Saturday 26 September 2015

రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే: జానారెడ్డి

రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే: జానారెడ్డి
Updated :26-09-2015 15:29:37
పరిగి, సెప్టెంబర్ 26: రైతుల సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత జానారెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా పరిగి మండలం రాగాపూర్‌, దొండపల్లిలో ఆత్మహత్య చేసుకున్న, రైతు కుటుంబాలను కాంగ్రెస్‌ నేతలు సబితా, ప్రతాప్‌కుమార్‌, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలన్ని ప్రభుత్వ హత్యలే అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ పూర్తిగా విఫలమయిందని ఆయన విమర్శించారు. రైతుల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని జానారెడ్డి తెలిపారు.

నరసాపురంలో 20 మంది దుబాయ్ ‌శ్రీనులు

నరసాపురంలో 20 మంది దుబాయ్ ‌శ్రీనులు
Updated :26-09-2015 10:16:17
దుబాయ్‌లో మంచి ఉద్యోగం..మీ జేబులో రూపాయి ఖర్చు పెట్టనక్కర్లెద్దు.. మంచి కంపెనీ.. పీఎఫ్‌..ఈఎస్‌ఐ..హెచ్‌ఆర్‌ఏ తదితర సౌకర్యాలు.. రూమ్‌ నుంచి కారులో తీసుకెళతారు..రూమ్‌కి కారులో దింపుతారు. వారానికి రెండు రోజులు సెలవు..మీ ఇంటికి ఫోన్‌ చేసుకునేందుకు కంపెనీ ఫోన్‌.. నెలకు రూ. 30 వేలు జీతం..మీదే ఆలస్యం. అంతా రాజభోగమే మరి.. కాళ్ళదగ్గరకు వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు.. మీరిప్పుడు ‘‘ఊ’’ అంటే
ఈ వారంలోనే ప్రయాణం..చాలా అర్జెంట్‌..మీరెళ్ళకపోతే దుబాయ్‌లో పనినిలిచిపోతుందట.. నాకు ఒక గంట ముందే షేట్‌ ఫోన్‌ చేశాడు.. మీరు ఏ విషయం కళ్ళుమూసి తెరిచేలోపల చెప్పాలి. లేదంటే దువ్వ వాళ్ళు ఫోన్‌ చేస్తున్నారు..వాళ్ళకు అవకాశం ఇచ్చేస్తా..మీరు వెళతానంటే.. చేయాల్సిందల్లా ఒకటే ఒక వారం రోజుల్లో ఒక్కొక్కరు రూ. 3 లక్షలు చూసుకోండి.ఇదీ ఒక ఏజెంట్‌ మాటల మాయాజాలం..

ఇలా చెబితే ఎవరికి మాత్రం ఆశ ఉండదు. దేవుడు మనకు అవకాశం ఇచ్చినట్టున్నాడు. వెళ్ళకపోతే తప్పుచేసినవాళ్ళమవుతాం. కుటుంబానికి నాలుగేళ్ళు దూరంగా ఉన్నా.. సెటిల్‌ అయిపోతాం. ఎందుకు వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం అనుకుంటారు..వెంటనే ప్రయాణానికి రెడీ అయిపోతారు.

మన మాటల మాంత్రికులు(ఏజెంట్లు) విజిటింగ్‌ వీసాలతో పంపించేస్తారు. వెను తిరిగి చూసుకుంటే ఇలా జిల్లా నుంచి వెళ్లి ఎంతో మంది గల్ఫ్‌ దేశాల్లో జైళ్ళలో మగ్గుతున్నారు.అయితే వాళ్ళను అక్కడకు పంపించిన ఏజంట్లు (మాయలమరాఠీలు) మాత్రం దర్జాగా తిరుగుతున్నారు. వీరిపై చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు.. కుటుంబ సభ్యులు కన్నీరు తుడిచిన పెద్దలూ లేరు. ఏజంట్ల భరతం పట్టిన పోలీసులు లేరు.ఎందుకంటే అందరూ దొంగలే.. ఎవడు ఏమైపోతేం మనకేంటిలే అనుకునేవారే!!
 
20 మంది దుబాయ్‌ శీనులు
మూడేళ్ళ కిందట నరసాపురం, మొగల్తూరు మండలాలకు చెందిన సుమారు 20 మంది యువకులు మలేషియా వెళ్లారు. పీఎం లంక గ్రామానికి చెందిన ఓ ఏజంట్‌ యువకులను మలేషియా పంపాడు.మంచి ఉద్యోగం, జీతం, భోజనం, వసతి సౌకర్యం కంపెనీ కల్పిస్తుందని నమ్మించాడు.ఈ ఏజంట్‌ మాటాలు నమ్మి చాలా మంది అప్పులు చేసి అడిగిన సొమ్ము చెల్లించారు. తీరా అక్కడికి వెళ్లిన తరువాతగాని తెలియలేదు. తాము వచ్చింది విజిటింగ్‌ వీసాపై అని. చేతిలో డబ్బులు లేకపోవడంతో రోజుల తరబడి పస్తులతో గడిపారు. జరిగిన మోసాన్ని కుటుంబ సభ్యులకు ఫోన్‌లో చెప్పడంతో ఏజంట్‌ను నిలదీశారు.అయితే ఏజంట్‌ కనిపించకపోవడంతో చివరికి పోలీసులు, అధికారులను ఆశ్రయించారు. అయినా లాభంలేకపోయింది. అయితే నరసాపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన పులపర్తి శ్రీను మలేషియాలో స్థిరపడ్డాడు. అతనికి సమాచారం అందించారు.అతని సహకారంతో వీరంతా క్షేమంగా ఇంటికి చేరారు. కట్టిన సొమ్ము మాత్రం తిరిగి రాలేదు.
 
ఇండియా వస్తానను కోలేదు : మహేష్‌. నరసాపురం
నా పేరు మహేష్‌..నేనుండేది పొన్నపల్లి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పట్టణానికి చెందిన ఓ ఏజంట్‌ మాటలు నమ్మి దుబాయ్‌ వెళ్ళా. కంపెనీ ఉద్యోగం. నెలకు రూ. 20 వేలు జీతం అని చెప్పాడు. ఏజెంట్‌ అడిగిన రూ.70 వేలు చెల్లించా. తీరా అక్కడికి వెళ్లిన తరువాత ఏజెంట్‌ చెప్పిన దానికి చేసే పనికి పొంతనలేదు. కూలీ పనులు, మూటలు మోసేపని. తిండి లేదు. దీంతో జరిగిన మోసాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వాళ్లు అప్పుచేసి డబ్బు పంపారు. తిరిగి ఇండియాకు వచ్చేశా. ఇప్పటికీ అసలు ఇంటికి ఏలా వచ్చానా అనిపిస్తుంది.

