Saturday 25 January 2014

టీ-బిల్లును తిప్పి పంపాలి - సియం.

టీ-బిల్లును తిప్పి పంపాలని స్పీకర్‌ను కోరిన సీఎం కిరణ్

Published at: 25-01-2014 17:27 PM
 2  1  0 
 
 

హైదరాబాద్, జనవరి 25 : తెలంగాణ ముసాయిదా బిల్లు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. బిల్లును వెంటనే తిప్పి పంపాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు శనివారం నోటీసు ఇచ్చారు. రాష్ట్రానికి వచ్చిన బిల్లు తప్పుల తడకని, అసలు బిల్లు రాలేదని, ఇప్పుడు వచ్చింది డ్రాఫ్ట్ బిల్లని, అందుకేత బిల్లును తిప్పి కేంద్రానికి పంపాలని కిరణ్ సభా నాయకుడి హోదాలో సభ వ్యవహారాల మంత్రి శైలజానాథ్‌కు నోటీసు ఇవ్వగా ఆయన సభాపతికి నోటీసు అందజేశారు.
అనేక వివాదాస్పద అంశాలు ఈ బిల్లలో ఉన్నట్టు నిబంధన 77 ప్రకారం బిల్లును వెనక్కి సీఎం కిరణ్ పంపారు. ఈ బిల్లు చర్చకు అనర్హమైందని ఆయన నోటీసులో పేర్కొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సూచనల మేరకు కిరణ్ బిల్లును వెనక్కి పంపారా? అని అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న ఈ తరుణంలో ఇది తెలంగాణ బిల్లు కాదని కేవలం డ్రాఫ్ట్ బిల్లు మాత్రమేనేని, ఈ విషయాన్ని కేంద్రహోంశాఖ కార్యదర్శి చెప్పారని సీఎం తెలిపారు.
- See more at: http://www.andhrajyothy.com/node/58028#sthash.lFuxXEqy.dpuf

ముసాయిదా బిల్లే

మేం పంపించింది ముసాయిదా బిల్లే : కేంద్ర హోం శాఖ

Published at: 25-01-2014 20:25 PM
 New  0  0 
 
 

న్యూఢిల్లీ, జనవరి 25 : రాష్ట్ర అసెంబ్లీకి తాము పంపించింది ముసాయిదా బిల్లేనని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ నెల మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొంది. బిల్లుతో పాటు లక్ష్యాలు, కారణాల ప్రకటన.. వీటికి సంబంధించిన నోట్స్, క్లాజులు.. ఆర్థిక పత్రం.. ప్రతిపాదనల పరిధిని వివరించే, అవి సాధారణమైనవా లేక అ సాధారణమైనవా తెలియజేసే శాసన ప్రాతినిధ్య పత్రాన్ని కూడా పంపించాలని రాష్ట్ర శాసనసభలోని కొందరు సభ్యులు కోరారని, కాబట్టి ఆ సమాచారాన్ని తమకు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డిసెంబర్ 18వ తేదీన కేంద్ర హోం శాఖను కోరారు. దీనికి హోం శాఖ జనవరి మొదటి వారంలో సమాధానం ఇస్తూ ఒక లేఖను పంపించింది. రాష్ట్ర అసెంబ్లీకి పంపించింది ముసాయిదా బిల్లేనని, కాబట్టి ముసాయిదా బిల్లులో ఆ వివరాలేమీ ఉండవని స్పష్టం చేసింది. వాస్తవానికి తామే ఇంకా ఆ వివరాలన్నింటినీ సిద్ధం చేయలేదని, కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోరిన సమాచారాన్ని ఇవ్వటం తొందరపాటు అవుతుందన్నది తమ అభి ప్రాయమని అందులో పేర్కొంది.
ఆ లేఖలో ఇంకా ఏమని పేర్కొన్నారంటే..
"బిల్లు లక్ష్యాలు, కారణాల ప్రకటన.. వీటికి సంబంధించిన నోట్స్, క్లాజులు.. ఆర్థిక పత్రం.. ప్రతిపాదనల పరిధిని వివరించే, అవి సాధారణమైనవా లేక అ సాధారణమైనవా తెలియజేసే శాసన ప్రాతినిధ్య పత్రాన్ని కూడా పంపించాలని రాష్ట్ర శాసనసభలోని కొందరు సభ్యులు కోరారని, కాబట్టి ఆ సమాచారాన్ని పంపించాలని మీరు చేసిన విజ్ఞప్తిని మేం పరిశీలించాం.
అయితే, ముసాయిదా బిల్లు ఉద్దేశ్యం సుస్పష్టం. ఇది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా చేయాలని కోరుతోంది. ఆ రెండు రాష్ట్రాలకూ ప్రాంతాలను నిర్దేశించి, పార్లమెంటు, రాష్ట్ర శాసనవ్యవస్థల్లో తప్పనిసరి అయిన అనుబంధ, యాదృచ్ఛిక ప్రాతినిధ్యాలకు సంబంధించిన నిబంధనల్ని ఏర్పాటు చేస్తుంది. అలాగే, ఆదాయాల పంపిణీ, ఆస్తులు, అప్పుల కేటాయింపులు, సాగునీటి వనరులు, ఇంథనం, సహజ వనరులు, ఇతర అంశాల యాజమాన్యం, అభివృద్ధికి సంబంధించిన నిబంధనల్ని ఏర్పాటు చేస్తుంది. అయితే, (మీరు కోరిన) పైన పేర్కొన్న నాలుగు అంశాలూ ముసాయిదా బిల్లులో అంతర్భాగం కాదు. కాబట్టే వాటిని ఇందులో చేర్చలేదు. నేనిక్కడ మరొక విషయం చేర్చదల్చుకున్నాను.. ఈ నాలుగు అంశాలూ అనుబంధ అంశాలు. న్యాయ శాఖను సంప్రదించి పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదిస్తుంది. ఆ తర్వాత పైన పేర్కొన్న నాలుగు అంశాలనూ తయారు చేస్తారు. ప్రస్తుతానికి ఇది ముసాయిదా బిల్లే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తప్పనిసరి అయిన ఆంధ్రప్రదేశ్ శానస సభ క్లాజుల వారీ వైఖరి కోసం ఇది ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో, పైన పేర్కొన్న నాలుగు అంశాలనూ దీనిలో పేర్కొనటం తొందరపాటు అవుతుందనేది మా అభి ప్రాయం.
వివిధ మంత్రిత్వ శాఖలు, ఇతర భాగస్వామ్య పక్షాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సేకరించిన సమాచారానికి సంబంధించి.. ఈ సమాచారాన్నంతా ఇప్పటికీ ఒకే నివేదికలాగా తయారు చేయలేదు. అయితే, ఈ సమాచారాన్ని కేంద్ర కేబినెట్ నియమించిన మంత్రుల బృందం నివేదిక తయారు చేసేందుకు ఉపయోగించాం. విస్తృతంగా ఉపయోగించిన మరొక సమగ్ర నివేదిక జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ నివేదిక. ఇది హోం శాఖ వెబ్‌సైట్‌లో ఉంది.''
- See more at: http://www.andhrajyothy.com/node/58040#sthash.Qzwrk3ya.dpuf

