Tuesday 8 September 2015

ప్రకాశం బ్యారేజీకి వరదనీరు

ప్రకాశం బ్యారేజీకి వరదనీరు 
Updated :08-09-2015 08:35:57
విజయవాడ, సెప్టెంబరు 8 : ప్రకాశం బ్యారేజీకి వరదనీరు చేరింది. రెండువేల క్యూసెక్కుల వరదనీరు చేరికతో బ్యారేజీ నీటిమట్టం పెరిగింది. జలాశయ నీటిమట్టం 10.8 అడుగులకు చేరింది. నల్గొండ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వర్షాలతో వాగులు పొంగుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాల వల్ల జలాశయాలు, చెరువుల్లోకి కొంత నీరు చేరుతోంది.

No comments:

Post a Comment