చంపేస్తామన్నారు : ఆంజనేయులు , నరసాపురం

ఈ ఏడాది ఏజంట్‌ ద్వారా దుబాయ్‌ వెళ్లా. అక్కడ దిగగానే ఏజంట్‌ నా పాస్‌పోర్టు తీసేసుకున్నాడు. ఎందుకంటే నాకు ఇచ్చింది విజిటింగ్‌ వీసా. అక్కడ ఖాళీగా ఉన్న పనిలో నన్ను పెట్టాడు. దీంతో నేను ఎదురుతిరిగా. నాకు చెప్పిన ఉద్యోగం ఇది కాదంటూ నిలదీశా. దీంతో ఏజంట్‌ నన్ను బెదిరించాడు. ఇక్కడికి రావడం వరకే నీ పని.. మేం చెప్పేది చేయాలి.. లేకపోతే చంపేస్తాం అంటూ బెదిరించారు. దీంతో రెండు నెలలు నానా కష్టాలు పడ్డా. చివరికి కుటుంబ సభ్యులు సొమ్ము పంపితే తిరిగి ఇండియాకు వచ్చా.
 
ప్రాణాలు తీసిన పని...
అత్తిలి మండలం ఉనికిలి గ్రామానికి చెందిన గాడాల దానయ్య ఎన్నో ఆశలతో మలేషియా వెళ్లాడు. ఏజంట్‌ ఒక కంపెనీలో మంచి ఉద్యోగం అని చెప్పడంతో వెనుకా ముందూ ఆలోచించలేదు. అయితే అక్కడకు వెళ్లిన తరువాత అలవాటులేని గ్యాస్‌ పైప్‌లైన్‌ దగ్గర పని.. ఏం జరిగిందో ఏమో కానీ ఒకసారి గ్యాస్‌ లీకై చనిపోయాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. ఏం చేయాలో తెలియదు.మూడు నెలలైనా మృతదేహం రాలేదు. కుటుంబ సభ్యులు కన్నీరుపెడుతూనే ఉన్నారు. చివరికి పెంటపాటి పుల్లారావు సహకారంతో మృతదేహం ఇండియాకు వచ్చింది. అయితే ఆ కుటుంబాన్ని కష్టాలు మాత్రం ఇంకా వీడలేదు.
 
చావుబతుకుల మధ్య వచ్చా : సయ్యద్‌ బీబీ, నరసాపురం
నాది నరసాపురంలోని కృష్ణబాబుకాలనీ..మొగల్తూరుకు చెందిన ఏజంట్‌ మాటలు నమ్మి గల్ఫ్‌ వెళ్లా. ఇంట్లో వంట పని... ఇద్దరే ఉంటారు. వారికి వంట చేసిపెట్టాలి. నెలకు రూ. 17 వేలు జీతం అంటూ నమ్మించాడు.తీరా అక్కడికి వెళ్లిన తరువాత గాని తెలియలేదు.వంట చేసి పెట్టాల్సింది ఇద్దరికి కాదు.. రెండు మూడిళ్ళలో వంట చేయాలని.. దీంతో అనారోగ్యానికి గురయ్యా. చావు బతుకుల మధ్య ఇండియాకు తిరిగొచ్చా.
 
మోసపోతూనే ఉన్నారు : సీఐ
గల్ఫ్‌ మోసాలు తరచు వెలుగులోకి వస్తున్నా... ఇంకా చాలా మంది ఏజంట్లను నమ్ముతున్నారు. కనీసం వచ్చిన వీసా చదవడం లేదు. అది విజిటింగ్‌ వీసానా.. లేక పర్మినెంట్‌ వీసానా అన్న విషయం తెలుసుకుంటే మోసపోయే అవకాశం ఉండదు. చాలా మంది విజిటింగ్‌ వీసాపై వెళ్లి మోసపోతున్నారు. ముందు ఏజెంట్‌ వీసా వచ్చిందనగానే వీసా కాఫీని అడిగి తీసుకోవాలి. నెట్‌ లేదా ఆ దేశం ఎంబసీకి వెళ్లి వీసా గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.

హోదా కంటే ప్యాకేజీతోనే అభివృద్ధి : హరిబాబు

హోదా కంటే ప్యాకేజీతోనే అభివృద్ధి : హరిబాబు
Updated :26-09-2015 01:32:16
విజయవాడ, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి):‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వల్ల వచ్చే నిధుల కంటే ప్యాకేజీ వల్ల ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని నా నమ్మకం. ప్రత్యేక హోదా అనేది ప్రజలకు సెంటిమెంట్‌గా మారిన విషయం నిజమే. అయితే విజ్ఞులైన ప్రజలు అన్నిటినీ క్షుణ్ణంగా అవగాహన చేసుకోగలరు.’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు చెప్పారు. ‘హోదా.. ప్యాకేజీ.. ఈ రెండింటిలో దేనివల్ల రాష్ట్రాభివృద్ధికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో దానినే కేంద్రం ప్రకటిస్తుంది’ అని చెప్పారు. శుక్రవారం విజయవాడలో పార్టీ నేత జమ్ముల శ్యాంకిశోర్‌తో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన రోడ్‌ మ్యాప్‌ను నీతి ఆయోగ్‌ తయారుచేసి కేంద్రానికి సమర్పించగానే ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటిస్తుందని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఊరుకుంటే.. సరిపెట్టుకోగలమా? రాష్ట్రానికి కావల్సింది నిధులు కానీ బిరుదులు కాదన్నారు. ఈ ఒక్క ఏడాదిలో ఏపీకి కేంద్రం ఇచ్చినన్ని సంస్థలు ఇంకెక్కడా రాలేదని చెప్పారు. ఇంకా అనేక సంస్థలు రానున్నాయని, స్థలాల కేటాయింపు సమస్య వల్ల కొన్ని సంస్థలు ఇంకా ఏర్పాటు కాలేదన్నారు. మంగళగిరి వద్ద ఎయిమ్స్‌కు శంకుస్థాపన జరుగుతుందని, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటవుతుందని చెప్పారు. పట్టిసీమ స్పూర్తితో పోలవరం కూడా పూర్తి చేయించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం విడిపోయాక హైదరాబాద్‌లో మనకు హక్కు ఉందనుకోవడమే తప్పు.. దీనివల్ల సమయం వృథా తప్ప ఇంకేమీ లేదన్నారు.

