Saturday 26 September 2015

రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే: జానారెడ్డి

రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే: జానారెడ్డి
Updated :26-09-2015 15:29:37
పరిగి, సెప్టెంబర్ 26: రైతుల సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత జానారెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా పరిగి మండలం రాగాపూర్‌, దొండపల్లిలో ఆత్మహత్య చేసుకున్న, రైతు కుటుంబాలను కాంగ్రెస్‌ నేతలు సబితా, ప్రతాప్‌కుమార్‌, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలన్ని ప్రభుత్వ హత్యలే అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ పూర్తిగా విఫలమయిందని ఆయన విమర్శించారు. రైతుల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని జానారెడ్డి తెలిపారు.

No comments:

Post a Comment