Wednesday 22 January 2014

Dadasaheb Phalke Award since 1969 (34)

Dadasaheb Phalke Award since 1969 (34) 

For Telugu People 

1. 1974 (6)   Bommireddy Narasimha Reddy 
2. 1980 (12) Paidi Jairaj 
3. 1982 (14) LV Prasad 
4. 1986 (18) Bommireddy Nagi Reddy 
5. 1990 (22) Akkineni Nageswara Rao 
6. 2005 (27) Shyam Benegal 
7. 2009 (31) D Rama Naidu

Monday 20 January 2014

అసెంబ్లీలో అక్బర్ వన్ మ్యాన్ షో

అసెంబ్లీలో అక్బర్ వన్ మ్యాన్ షో

Written by Prr Kameswara Rao | Updated: January 20, 2014 16:38 (IST)
అసెంబ్లీలో అక్బర్ వన్ మ్యాన్ షోవీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : శాసన సభ్యుడంటే ఎలా ఉండాలో తెలుసా.. ఎలా ప్రిపేర్ కావాలో తెలుసా.. తెలుసుకోవాలంటే సోమవారం నాటి శాసన సభ సమావేశాలను ఒక్కసారి చూడాల్సిందే. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది తానేనని, తాను చేసిన అభివృద్ధిని ఎవరైనా కాదనగలరా అంటూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అన్న ఒక్క మాటకు, మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ దిమ్మ తిరిగిపోయేలా సమాధానం ఇచ్చారు. తిరుగులేని లెక్కలతో, ఎవరూ కాదనలేని చారిత్రక సత్యాలతో సభ మొత్తాన్ని గుండుసూది పడినా వినిపించేంత నిశ్శబ్దంలో ముంచెత్తారు.