What Center’s temporary package means to AP?

What Center’s temporary package means to AP?

chandrababu arun jaitley packageUnion Finance Ministry had announced a Special Assistance Package to Andhra Pradesh during the current financial year 2015-2016. While the media reports said it to be 1100 Crore, the center is 100 Crore short and announced 1000 Crore package. The center had provided 350 Crore for the seven backward districts of Rayalaseema and Uttarandhra region. With the last year’s 350 Crore, it is effectively 100 Crore for each of the seven districts. Wonder what difference this minuscule 100 Crore will make to their backwardness.
Out of the remaining 650 Crore, 350 Crore will be for the capital construction. CRDA will have to pay 150 Crore per year to the land losing farmers as yearly compensation. The upcoming Capital city of Andhra Pradesh state is going to cost 1.26 Lakh Crore according to the early estimates being prepared by the government. Do your maths to calculate what percentage is that help (Approximately about 0.27%)
And the last 300 Crore is for the Polavaram Project which is a national project now and all its expense has to be borne by the central government. According to the figures with us, the state government had spent 812 Crores on the project from the appointed day to July 7th this year (Mirchi9.com do not have figure till date) which has to be reimbursed by the center. So this 300 Crore will not take the project any where. As a whole this interim package will be a big disappointment for the state!

Friday 25 September 2015

ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: మంత్రి రావెల

ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: మంత్రి రావెల
Updated :25-09-2015 12:25:25
విజయవాడ, సెప్టెంబర్25: జగన్‌ నీచ రాజకీయాలు చేస్తూ ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మంత్రి రావెల కిశోర్‌బాబు మండిపడ్డారు. కేసీఆర్‌తో కుమ్మక్కై చంద్రబాబును అక్రమ కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు దీక్షల పేరుతో దొంగ జపాలు చేయడం మానాలని హితవు పలికారు. ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదని రావెల హితవు పలికారు.

Not Supreme Court’s duty to advise Parliament, says CJI

Not Supreme Court’s duty to advise Parliament, says CJI

The court rejects PIL seeking guidelines to ensure parliamentary proceedings take place without interruptions


Political analysts say the apex court was correct in refusing to intervene in Parliament’s functioning, a problem that needed a political solution. Photo: Mint
Political analysts say the apex court was correct in refusing to intervene in Parliament’s functioning, a problem that needed a political solution. Photo: Mint
New Delhi: The Supreme Court on Thursday refused to intervene on the issue of key reform legislation stuck due to parliamentary disruptions, saying that doing so would be overstepping its boundary.
The apex court rejected a public interest litigation (PIL) by a non-profit group, whose advisers include industrialist Ratan Tata, seeking guidelines to ensure parliamentary proceedings take place without interruptions or disruptions.
A bench headed by Chief Justice H.L. Dattu said it was not the court’s duty to advise or make suggestions to Parliament, whose members had the wisdom and experience to conduct themselves appropriately. “It is not for this court to start advising or making suggestions (to members of Parliament) about what to do, what not to do. They are all experienced people, they have wisdom. They know their responsibilities. They know how to conduct themselves. We are not here to advise them and we are not expected to either,” Dattu said.
Political acrimony between the ruling alliance led by the Bharatiya Janata Party (BJP) and opposition Congress party marked by sharp exchanges between leaders both inside and outside Parliament washed out the monsoon session last month.
Delhi-based PRS Legislative Research, a non-profit organization that tracks India’s legislative processes. The Lok Sabha saw only 48% productivity in the monsoon session, whereas the Rajya Sabha, where the government is in a minority, saw only 8% productivity, according to data collated by New
Two of the key reform bills that have been stuck over parliamentary disruptions include the constitutional amendment bill for a goods and services tax (GST) and the controversial land acquisition bill, which has now been left to be formulated by individual state governments.
The petitioner, Foundation for Restoration of National Values (FRNV), claims there is a loophole in the law because there are no guidelines that would stop disruptions.
In response, the apex court said, “If the Parliament thinks there’s a lacuna in the Constitution, they’ll make appropriate amendments. You make a representation before them, they will take it very seriously.”
The advisory board of FRNV includes chairman emeritus of Tata Sons Ltd Ratan Tata, former managing director of Delhi Metro Rail Corp. E. Sreedharan, and former chief justice of India M.N. Venkatachaliah.
In its petition, the foundation focused on the monsoon session of Parliament—21 July to 13 August—which saw sustained and continuous disruptions by opposition parties. The petition said these disruptions have resulted in “severe loss” of parliamentary time and public money. It said that since 1991, in the past six Parliaments, nearly 2,162 hours have been lost.
“There is, accordingly, the urgent and pressing need to improve the overall structures, systems, skills, styles, policies and procedures needed for good governance, with a robust, wholesome and socially responsible administration, while simultaneously imbuing in those responsible for public administration, a deeper understanding of their responsibility to further the welfare of the people of our country,” the petition said.
Political analysts say the apex court was correct in refusing to intervene in Parliament’s functioning, a problem that needed a political solution.
“The stated structure we have is that sphere of judiciary and Parliament are two spheres and there has to be a balance between them. The legality of what the Parliament does can be brought to the Supreme Court but to advice the Parliament on how it should function is not within its purview,” said Manisha Priyam, a New Delhi-based political analyst and a fellow at the Indian Council of Social Science Research.
“This has to be guided politically. There are rules of business, conduct and procedures which should be followed. The issue is very serious right now. The Congress party has lost its base and so it no longer has the incentive to cooperate with the government. On the other hand, the BJP too has not made enough efforts to reach out to the opposition parties,” she said.


PIL in Supreme Court against Parliament disruptions

The petition refers to the ongoing monsoon session which has witnessed ‘sustained disruptions, unruly protests’

Over the last six sessions, according to the petition, nearly 2,162 hours had been lost. Photo: PTI
Over the last six sessions, according to the petition, nearly 2,162 hours had been lost. Photo: PTI
New Delhi: A non-profit organisation on Wednesday moved the Supreme Court seeking guidelines to ensure that proceedings in Parliament do not get stalled or disrupted.
Filed in public interest by the Foundation for Restoration of National Values (FRNV), the 23-page petition refers to the current monsoon session (21 July to 13 August) of Parliament which has witnessed “sustained disruptions, unruly protests” and abstentions by elected members. Mint has reviewed a copy of the petition.
The petition alleges that through disruptions like these, a substantial amount of Parliamentary time required to be devoted to legislative business was being wasted, resulting in losses to the public exchequer.
Over the last six sessions, according to the petition, nearly 2,162 hours had been lost.
According to think-tank PRS Legislative Research, of the 328 bills that were to be passed by the 15th Lok Sabha, only 179 were passed. This was the least number of bills passed by a House in its full five-year session.
The petition claims that such disruptions affect public and national interest and refers to Parliamentary proceedings in the US where stalling proceedings is a federal offence.



