Monday 20 July 2015

రాజమండ్రి: చంద్రబాబుతో సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ భేటీ

రాజమండ్రి: చంద్రబాబుతో సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ భేటీ
రాజమండ్రి, జూలై, 20: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ భేటీ అయ్యారు. ఈ భేటిలో ఈశ్వరన్‌తో పాటు సింగపూర్‌ కు చెందిన పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఈ భేటీలో అమరావతి రాజధాని రూపురేఖలు ఎలా ఉండాలి, ఏం చేస్తే అద్భుతమైన రాజధానిని నిర్మించవచ్చు అనే విషయాలను చర్చించనున్నట్లు తెలుస్తోంది.
 
సీడ్‌ క్యాపిటల్‌ గురించి సింగపూర్ బృందం ప్రజెంటేషన్‌ ఇచ్చింది. పుష్కర ఏర్పాట్లు బాగా ఉన్నాయని ఈ సందర్భంగా ఈశ్వరన్‌ చంద్రబాబుకు కితాబిచ్చారు. ఈశ్వరన్‌తో సమావేశం అనంతరం సింగపూర్‌ బృందంతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.
 
ఈ రోజు రాజమండ్రికి చేరుకున్న సింగపూర్‌ సభ్యుల బృందం నేరుగా హోటల్‌కు చేరుకున్నారు. సీఎం చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ఏరియల్‌ సర్వే ద్వారా పుష్కర ఘాట్లను పరిశీలించారు. పుష్కర ఏర్పాట్లను ఈశ్వరన్‌కు చంద్రబాబు సవివరంగా తెలిపారు.

No comments:

Post a Comment