దేశంలోని మొట్టమొదటి విద్యుత్ బోర్డు ఎక్కడ పెట్టారో తెలుసా.. హైదరాబాద్ లో!! భారత కోకిల సరోజినీ నాయుడు లండన్ లో చదువుకోడానికి స్కాలర్ షిప్ ఇచ్చింది ఎవరో తెలుసా.. నిజాం! మీరందరూ కూర్చున్న ఈ అసెంబ్లీ భవనాన్ని నిర్మించింది ఎవరో తెలుసా.. నిజాం!! హైదరాబాద్ జాగీర్ స్కూల్.. అదే ఇప్పటి హైదరాబాద్ పబ్లిక్ స్కూలును కట్టించింది కూడా ఆ నిజామే. అదే స్కూల్లో సభా నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి, నేను, మా అన్న, జగన్ మోహన్ రెడ్డి, పల్లంరాజు.. అందరం చదువుకున్నాం. హైదరాబాద్ లో ఎప్పుడెప్పుడు ఏయే ఫ్యాక్టరీలు, పాఠశాలలు, గ్రంథాలయాలు వచ్చాయో తెలుసా.. అంటూ మొత్తం సంవత్సరాల వారీగా లెక్కలు, పేర్లు ఏకబిగిన అరగంటపాటు చదివిన మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సోమవారం నాడు అసెంబ్లీలో వన్ మ్యాన్ షో నడిపించారు.

ముందుగా ప్రిపేర్ అయ్యి ఉంటే, లెక్కలన్నీ దగ్గర పెట్టుకుంటే, దానికి తోడు తగిన వాగ్ధాటి ఉంటే సభను ఎలా తన అదుపులోకి తెచ్చుకోవచ్చన్న దానికి అక్బరుద్దీన్ ఒవైసీ చక్కటి ఉదాహరణగా నిలిచారు. నిజాం కాలం నుంచి రాష్ట్రం ఏర్పడే వరకు హైదరాబాద్ నగరంలో ఉన్న మొత్తం ఫ్యాక్టరీలు, విద్యాలయాలు, గ్రంథాలయాలు, చెరువులు.. ఇలా మొత్తం వేటివేటిని ఎప్పుడెప్పుడు ఏర్పాటుచేశారో సంవత్సరాలతో సహా లెక్కలు మొత్తం చదివి వినిపించారు. ఈ చారిత్రక సత్యాలను ఎవరైనా కాదనగలరా అంటూ నిలదీశారు. ఒక్కరు సమాధానం చెబితే ఒట్టు!! హైదరబాద్ నగర అభివృద్ధి మొత్తం తనహయాంలోనే జరిగిందని చెప్పుకొన్న విపక్షనేత చంద్రబాబు నాయుడుకు ఈ దెబ్బకు దిమ్మతిరిగిపోయింది. సభ సజావుగా నడవకుండా ఉండేందుకు తన ఎమ్మెల్యేలతో గొడవ చేయించారు తప్ప, అక్బర్ ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా ఆయన గానీ, ఆయన సహచరులుగానీ సమాధానం మాత్రం ఇవ్వలేకపోయారు. హైదరాబాద్ నగరంలో అప్పటికే అభివృద్ధి ఉంది కాబట్టే దేశం నలుమూలల నుంచి అందరూ వచ్చి ఇక్కడ వ్యాపారాలు, ఇతర వ్యవహారాలు చేసుకుంటున్నారని అక్బరుద్దీన్ చెప్పిన మాటలను ఎవరూ కాదనలేకపోయారు.

పైకి తన్నే గ్యాస్.. పగబట్టే ఆసిడ్!!

పైకి తన్నే గ్యాస్..పగబట్టే ఆసిడ్!!

Sakshi | Updated: January 21, 2014 00:37 (IST)
గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిప్లక్స్ డిసీజ్ (జీఈఆర్‌డీ)

ఎంత ఆరోగ్యవంతుడికైనా... కడుపులో గ్యాస్ పైకి ఎగజిమ్ముతూ... ఇబ్బంది పెట్టడం ఎప్పుడో ఒకసారి అనుభవంలోకి వచ్చే విషయమే. ఆ సమయంలో వ్యక్తి కిందామీదా అయిపోతాడు. ఒక్కోసారి గ్యాస్ పైకి తన్నే సమయంలో గుండె వద్ద ఇబ్బంది కలిగిస్తూ గుండెపోటేమో అనుకునేంత ఆందోళనకు గురిచేస్తుంది. అర్జెంటుగా ఆసుపత్రికి రప్పిస్తుంది. ఆహారం జీర్ణం కావడానికి అవసరమయ్యే ఆసిడ్ ఉత్పత్తి జరిగి గ్యాస్‌లా పైకి ఎగజిమ్ముతూ ఇబ్బంది పెట్టే ఈ సమస్యను వైద్యపరిభాషలో ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్’ (జీఈఆర్‌డీ) అంటారు. ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం.