Monday 21 September 2015

ఆస్ట్రేలియా , న్యూజిలాండ్ పర్యటనకు యనమల

 హోం >> తాజావార్తలు
ఆస్ట్రేలియా , న్యూజిలాండ్ పర్యటనకు యనమల
Updated :21-09-2015 16:59:05
విజయవాడ , సెప్టెంబర్ 21 : ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమలరామకృష్ణుడు ఈ నెల 27 నుంచి వచ్చే నెల 11 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పర్యటించనున్నారు. వ్యాట్‌, జీఎస్‌టీ అధ్యయనంపై పరిశీలనకు వెళ్తున్న కేంద్ర ప్రభుత్వ బృందంలో సభ్యుడిగా యనమల ఈ పర్యటనకు వెళ్తున్నారు

Violence erupts in Kushinagar

Violence erupts in Kushinagar, Uttar Pradesh after a girl's death

SPEED NEWS DESK
Violence erupted on the streets of Kushinagar area of eastern Uttar Pradesh after a girl lost her life in a road accident today. A mob quickly collected and took to vandalising vehicles and setting them on fire.
The protestors also clashed with the police as tension gripped the area. Kushinagar is located 52 km away from Gorakhpur and is a popular pilgrimage place for the Buddhists.

ఒక్క ఫిర్యాదుతో ప్రభుత్వ యంత్రాంగమే మీవెంట..!

ఒక్క ఫిర్యాదుతో ప్రభుత్వ యంత్రాంగమే మీవెంట..!
Updated :21-09-2015 12:06:08
  •  సమస్యల పరిష్కారానికి సరికొత్త మార్గం 
  • ఆన్‌లైన్‌ ఫిర్యాదుతో కదిలొచ్చే యంత్రాంగం 
  • 20 శాఖలకు అర్జీలు పెట్టే అవకాశం 
 ఎన్నాళ్లగానో మీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదా..? ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేద్దామని గ్రీవెన్స్‌కు వస్తున్నారా..! ఒక్క క్షణం.. మీరే మీ ప్రాంతం నుంచి మీ అర్జీని మీ కోసం పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయండి.. సమస్యకు పరిష్కారం దొరుకుతుంది...!
 
గుంటూరు (నల్లచెరువు) 
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ప్రజా సమస్యలు నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఏర్పాటు చేసిందే మీ కోసం పోర్టల్‌. అంతర్జాలం ద్వారా అర్జీదారులు నేరు గా వారి సమస్యలను ఒకే సారి మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లవచ్చు. సమస్యలపై ప్రభుత్వాధికారుల బాధ్యతను పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధతో దీని రూపకల్పనకు శ్రమించారు. దీని ద్వారా మా రుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు సైతం ఆన్‌లైన్‌లో నేరుగా వారి సమస్య లు ఇవ్వడానికి వీలుంది.
  •  అర్జీలు సమర్పించడానికి మీ కోసం వెబ్‌ పోర్టల్‌లో నిర్థిష్ట విధి విధానాలు రూ పొందించారు. దీని ప్రకారం పౌరు లుఎవరైనా తొలుత డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్‌ మీకోసం డాట్‌ ఏపీడాట్‌ గౌట్‌ డాట్‌ ఇన్‌లోకి వెళ్లాలి. 
  •  హోమ్‌ పేజీలో సిటిజన్‌ లాగిన్‌ అనే చోట సైన్‌ అప్‌ అవ్వాలి. ఇక్కడ ఫిర్యాదుదారుడి ఆధార్‌ సంఖ్య, చరవాణి సంఖ్య నమోదు చేయాలి. పాస్‌వర్డ్‌ ఇవ్వాలి. అనంతరం సైన్‌అప్‌ వద్ద క్లిక్‌ చేయాలి. చరవాణికి వన్‌టైం పాస్‌వర్డ్‌ వస్తుంది. దీన్ని పోర్టల్‌లో నమోదు చేస్తే సైనప్‌ ప్రక్రియ పూర్తవుతుంది. 
  •  ఇప్పుడు సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు లాగిన్‌ అవ్వాలి. ఇందుకు ఆధార్‌ సంఖ్య, పాస్‌వర్డ్‌ సాయంతో లాగిన్‌ అవ్వొచ్చు. అనంతరం ఏ శాఖకు అర్జీ పెట్టాలో ఎంచుకోవాలి. 
  •  నిర్దేశించిన విధానంలో అర్జీలు నమోదు చేస్తే సంబంధిత శాఖకు అర్జీ వెళ్తుంది. 
  •  ప్రతి సమస్య పరిష్కారానికి ఇందులో నిర్థిష్ట కాల పరిమితి ఉంటుంది. 
  •  గడువు లోపు సమస్య పరిష్కారం కాకుంటే ఆటోమాటిక్‌గా పై అధికారి దృష్టికి వెళ్తుంది. 
  •  సలహాలకు సైతం ఇందులో అవకా శం ఉంటుంది. మీ కో సం బ్లాగులో పౌరులు ఎవరైనా ఆయా శాఖలకు సంబంధించి మార్పులు, చేర్పులు కావాలనుకుంటే వారి నుంచి సలహాలు స్వీకరించేందుకు అవకాశం ఉంది. 
  •  సలహాలు వద్ద క్లిక్‌ చేస్తే నిర్దేశిత పేజీ వస్తుం ది. అందులో మీ పేరు, ఈ మెయిల్‌, చిరునామా, ఆధార్‌, చరవాణి నెంబర్లు నమోదు చేసి శాఖను ఎంచుకోవాలి. అందులో మీ సలహాలు, సూచనలు అందించేందుకు అవకాశం ఉంది. 
  •  తొలి విడతగా ఇందులో 20 శాఖల ఫిర్యాదులకు అవకాశం కల్పించారు. 
  •  రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ, విద్య, గృహ నిర్మాణ, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్‌, పట్టణ పురపాలిక, వ్యవసాయం, ఉద్యాన, పట్టు, మత్స్య, పశు సంవర్థక, మార్కెటింగ్‌, భూగర్భ జలాలు, గను లు,దేవాదాయ శాఖ, గ్రామీణాభివృద్ధి, స్ర్తీశిశు సంక్షే మం, సహకార, హోం ఎనర్జీ శాఖలకు సంబంధించి న అర్జీలనునేరుగా ఆయా శాఖలకు పంపించవచ్చు. 
  •  మీరు జిల్లా కేంద్రానికి వచ్చినా అధికారులు మీ అర్జీలు తీసుకుని ఇందులోనే నమోదు చేసి పరిష్కారం కోసం కింది స్థాయి అధికారులకు పంపుతారు. 
  • ఫ ఇందులో అర్జీలను సీఎం చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావులు పరిశీలించి అపరిష్కృత అర్జీలపై కాన్ఫరెన్స్‌ నిర్వహించి వాటి పరిష్కారానికి కృషి చేస్తుంటారు. 
  •  మరిన్ని వివరాల కోసం టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1100 లేదా 1800 425 4440 నెంబర్ల నందు సంప్రదించవచ్చు.
గ్రీవెన్స్‌ భారం ఇదీ.. 
  •  జిల్లా కేంద్రం గ్రీవెన్స్‌కు వచ్చే అర్జీదారుల సంఖ్య సగటున : 500
  •  అర్జీదారులంతా చార్జీల కోసం వెచ్చిస్తున్న మొత్తం : రూ.50 వేలు 
  •  టీ, టిఫిన్స్‌, భోజనం వంటి వాటి కోసం చేస్తున్న ఖర్చు : రూ. లక్ష 
  •  ఒక్క అర్జీదారుడు వెచ్చిస్తున్న సమయం : 8 గంటలు 
  •  సగటున ఒక్కో ఆర్జీదారుడు ఇచ్చే అర్జీల సంఖ్య : 3 లేక 4 సార్లు 
  •  జిల్లా కేంద్రంలో ఉన్నతాధికారులు వెచ్చిస్తున్న సమయం : 5 గంటలు

