 for a Goa project by Louis Berger, included that to a minister, the details of which have not been disclosed by the US Department of Justice.

On Friday, the company agreed to pay a $17.1-million criminal fine to resolve charges that it bribed officials in India, Indonesia, Vietnam and Kuwait to secure government construction management contracts. Two of its former executives, Richard Hirsch (61) of the Philippines and James McClung (59) of the UAE, pleaded guilty to the charges.

Previously, McClung had served as senior vice-president, responsible for the firm’s operations in India and Vietnam.

Sentencing hearings for Hirsch and McClung are scheduled for November 5 this year.

The Indian government, assisted by its Japanese counterpart, had initiated the five-year Goa water supply and sewerage project to expand, rehabilitate and build water and sewerage facilities. Louis Berger was part of a consortium responsible for the project in Goa. The consortium included two Japanese firms and an Indian partner.

The team developed a project management information system and plan, evaluated bids, reviewed design and construction plans, and ensured quality work was done on time and within the budget, the company said on its website.

In an 11-page charge sheet, US federal prosecutors alleged Louis Berger maintained a detailed diary and account of bribery to Indian officials. On August 26, 2010, “a consortium partner prepared a payment-tracking schedule, stating the company had paid $976,630 in bribes in connection with the Goa project to date”, federal prosecutors told a court in New Jersey.

“Along with several consortium partners, the company won two water development projects in Goa and Guwahati. The company paid bribes to win both these contracts,” the prosecutors alleged.

On August 17, 2010, a consortium partner sent an e-mail to James McClung, stating, “As discussed, I enclose the details, as provided by (the third-party intermediary). I have also added the details of amounts paid to (the company) as of date by (the consortium partner) in the same sheet.”

The attachment included an entry: “Paid by (an agent of the company) to the minister on behalf of the agent,” the prosecutors said.

According to court documents, the company, through its employees and agents, used terms such as “commitment fee”, “counterpart per diem”, “marketing fee” and “field operations expenses” as codes to conceal the true nature of the payments and utilised cash disbursement forms and invoices that didn’t truthfully describe the services provided or the purpose of the payment.

The documents showed the company, through its employees, agents and consortium partners, kept track of the bribe payments by circulating a spreadsheet among them, which showed the proportionate share of every bribe they had paid the officials overseeing their work on the Goa and Guwahati projects.

SIMILAR INSTANCES IN THE PAST *

Koch Industries
Allegation: An internal investigation in 2008 revealed the company had paid bribes in India, among other countries, to secure contracts

Enron Corporation
Allegation: Enron allegedly spent $60 million for educational purposes, the bulk of which was used to pay bribes to secure various government approvals for its gas-based power plant in Maharashtra

WalMart Corp
Allegation: In 2012, the BJP alleged the retailer’s India arm spent money on lobbying and paid bribes. Walmart denied the charges

Oracle
Allegation: In 2012, the US Securities and Exchanges Commission filed charges against Oracle Corp, saying its India unit, Oracle India, had set aside $2.2 million between 2005 and 2007 for unauthorised payments in India. The money was in a separate account; SEC said this violated the Foreign Corruption Practices Act

Xerox
Allegation: In July 2002, Xerox Corporation admitted to the US regulator, the SEC, that it paid $700,000 to Indian govt officials as bribes to get contracts. A probe followed but nothing emerged

* Not a comprehensive list