 సమస్య వస్తుందిలా...
 మనం తిన్న ఆహారం ఒక సన్నటి ఆహారనాళం (ఫుడ్ పైప్) ద్వారా కడుపులోకి వెళ్తుంది. ఈ ఫుడ్ పైప్ సాధారణంగా తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర అంగుళాల పొడవుంటుంది. ఇది కడుపు/ఆహారకోశం (స్టమక్) లోకి దారితీస్తుంది. ప్రతి ఒక్కరికీ ఆహారనాళం, ఆహార కోశం... ఈ రెండింటి జంక్షన్‌లో ఆహారం పైకి వెళ్లకుండా ఒక మెకానిజం ఉంటుంది. కడుపులోకి ఆహారం వచ్చిన తర్వాత అక్కడి నుంచి జీర్ణమయ్యే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఆసిడ్ పైకి ఎగజిమ్ముతున్నా, ఆహారం జీర్ణం కావడానికి తగినంత ఆసిడ్ అక్కడ లేకపోయినా, దాన్ని భర్తీ చేసేందుకు మరింత ఆసిడ్ ఉత్పన్నం అవుతుంది. దాంతో అది కడుపు కండరాల మీద ప్రభావం చూపి, అక్కడ స్టమక్ అల్సర్ (కడుపులో పుండ్లు) వచ్చేలా చేస్తుంది. ఇది ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు. ఒకవేళ ఆ పరిస్థితికి దారి తీయకపోయినా, రోజువారీ పనులకు ఆటంకంగా పరిణమిస్తుంది కాబట్టి... ఈ సమస్య రాకుండా చూసుకోవడమే మంచిది.


 రూల్ అవుట్ చేసుకోవాలి ఇలా...
 కొందరిలో ఛాతీ నొప్పిగా అనిపించి, ఆ నొప్పి ఛాతీ కింద ఉండే ఎముక కింద చిక్కుపడిపోయినట్లుగా వస్తుంటుంది. ఫలితంగా దాన్ని గుండెనొప్పితో ముడివేసి చాలామంది ఆందోళన పడుతుంటారు. ఈ నొప్పి గుండెను ఒత్తినట్లుగా అనిపిస్తుండటంతో గుండెపోటుగా పొరబడతారు. కాబట్టి ఈ రెండింటి లక్షణాలూ చూసి అది గుండెపోటు లేదా యాంజైనా కాదని నిర్ధారణ చేసుకోవడం ప్రధానం.

 కడుపులో అల్సర్స్‌కు మరో కారణం...
 కడుపు కండరాల్లో హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఆసిడ్స్ ఎక్కువగా స్రవించడం ద్వారా వచ్చే పెప్టిక్ అల్సర్స్‌కు ఈ బ్యాక్టీరియా కూడా ఒక కారణం. ఇలా ఆసిడ్ పైకి చిమ్మే వారిలో హెచ్.పైలోరీ ఉందా లేదా అని నిర్ధారణ చేసుకోవడం అవసరం. ఒకవేళ ఉంటే వారికి యాంటీబయాటిక్స్ ఇవ్వడం ద్వారా  సమస్యను అధిగమించవచ్చు.


 జీఈఆర్‌డినీ ప్రేరేపించే అంశాలు  (రిస్క్ ఫ్యాక్టర్స్)
 ఆహారం తీసుకునే విధానం (ఈటింగ్ ప్యాటర్న్):
 తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడం వల్ల కడుపుపై పడే భారం కూడా తగ్గుతుంది. అయితే కొందరు చాలాసేపు ఆహారం తీసుకోకుండా, ఒకేసారి ఎక్కువ పరిమాణంలో తినేస్తుంటారు. ఆ తర్వాత వెంటనే పక్కలకు ఒరగడం, నిద్రకు ఉపక్రమించడం చేస్తుంటారు. దీంతో గుండెలో మంట రావడానికి అవకాశం ఎక్కువ.
 గర్భం ధరించడం (ప్రెగ్నెన్సీ): గర్భవతులకు ‘జీఈఆర్‌డీ’ రిస్క్ ఎక్కువ. ప్రధానంగా ఆఖరి మూడు మాసాల్లో ఈ సమస్యకు అవకాశం ఎక్కువ. వారిలో పెరిగే పిండం ఆహార కోశానికి అవసరమైన ఖాళీని తగ్గిస్తుంది. దాంతో ఆహారం పైకి ఎగజిమ్మి గుండెలో/ఛాతీలో మంట కనిపిస్తాయి.
 ఇంకా... స్థూలకాయం, పొగతాగే అలవాటు, ఆల్కహాల్ దురలవాటు, హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ కూడా రిఫ్లక్స్‌కు కారణాలే.  అయితే... పైన పేర్కొన్న ఏ ఒక్క అంశమో కాకుండా... కొన్ని సార్లు అనేక అంశాలు కలగలిసి ఈ రిస్క్‌ను పెంచుతాయి. ఇక పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం... ఈ రెండూ చేసేవారికి రిఫ్లక్స్ రిస్క్‌తో పాటు జీర్ణాశయంలో క్యాన్సర్ రిస్క్ కూడా ఎక్కువని గ్రహించాలి.