నాలుగేళ్ల తర్వాత జరిగే ఆత్మహత్యలకే మా బాధ్యత

నాలుగేళ్ల తర్వాత జరిగే ఆత్మహత్యలకే మా బాధ్యత
Updated :21-09-2015 01:38:47
ప్రస్తుత మరణాలకు గత ప్రభుత్వాలే కారణం: లక్ష్మారెడ్డి
అచ్చంపేట, సెప్టెంబరు 20: ‘‘తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న రైతు ఆత్మహత్యలకు గత ప్రభుత్వాలే కారణం. నాలుగేళ్ల తర్వాత అంటే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాలన పూర్తయిన తర్వాత రైతులు ఆత్మహత్యలు చేసుకొంటేనే అప్పుడు మేము బాధ్యత వహిస్తాం’’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. చనిపోయిన రైతు కుటుంబానికి రూ.6 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని ప్రస్తుతం తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రతిపక్షాలు ప్రతి విషయంపైనా రాజకీయ కోణంలో ఆలోచిస్తూ డ్రామాలు ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాలలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరం, అచ్చంపేటలో 100 పడకల ఆస్పత్రి శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ బంగారు తెలంగాణ దిశగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందడం లేదన్నారు.

Swiss Challenge Method

What is the Swiss Challenge Method?
The govt will redevelop 400 railway stations using the Swiss challenge method. Here’s what it means
The Swiss challenge method is one that has been used in India by various states. Photo: Hemant Mishra/Mint
The Swiss challenge method is one that has been used in India by various states. Photo: Hemant Mishra/Mint
New Delhi: The Union cabinet on Thursday gave its approval to redevelop 400 railway stations using the Swiss challenge method.
“Four hundred railway stations will be redeveloped. The process for this will be through the Swiss challenge method,” finance minister Arun Jaitley told reporters after a cabinet meeting.
What is the Swiss Challenge method?
Describing the challenge, Jaitley said, “Swiss challenge method is a new process of giving contracts...Any person with credentials can submit a development proposal to the government. That proposal will be made online and a second person can give suggestions to improve and beat that proposal.”
He added that an expert committee will accept the best proposal and the original proposer will get a chance to accept it if it is an improvement on his proposal.
In case the original proposer is not able to match the more attractive and competing counter proposal, the project will be awarded to the counter-proposal.
Is it new in India?
The Swiss challenge method is one that has been used in India by various states including Karnataka, Andhra Pradesh, Rajasthan, Madhya Pradesh, Bihar, Punjab and Gujarat for roads and housing projects.
In 2009, the Supreme Court approved the method for award of contracts.
How different is it from the public-private partnership (PPP)?
This method can be applied to projects that are taken up on a PPP basis but can also be used to supplement PPP in sectors that are not covered under the PPP framework.

Responding to the announcement, minister for railways Suresh Prabhu tweeted, “400 stations across country development. Very big step in passenger service, modernization, mega investments, big job creation. Cabinet approve. Budget announcement fulfilled. Stn (Station) dev (development) with complete transparency with PPP. Top class amenities, shopping etc. Cities get icons.

Wednesday 16 September 2015

‘రాజధానికి వ్యతిరేకంగా సింగపూర్ ప్రభుత్వానికి జగన్ లేఖ’

‘రాజధానికి వ్యతిరేకంగా సింగపూర్ ప్రభుత్వానికి జగన్ లేఖ’
Updated :15-09-2015 19:57:58
హైదరాబాద్, సెప్టెంబర్ 15: కేంద్రంలో ఎన్డీయే నుంచి టీడీపీ తప్పుకుంటే వైసీపీ అధినేత జగన్ దూరాలని ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ఆరోపించారు. మంగళవారం నారా లోకేష్ మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై విమర్శల వర్షం కురిపించారు. వైఎస్ జగన్ నవ్యాంధ్ర రాజధానికి ఆటంకం కలిగిస్తూ సింగపూర్‌ ప్రభుత్వానికి లేఖ రాశారని ఆరోపించారు. అయితే సింగపూర్ ప్రభుత్వం జగన్‌ లేఖలను చించిపక్కన పారేసిందన్నారు. తమ ప్రభుత్వం రూ.30 వేల కోట్ల రైతుల రుణాలు మాఫీ చేసిందని చెప్పారు. 95 శాతం మంది ప్రజలు సంతృప్తి చెందేలా ప్రతీ పథకం అమలుచేస్తున్నామని వివరించారు.
 
