Wednesday 9 September 2015

జగన్‌పై దేవినేని ఉమ ఫైర్

జగన్‌పై దేవినేని ఉమ ఫైర్
Updated :09-09-2015 17:28:34
విజయవాడ, సెప్టెంబర్ 09: వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉండడం ప్రజల దౌర్భాగ్యమన్నారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోెకుండా జగన్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టుకు వ్యతిరేకమని చెప్పిన జగన్, ఇప్పుడేం సమాధానం చెబుతారని మంత్రి ప్రశ్నించారు.  ఈ నెల 15న నదుల అనుసంధానంపై సెమినార్‌ నిర్వహించనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ఈ నెల 16న పట్టిసీమ మొదటి పంపును సీఎం ప్రారంభిస్తారని మంత్రి చెప్పారు. 16న పట్టిసీమ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు. ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారని మంత్రి తెలిపారు. పోలవరం ఎడమ కాలువ పనులు వేగవంతం చేస్తామని అన్నారు. ఈ నెల 25 వరకు 6 వేల నీటి సంఘాలకు ఎన్నికలు జరుగుతాయని మంత్రి ఉమ తెలిపారు. 

No comments:

Post a Comment