 జీఈఆర్‌డీ  తదుపరి పరిణామాలు
 సాధారణ సమస్యగా మొదలయ్యే జీఈఆర్‌డీని నియంత్రించుకోకపోతే ఇతర పరిణామాలకు కారణం కావచ్చు. అవి...
  జీర్ణకోశం ఒరుసుకుపోవడం (ఎరోసివ్ ఈసోఫేజైటిస్)
  జీర్ణకోశం ఇరుకుగా మారడం (ఈసోఫేజియల్ స్ట్రిక్చర్)
  బారెట్స్ ఈసోఫేగస్ ’(అంటే... క్రమంగా అది ఈసోఫేజియల్ క్యాన్సర్‌కు దారితీయడం. అయితే అదృష్టవశాత్తూ... భారతీయుల్లో ఈ కండిషన్ చాలా అరుదు).


 కడుపులో అల్సర్స్‌కు మరో కారణం...
 కడుపు కండరాల్లో హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఆసిడ్స్ ఎక్కువగా స్రవించడం ద్వారా వచ్చే పెప్టిక్ అల్సర్స్‌కు ఈ బ్యాక్టీరియా కూడా ఒక కారణం. ఇలా ఆసిడ్ పైకి చిమ్మే వారిలో హెచ్.పైలోరీ ఉందా లేదా అని నిర్ధారణ చేసుకోవడం అవసరం. ఒకవేళ ఉంటే వారికి యాంటీబయాటిక్స్ ఇవ్వడం ద్వారా  సమస్యను అధిగమించవచ్చు.

 సమస్యను తీవ్రతరం చేసే మందులు

 కొన్ని రకాల మందులు ఆసిడ్‌ను పైకి ఎగజిమ్మేలా చేస్తుంటాయి. ఉదాహరణకు నొప్పినివారణ మందులు/ఎన్‌ఎస్‌ఏఐడీ మందులు (పెయిన్ కిల్లర్స్/నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్) వంటివి ఆసిడ్ ఎక్కువగా పుట్టేలా చేసి కడుపులో అల్సర్స్‌ను పెంచుతాయి. వాటిని వాడాల్సి వచ్చినప్పుడు వాటి తీవ్రతను తగ్గించడానికి కొన్ని రక్షణ మందులనూ డాక్టర్లు సూచిస్తుంటారు.


 ఆయుర్వేదంలో పరిష్కారం ఇలా...
 ఇంగ్లీషులో జిఇఆర్‌డి అని పిలిచే ఈ వ్యాధి ఆయుర్వేదంలో అమ్లపిత్తం లక్షణాలను కలిగి ఉంటుంది. అమ్లపిత్తం తగ్గడానికి ఆయుర్వేద మార్గం ఇలా...
 ఆహారం: అల్పాహారమైనా, భోజనమైనా ప్రతిరోజూ నియమిత వేళల్లోనే స్వీకరించాలి. పులుపు, ఉప్పు, కారం పూర్తిగా మానెయ్యండి. తీపి పదార్థాలు, నూనె పదార్థాలు బాగా తగ్గించండి. ప్రతి రెండు గంటలకు ఒక లీటరు నీళ్లు తాగండి. అల్పాహారంలో ఇడ్లీ మంచిది. మొలకలు, గ్రీన్‌సలాడ్స్ కూడా తీసుకోండి. ఆవుపాలు, ఆవుమజ్జిగ వాడండి. బొంబాయిరవ్వ, బార్లీ, రాగులు మున్నగు వాటితో చేసిన జావ అప్పుడప్పుడూ తాగాలి.
 మందులు:   లఘుసూతశేఖర రస (మాత్రలు): ఉదయం 2, రాత్రి 2   అవిపత్తికర చూర్ణం: మూడుపూటలా ఒక్కొక్క చెంచా (నీటితో)   శుక్తిన్ (మాత్రలు ): ఉదయం 1, రాత్రి 1
 గమనిక: అధిక రక్తపోటు, మధుమేహం వంటి ఇతర వ్యాధులుంటే, వాటిని నియంత్రణలోకి తెచ్చుకోవాలి. ప్రతిరోజూ పరగడుపున ఒక అరటిపండు తినడం ఈ సమస్యకు మంచిది.


 పరిస్థితిని  మెరుగుపరిచే చిట్కాలు
 జీఈఆర్‌డీ కండిషన్ కనిపిస్తున్న వారు తక్కువ కొవ్వు ఉండే ఆహారాలు తీసుకోవాలి. మాంసాహారం ఇష్టమైన వారు తక్కువ కొవ్వు ఉండే చికెన్ (పౌల్ట్రీ), చేపల వంటి వైపునకు మొగ్గుచూపాలి. ఇక పాలలోనూ కొవ్వు తక్కువగా ఉండే డెయిరీ ఉత్పాదనలను వాడాలి. అంటే స్కిమ్‌డ్ మిల్క్ వంటివి. పుల్లటి పండ్లు... అంటే నారింజ, నిమ్మ, ద్రాక్ష, పైనాపిల్, టమాటాలకు కాస్త దూరంగా ఉండాలి.