రాజధాని, పట్టిసీమ, భోగాపురం ఎయిర్‌పోర్టులను.. అడ్డుకోవాలని ప్రయత్నించి జగన్‌ విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు బందరు పోర్టును వివాదం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలు కావాలంటారు, పరిశ్రమలను అడ్డుకుంటారని జగన్ తీరును లోకేష్ ఎండగట్టారు. అభివృద్ధి విషయంలో అబ్దుల కలాం, ఎన్టీఆర్‌లను స్ఫూర్తిగా తీసుకుంటారు కానీ జగన్‌ను కాదని వ్యాఖ్యానించారు. 

మేకపాలు... లీటరు 2వేలు!

మేకపాలు... లీటరు 2వేలు!
Updated :16-09-2015 01:24:20
ఢిల్లీలో లీటరు మేకపాల ధర ఒక్కసారిగా రూ.2 వేలకు దూసుకుపోయింది! డెంగ్యూ సోకినవారి రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోవడంతో మరణం సంభవిస్తుంది. వ్యాధిపీడితులకు మేకపాలు ఇస్తే ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుందన్న సంప్రదాయ వైద్యుల సలహాతో జనం ఎగబడటమే ఇందుకు కారణం. అయితే, ఢిల్లీ పరిసర గ్రామాలతోపాటు గుడ్‌గాఁవ్‌లో అధికశాతం మేకలు చూడి దశలో ఉండటంవల్ల కొద్ది పరిమాణంలో మాత్రమే మేకపాలు లభిస్తున్నాయని పెంపకందారులు తెలిపారు. అందువల్లనే సాధారణంగా రూ.35-40 మధ్య పలికే లీటరు ధర ఒక్కసారిగా రూ.500 నుంచి 2వేలకు దూసుకుపోయిందని చెప్పారు.

ఏపీకి అరుదైన గుర్తింపు, 13వ స్థానంలో తెలంగాణ: ప్రపంచ బ్యాంక్ ర్యాంక్‌లివీ

ఏపీకి అరుదైన గుర్తింపు, 13వ స్థానంలో తెలంగాణ: ప్రపంచ బ్యాంక్ ర్యాంక్‌లివీ... Posted by: Srinivas Published: Monday, September 14, 2015, 19:25 [IST] Share this on your social network:    FacebookTwitterGoogle+   Comments (3) Mail న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంకు భారత దేశంలో వ్యాపారానికి అనుకూల వాతావరణం ఉన్న రాష్ట్రాల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో గుజరాత్ రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలవగా... మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. తొలి అయిదు స్థానాల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి. ఈ జాబితాలో అరుణాచల్ ప్రదేశ్ చివరి స్థానంలో నిలిచింది. ఈ జాబితాను ప్రపంచ బ్యాంక్ సహకారంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ విడుదల చేసింది. ఈ జాబితాలో బిజెపి పాలిత రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు వెనుకంజలో ఉన్నాయి. వ్యాపార అనుకూల జాబితాలో గుజరాత్ 71.14 శాతంతో మొదటి స్థానంలో, ఏపీ 70.12 శాతంతో రెండో స్థానంలో, తెలంగాణ 42.45 శాతంతో 13వ స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కేరళ, అస్సా, ఉత్తరాఖండ్‌లు.... 19, 22, 23వ స్థానాల్లో నిలిచాయి. కర్నాటక మాత్రం 9వ స్థానంలో నిలిచింది. వ్యాపార అనుకూల రాష్ట్రాల జాబితా వరుసగా.. గుజరాత్ - 1 ఆంధ్రప్రదేశ్ - 2 జార్ఖండ్ - 3 చత్తీస్‌గఢ్ - 4 మధ్యప్రదేశ్ - 5 రాజస్థాన్ - 6 ఒడిశా - 7 మహారాష్ట్ర - 8 కర్నాటక - 9 ఉత్తర ప్రదేశ్ - 10 పశ్చిమ బెంగాల్ - 11 తమిళనాడు - 12 తెలంగాణ - 13 హర్యానా - 14 ఢిల్లీ - 15 పంజాబ్ - 16 హిమాచల్ ప్రదేశ్ - 17 కేరళ - 18 గోవా - 19 పుదుచ్చేరి - 20 బీహార్ - 21 అసోం - 22 ఉత్తరాఖండ్ - 23 చండీగఢ్ - 24 అండమాన్ నికోబర్ దీవులు - 25 త్రిపుర - 26 సిక్కిం - 27 మిజోరాం - 28 జమ్ము కాశ్మీర్ - 29 మేఘాలయ - 30 నాగాలాండ్ 31 అరుణాల్ ప్రదేశ్ - 32

Read more at: http://telugu.oneindia.com/news/telangana/cii-world-bank-report-gujarat-ranked-as-the-most-business-friendly-state-163992.html

Tuesday 15 September 2015

Telangana Media’s pathetic defence on World Bank Report!

Telangana Media’s pathetic defence on World Bank Report!

Telangana Media's pathetic defence on World Bank Report!Telangana Media and TRS is struggling to defend its 13th rank in World Bank’s report of the states with good ease of business. More than its 13th rank, AP getter a very good rank of 2nd is troubling them very much. So far Telangana Chief Minister KCR is saying Telangana is a wealthy state and their industrial policy is the best in the country.
But the report suggested otherwise. To make sure negative vibes do not go in to people, Telangana Media like Namasthe Telangana and T-News were pressed for damage control. They started airing bulletins like Chandrababu and Venkaiah Naidu have influenced these rankings and there is no credibility to World Bank Reports.
But in the process they failed to realize that their credibility is losing. Why would World Bank give a report in favour of AP? How can a global organization be influenced by CBN or Venkaiah? These are very simple questions even layman can get. So the longer they press on the issue, the more the damage will be!
ఆస్తి తీసుకున్నారు... అనాధగా వదిలేశారు
Updated :16-09-2015 11:53:57
  • ఆస్తి తీసుకుని గెంటేశారు
  • ఎస్‌ఐ సహా పిల్లలపై తల్లి ఫిర్యాదు
ఆంధ్రజ్యోతి, చెన్నై: తన బిడ్డలు ఆస్తి తీసుకుని వదిలివేయడంతో అనాథలా బతుకుతున్నానని, న్యాయం చేయాలని ఓ వృద్ధురాలు సోమవారం నగర పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. స్థానిక పళ్లికరైకు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు తొగాట్టి కుప్పు పోలీసు కమిషనర్‌ కార్యాలయానికి వచ్చింది. ఆమె నడిచే పరిస్థితి లేకపోవడంతో ఆమె బం ధువొకరు చక్రాల కుర్చీపై కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆమె కమిషనర్‌కు వినతిప త్రం సమర్పించిన తరువాత విలేకరులతో మాట్లాడుతూ తనకు రామన్‌. దామోదరన్‌, చంద్రశేఖర్‌ అనే ముగ్గురు కుమారులు, శాం తి అనే కుమార్తె ఉన్నారన్నారు. కొద్ది కాలం కిందట తన భర్త మృతి చెందారని, అప్పటి నుంచి తనను ఎవరూ ఆదరించలేదన్నారు. ఆస్తి తీసుకున్న వారసులు అనాథగా వదిలేశారని వృద్ధురాలు వాపోయింది. తన కుమారుల్లో ఒకరు ఎస్‌ఐగా పనిచేస్తున్నారని తెలిపారు. తనను పోషించే విధంగా ఏర్పా ట్లుచేసేందుకు కుమార్తె, కుమారులను ఆదే శించాలని కమిషనర్‌ను కోరినట్లు తెలిపారు. విచారణ అనంతరం తగిన చర్యలు చేపట్టాలని కమిషనర్‌ పోలీసు సిబ్బందిని ఆదేశించారు.

