Tuesday 8 September 2015

పోర్టు రైతులకు రాజధాని తరహా ప్యాకేజి: మంత్రి కొల్లు రవీంద్ర

పోర్టు రైతులకు రాజధాని తరహా ప్యాకేజి: మంత్రి కొల్లు రవీంద్ర
Updated :08-09-2015 14:01:42
విజయవాడ, సెప్టెంబర్ 8 : మచిలీపట్నం పోర్టు నిర్మాణం పూర్తిచేసి హామీ నిలబెట్టుకుంటామని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పోర్టు నిర్మాణం కోసం 14 వేల ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్‌ విడుదల చేశామని...భూములు ఇచ్చే రైతులకు రాజధాని తరహా ప్యాకేజీ ఇవ్వనున్నట్లు తెలిపారు. పోర్టును అడ్డుకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని విమర్శించారు. మచిలీపట్నం-పెడన మధ్య మెగా టౌన్‌షిప్‌ ఏర్పాటు చేస్తామన్నారు. భెల్‌ కంపెనీ తరలిపోకుండా చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి కొల్లురవీంద్ర తెలిపారు.

No comments:

Post a Comment