 సాధారణ నివారణ ప్రక్రియలు
 ఈ జబ్బుకు నివారణ చాలా సులభం. జీవనశైలిలో మార్పులతో దీన్ని ప్రాథమికంగా నివారించుకోవచ్చు. ఆ మార్గాలు కూడా చాలా సులభం. అవి... వేళకు తినడం, కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం, రోజూ తీసుకునే కాఫీ, టీ వంటి పానీయాలు పరిమితంగానే తీసుకోవడం, చాక్లెట్లు చాలా తక్కువగా తీసుకోవడం, ఈ జబ్బు ఉన్నట్లు గమనిస్తే ఉల్లి, వెల్లుల్లి, పెప్పర్‌మింట్ వంటివాటిని తక్కువగా తీసుకోవడం, పొగతాగడం, మద్యపానాన్ని పూర్తిగా మానే యడం, శీతల పానీయాలు, కోలా డ్రింక్స్ కూడా మానేయాలి.


 వ్యాధి నిర్ధారణ
 అడపాదడపా ఛాతీలో మంటగా అనిపించడం అందరిలోనూ జరిగేదే. అయితే ఈ ఇబ్బంది పదే పదే కనిపిస్తుంటే జీఈఆర్‌డీగా అనుమానించి డాక్టర్‌ను సంప్రదించాలి. సాధారణంగా యాంటాసిడ్స్ వాడగానే ఉపశమనం కలుగుతుంటే అది జీఈఆర్‌డీ అని నిర్ధారణ జరిగినట్లే. దీని ద్వారానే కొన్నిసార్లు డాక్టర్లు కొన్ని మందులు ఇచ్చి చూసే ధోరణితో ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనే మందులు ఇస్తారు. దీనిద్వారా 80 శాతం నుంచి 90 శాతం మందిలో వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. కొందరిలో మరింత నిర్దిష్టత కోసం కొన్ని ల్యాబ్ పరీక్షలు, ఎండోస్కోపీ అవసరం కావచ్చు.

 గొంతులో కనిపించే లక్షణాలు
 చాలా అరుదుగా కొందరిలో గొంతు బొంగురుగా  (హోర్స్‌నెస్) కనిపిస్తుంది. దాంతో గొంతు మారుతుంది. మాటిమాటికీ గొంతు సవరించుకుంటూ ఉండాల్సి రావడం కూడా చూడవచ్చు. మింగడంలో ఇబ్బందినీ గమనించవచ్చు. గొంతులో మంట, దీర్ఘకాలికంగా దగ్గు వంటివీ కనిపిస్తాయి.

 ఆసిడ్ పైకి చిమ్మడానికి కారణాలు...

 ఆహార సంబంధమైనవి...
 ఈ సమస్యకు అనేక కారణాలున్నాయి. ఉదాహరణకు మనం రోజూ తినే ఆహారంలో కొన్ని స్వాభావికంగానే ఆసిడ్‌ను పెంచేవి ఉంటాయి. దాంతోపాటు మనం చేసే పనుల్లో కూడా గుండెమంటకు దోహదం చేసేవీ ఉంటాయి. ఉదాహరణకు బరువులు లేపడం, పక్కలకు ఒరగడం, కడుపునిండా తిని, వెంటనే పడుకోవడం.

మరికొన్ని ప్రధాన కారణాలు...
  మనం తీసుకునే ఆహారంలో కొవ్వు, ఉప్పు, కారం, మసాలాలు ఎక్కువగా ఉండటం.
 పీచు తక్కువగా ఉండే బేకరీ ఐటమ్స్ తీసుకోవడం.
ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం

శరీర (జీర్ణకోశ) నిర్మాణపరమైనవి...
 మన ఆహారనాళం, అన్నవాహిక లేదా జీర్ణకోశంలోకి వెళ్లే జంక్షన్‌లో ఒక మూత (స్ఫింక్టర్) లాంటి నిర్మాణం ఉంటుంది. ఈ మూతను వైద్యపరిభాషలో ‘లెస్’ అని పిలుస్తారు. జీర్ణకోశంలోకి వెళ్లిన ఆహారం పైకి రాకుండా ఈ లెస్ అడ్డుపడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో అది బలహీనంగా ఉండటం వల్ల గొంతులోకి మెతుకులు రావడం, గ్యాస్, ఆసిడ్ రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ‘లెస్’ అనే ఆ నిర్మాణం సరిగా పనిచేయాలంటే కడుపు కండరాలు మృదువుగా ఉండాలి, అక్కడి హార్మోన్లు సక్రమంగా స్రవించాలి. ఒకసారి కడుపులోకి ఆహారమంతా చేరుకున్న తర్వాత ఆ స్ఫింక్టర్ పూర్తిగా మూసుకుపోవాలి. లేదంటే ఈ లెస్ అనే నిర్మాణం బలహీన పడి ఆసిడ్ పైకి ఎగజిమ్ముతుంది.