Monday 14 September 2015

2017లో ‘తల మార్పిడి’

2017లో ‘తల మార్పిడి’
Updated :14-09-2015 01:10:23
బీజింగ్‌: మరో రెండేళ్లలో మనిషి తల మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు చైనా వైద్యబృందం పేర్కొంది. జన్యుపరమైన లోపాలతో శరీరంలో తల మినహా మిగతా అవయవాలు సరిగా పనిచేయని వారిలో తలను మార్చే అవకాశం కోసం ఈ బృందం పరిశోధన చేసింది. తొలుత జంతువులపై జరిపిన ప్రయోగాలు విజయవంతం కావడంతో మనుషులపై ప్రయోగానికి సిద్ధమైంది. ఈ ప్రయత్నాల గురించి తెలుసుకున్న రష్యన్‌ సైంటిస్ట్‌ వాలెరి స్పిరిడొనోవ్‌ శస్త్రచికిత్సకు ముందుకొచ్చారు. అరుదైన జన్యు కండరాల వ్యాధి వెర్డింగ్‌ హాఫ్‌మన్‌ కారణంగా తల మినహా వాలెరి శరీరం సరిగా ఎదగలేదు. మరో రెండేళ్లలో.. అంటే 2017 డిసెంబర్‌లో శస్త్రచికిత్స ద్వారా వాలెరి తలను వేరుచేసి దాత దేహానికి అమరుస్తామని వైద్య బృందంలోని డాక్టర్‌ సెర్జియో కానవెరో పేర్కొన్నారు.

రుచికరమైన భోజనం రూపాయే!

రుచికరమైన భోజనం రూపాయే!
Updated :14-09-2015 09:59:26
మనసుంటే మార్గముంటుంది అంటారు. ఆ యువకులకు మనసు ఉంది కాబట్టే పేదల ఆకలి తీర్చడానికి నడుం కట్టారు. ఒక సంఘంగా ఏర్పడి పేదవారి ఆకలి 
తీర్చడమే కాకుండా, చాలా తక్కువ ధరకే వారికి కావలిసినవన్నీ అందించడానికి శ్రీకారం చుట్టారు ఆ యువకులు. ఖర్చు గురించి ఆలోచించకుండా ఎంత మంది ఆకలి తీరుస్తున్నామన్న విషయంపైనే దృష్టి పెట్టారు కర్నాటకలోని మహావీర్‌ యూత్‌ అసోసియేషన్‌ వారు. రూపీయా కనుమరుగైపోతున్న తరుణంలో ‘ఒక్కరూపాయి’ కే పేదల కడుపు నింపుతున్నవారి గురించి తెలుసుకుందాం.
 
 
రోటీఘర్‌ క్యాంటీన్‌
పేదల ఆకలినే కాదు అడిగినవారందరి ఆకలీ తీరుస్తూ ‘అన్నదాతా సుఖీభవ’ అంటూ ఆశీస్సులు అందుకుంటోంది రోటీఘర్‌ క్యాంటీన్‌! ఇక్కడ ఒక్కరూపాయికే అన్నం, కూర, సాంబారుతో పాటు రుచికరమైన నాణ్యమైన భోజనం అందిస్తారు. చివరకు ఓ స్వీటు కూడా ఇచ్చి నోటిని తీపి చేస్తున్నారు!
ఇక్కడికి అందరూ పేదవారే వస్తారనుకుంటే పప్పులో కాలేసినట్టే! రోజు
కూలీల నుంచి కార్పొరేట్‌ ఉద్యోగుల వరకూ అందరూ మధ్యాహ్న సమయంలో ఈ రోటీఘర్‌ క్యాంటీన్‌కే వస్తారు. మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచీ మూడు గంటల వరకూ ఇది తెరిచే ఉంటుంది. అన్నంతో పాటు చపాతీ ఇక్కడ లభిస్తాయి. రోజుకు ఎంత మంది వచ్చినా లేదు... అయిపోయింది అన్న మాట రాకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కొన్ని సార్లు చేసిన పదార్థాలు అయిపోయినా వెంటనే వేడి వేడిగా వండి వడ్డిస్తారు. కాకపోతే పార్శిల్‌ సర్వీసు మాత్రం ఇక్కడ లేదు.
 
అందరూ సమానమే! 
తమ క్యాంటీన్‌కు వచ్చేవారు ధనికులా, పేదలా, ఉద్యోగులా, నిరుద్యోగులా అన్నది ఆలో చించబోమని, ఇక్కడకు వచ్చే అందరూ తమకు సమానమే అంటున్నారు మహావీర్‌ యూత్‌ అసోసియేషన్‌ సభ్యులు! ఈ క్యాంటీన్‌లో వండిపెట్టడమే తప్ప వడ్డించడం ఉండదు. ఎవరికి వారు సెల్ఫ్‌ సర్వీస్‌ చేసుకోవలసిందే! భోజనం చేసిన తరువాత వీరు చార్జి చేసే ఒక్కరూపాయి ఇవ్వబోతే క్యాంటీన్‌లో పనిచేసే వారు తీసుకోరు. అక్కడ ఉండే హుండీలో వేయవలసిందే! వీరి సేవలకు ముగ్ధులైన కొందరు ఇంకా ఎక్కువ మొత్తం కూడా అప్పుడప్పుడు హుండీలో వేస్తూంటారు. డబ్బులు ఇచ్చిన వారి గురించి ఎలా ఆలోచించరో, ఇవ్వనివారిని కూడా క్యాంటీన్‌ సభ్యులు పట్టించుకోరు. ఈ క్యాంటీన్‌లో భోజనం చేసి వెళ్ళేవారిని ఇప్పటి వరకూ తాము ఏనాడూ డబ్బులు డిమాండ్‌ చేయలేదని చెబుతున్నారు క్యాంటీన్‌ నిర్వాహకులు!
 