 ఓ విచిత్రం... ఇంకా కొనసాగుతున్న అధ్యయనం
 కడుపులో అల్సర్స్‌కు కారణంగా భావించే హెలికోబ్యాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా... నిజానికి ఆసిడ్ ఉత్పత్తిని నియంత్రిస్తూ ఉండాలి. అలా అదనపు ఆసిడ్ పైకి చిమ్మకుండా చూసే రక్షణ బాధ్యత కూడా ఆ బ్యాక్టీరియాదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ సూక్ష్మజీవులను తుదముట్టించడానికి ఇచ్చే యాంటీబయాటిక్ చికిత్స ‘రిఫ్లక్స్’ను ఇంకా ప్రేరేపిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతానికి కడుపులో అల్సర్స్‌కు యాంటీబయాటిక్ చికిత్సనే ప్రొటోకాల్‌గా గుర్తిస్తున్నందు వల్ల ఇంకా ఇదే చికిత్స కొనసాగుతోంది. అయితే హెచ్.పైలోరీ బ్యాక్టీరియా కోసం యాంటీబయాటిక్స్ ఇవ్వడం సరైనదేనా, ఇది ఆసిడ్ రిఫ్లెక్స్‌ను పెంచుతుందా అన్న అంశంపై ఇంకా అధ్య యనాలు కొనసాగుతున్నాయి.

 గృహవైద్యం
 అప్పుడే పెరుగు చిలికిన మజ్జిగ తీసుకోవడం  మంచి గృహవైద్యం. తాజా మజ్జిగకు క్షారగుణం ఉంటుంది. ఇది కడుపులోని ఆసిడ్‌తో కలవగానే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తుంది.  కడుపును చల్లగా ఉంచే తాజా పెరుగు, తియ్యటి పెరుగు కూడా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పెరుగులోని ప్రొ-బయోటిక్ ఫ్యాక్టర్స్ అక్కడి బ్యాక్టీరియాను నియంత్రించి కడుపులో మంటను తగ్గిస్తాయి.

 రాబోయే మరో కొత్త చికిత్స
 రేడియో ఫ్రీక్వెన్సీ: ఒక సూది లాంటి ఉపకరణం నుంచి వెలువడే రేడియో తరంగాల ద్వారా ‘లెస్’ స్ఫింక్టర్‌లో సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేసి, అంతా ఆరోగ్యవంతమైన రీతిలో ఉండేలా చేస్తారు. ఇలా చేసే ప్రక్రియలో వెలువడ్డ వేడి తరంగాలు అక్కడి చెడిపోయిన కండరాలను భస్మం చేయడం లేదా అక్కడ అడ్డదిడ్డంగా పనిచేస్తున్న నరాలను కాల్చేయడం చేసి, అంతా ఆరోగ్యవంతమైన భాగాలే పనిచేసేలా ఈ ప్రక్రియ చూస్తుంది.

 భవిష్యత్ చికిత్సల విషయంలో రాబోయే మార్పులు
 ఎండోస్కోపిక్ మార్గాల ద్వారా చేసే చికిత్సలతో ఉపశమనం మాత్రమే కలుగుతుందని, లక్షణాలు మాత్రమే తగ్గుతాయని భావిస్తున్న పరిశోధకులు ఇప్పుడు మరింత ప్రభావపూర్వకమైన చికిత్సల దిశగా పరిశోధిస్తున్నారు. ఇందులో భాగంగా యాంటీ రిఫ్లక్స్
 మెడికేషన్‌ను రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఇవి ప్రస్తుతం ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా నిర్వహిస్తున్న లాపరోస్కో పిక్ ఫండప్లికేషన్స్ కంటే ప్రభావవంతమైనవిగా ప్రస్తుతం కనిపించనప్పటికీ దీర్ఘకాలంలో సత్ఫలితాలనే ఇస్తాయని భావిస్తున్నారు.