పరిశుభ్రతకే పెద్దపీట!
ప్రతిరోజూ వందలాది మంది ఆకలి తీరు స్తున్న రోటీఘర్‌లో పరిశుభ్రతకి పెద్ద పీట వేస్తారు. ఈ క్యాంటీన్‌లో చాలా మంది పనిచేస్తున్నారు అనుకుంటే పొరపడినట్టే! కేవలం ముగ్గురంటే ముగ్గురే పనిచేస్తారు. ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, వచ్చేవారికి కావలసినవి చూడడం వంటి క్యాంటీన్‌ పనులన్నీ వీరే చూసుకుంటారు. చేసుకుంటారు.
 
అలా మొదలైంది
సమాజసేవ చేయాలన్న ఆలోచనతో మహావీర్‌ యూత్‌ అసోసియేషన్‌ వారు తొలుత ఒక ఉచిత వైద్యశాల నిర్వహించారు. నిధుల కొరత, డాక్టర్ల కొరత తోడవడంతో ఆ వైద్యశాలను మూసివేశారు. ఆ తర్వాత కూడా పేదలకు ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తున్న సమయంలో యూత్‌ సభ్యులకు రోటీఘర్‌ ఆలోచన వచ్చింది. ప్రస్తుతానికి మాత్రం ఈ రోటీఘర్‌కి నిధుల కొరత లేదంటున్నారు నిర్వాహకులు. కర్నాటకలో మరికొన్ని ప్రాంతాలకు కూడా తమ రోటీఘర్‌ సేవలను విస్తరించే ఆలోచన ఉందని అసోసియేషన్‌ సభ్యులు చెబుతున్నారు.

Saturday 12 September 2015

టిప్పుసుల్తాన్ గా రజనీకాంత్!

టిప్పుసుల్తాన్ గా రజనీకాంత్!
ఓ వైపు బాషా రేంజ్ సినిమా కాదంటూ 'కబలి'పై భారీ అంచనాలు పెరగకుండా చూస్తున్న రజనీకాంత్.. మరోవైపు ఓ హిస్టారికల్ సబ్జెక్ట్ లో నటించేందుకు సమాయత్తమవుతున్నారట...
బాహుబలి సినిమా విజయంతో.. ఇప్పుడు హిస్టారికల్ సబ్జెక్ట్స్ వైపు.. దర్శకనిర్మాతలు దృష్టిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి... అదికూడా రజనీకాంత్ హీరోగా... కర్ణాటకకు చెందిన ప్రముఖ నిర్మాత, ఎమ్మెల్యే అశోక్ ఖేని.. ఈ సినిమాను నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు... ఇటీవల ఈ విషయాన్ని వెల్లడించిన అశోక్.. ఇప్పటికే ఈ సినిమా విషయమై రజనీకాంత్ తో పలుమార్లు సంప్రదింపులు జరిపానన్నారు... భారీ బడ్జెట్ తో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారట అశోక్... గతంలో కమల్ హాసన్ కూడా.. టిప్పు సుల్తాన్ లైఫ్ స్టోరీ తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించటం గమనార్హం
కబలి సినిమా సెట్స్ కి వెళ్లకుండానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి... ఇందులో రజనీకాంత్ మాఫియాడాన్ గా నటిస్తుండడంతో.. ఈ సినిమా బాషా తరహాలో ఉండబోతోందనే ప్రచారం జరుగుతోంది... ఈ విషయంపై రజనీకాంత్ స్వయంగా స్పందించారు. రీసెంట్ గా బాషా చిత్ర నిర్మాత ఆర్.ఎమ్.వీరప్పన్ బర్త్ డే వేడుకలో పాల్గొన్న రజనీకాంత్.. ‘కబలి’ సినిమా ‘బాషా’ ను మించుతుందా అని అందరూ తనను అడుగుతున్నారని... అయితే ‘బాషా’ ను మించిన సినిమా తన కెరీర్ లో మరొకటి రాదన్నారు... కథ విషయంలోనూ తన తాజా చిత్రం 'కబలి'కి బాషాతో పోలికే లేదని క్లారిటీ ఇచ్చాడు రజనీ... కబలిపై భారీగా పెరుగుతున్న అంచనాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగానే.. రజనీకాంత్ ఇలా స్పందించాడట... ఒక్కోసారి ఈ అతి అంచనాల వల్లే భారీ పరాజయాలు ఎదుర్కోవాల్సి వస్తుంది... రీసెంట్ గా వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న రజనీ వ్యూహాత్మకంగా ఆలోచించి ఇలా తన చిత్రంపై అంచనాలు తగ్గించి ఉండొచ్చంటున్నారు కోలీవుడ్ జనం... రజనీ అభిమానుల ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి.... మరి కబలి వారి ఆశల్ని ఎంత వరకూ నెరవేరుస్తుందో చూద్దాం...!

Telangana govt’s pathetic defense of farmer’s suicide in Hyd

Telangana govt’s pathetic defense of farmer’s suicide in Hyd

Telangana govt's pathetic defense of farmer's suicide in HydTelangana government is embarrassed by the suicide of Nizamabad farmer, Limbaiah in the heart of Hyderabad City and very near to the secretariat. Limbaiah’s suicide was supposed to be a wakeup call for the state government which is trying to mask the serious issue and project Bangaru Telangana is arriving fast under KCR’s rule. However Limbaiah’s death could not shake the government.
Telangana government had announced that Limbaiah did not die due to debts or agricultural problems. In fact, the government ratified that his cultivation is good and he is even lending loans to others. But the ground reality is exactly the opposite. More than half of Limbaiah’s 5 acres are dried due to failure of bore and remaining crop was lost due to lack of rains.
He took loans running in to Lakhs for agricultural and medical purposes of his son. He ended his life as he could not repay them but Telangana government made him so rich that he lent money to others. The government concluded that he committed suicide due to his own health problems and that of his son. Limbaiah’s soul if watching from heaven would be even further traumatized to see such report by the government in his own state achieved by years of agitations.