 మరో కొత్త మార్గం ట్రాన్స్ ఓరల్ ఎండోస్కోపిక్ సూచరింగ్
 రిఫ్లక్స్ సమస్యను అధిగమించడానికి మరో మార్గం వదులైన లెస్ స్ఫింక్టర్‌కు కుట్లు వేయడం. ఈ ప్రక్రియలో ఎండోస్కోపీ చికిత్సలో భాగంగా ఒక చిన్న (మీనియేచర్) కుట్టు మిషన్‌ను లెస్ స్ఫింక్టర్ వద్దకు పంపి, అక్కడ దానికి కుట్లు వేసి, టైట్ చేస్తారు. దీనివల్ల ఆహారం పైకి తన్నకుండా ఉంటుంది. ఈ మొబైల్ కుట్టుమిషన్‌ను అక్కడికి పంపే ప్రక్రియలో ఎక్కడా శరీరాన్ని కోయాల్సిన అవసరం ఉండదు కాబట్టి కుట్లూ అవసరం పడవు. అలాగే అనస్థీషియా కూడా అవసరం ఉండదు.

 రాత్రిపూట కనిపించే జీఈఆర్‌డీ నివారణ ఇలా...
 కొందరిలో ఈ సమస్య రాత్రిపూట ఎక్కువగా ఉండి నిద్రలేకుండా చేస్తుంటుంది. ఇలాంటి రోగుల్లో చాలామందిఅది తీవ్రమైన గుండెజబ్బుగా అనుమానించి ఆందోళన పడటమూ సాధారణమే. ఇలాంటి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

రాత్రిపూట ఆలస్యంగా తినకూడదు.

రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత కొద్దిదూరం నడవాలి  రాత్రిపూట చిరుతిండ్లను మానేయాలి  రాత్రి నిద్రకు ముందర రెండుగంటల పాటు ఏమీ తినకూడదు.

పక్కమీదకు వెళ్లగానే ఎడమవైపునకు ఒరిగి పడుకోవాలి  మీ తల వైపు భాగం కాస్త ఎత్తుగా ఉండేలా మీ పక్కను సర్దుకోండి. ఇలా రిఫ్లక్స్ సమస్యతో బాధపడేవారు వీలైతే ఒక మెత్త (దిండు)ను ఎక్కువగా పెట్టుకోవడం కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ దిండును తల కింద మాత్రమేగాక మీ భుజాల కింది వరకూ ఉండేలా చూసుకోవడం మంచిది.

 చికిత్స
 అన్నిటి కంటే ముఖ్యమైన నివారణ అయిన జీవనశైలిలో మార్పు తర్వాత కూడా ఫలితం కనిపించకపోతే ఆసిడ్‌ను నియంత్రించే మందులు వాడటం అవసరం. ఈ మందులు మనలో ఆసిడ్ ఉత్పత్తిని తగ్గించడం మాత్రమే కాకుండా లెస్ స్ఫింక్టర్ పనితీరును మెరుగుపరచడం, ఈసోఫేగస్, కడుపు కండరాలు సక్రమంగా స్పందించేలా / పనిచేసేలా చేస్తాయి. ఆ తర్వాత హెచ్2 బీటా బ్లాకర్స్, ప్రోటాప్ పంప్ ఇన్హిబిటర్స్ (పీపీఐ) అనే మందులతోనూ చికిత్స చేస్తారు. ఇవి ప్రభావవంతంగా పనిచేయడానికి కనీసం 6 నుంచి 12 వారాల వ్యవధి పట్టవచ్చు.

 శస్త్రచికిత్స
 ఇక జీవనశైలిలో మార్పులు, మందులు పనిచేయకపోతే శస్త్రచికిత్స గురించి ఆలోచించాల్సి ఉంటుంది. చాలా చిన్నవయసులోనే దీర్ఘకాలిక జీఈఆర్‌డీతో బాధపడుతూ, జీవితాంతం మందులు వాడాల్సిన సందర్భాల్లో శస్త్రచికిత్స గురించి ఆలోచించాల్సి రావచ్చు.

 డాక్టర్ ఐతా శ్రీవేణు,
 సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్,
 సిగ్నస్ గాస్ట్రోఎంటరాలజీ
 అండ్ అడ్వాన్స్‌డ్
 ఎండోస్కోపీ సెంటర్,
 మియాపూర్, హైదరాబాద్


 - డా. విఎల్‌ఎన్ శాస్త్రి, ఆయుర్వేద నిపుణులు
 

Sunday 19 January 2014

తెలుగువాళ్ళుగా సీమాంధ్ర అభివృధ్జ్ధిని కోరుకుంటాం

తెలుగువాళ్ళుగా సీమాంధ్ర అభివృధ్జ్ధిని కాంక్షిస్తాం - హరీష్ రావు 

భద్రాచలం సీమాంధ్రకే - BJP

విభజన బిల్లుకు బీజేపీ సవరణాస్త్రం! 





భద్రాచలం సీమాంధ్రకే

Published at: 20-01-2014 04:26 AM
 New  0  0 
 
 

బహుళార్థ సాధక ప్రాజెక్టుగా పోలవరం
సీమాంధ్ర ప్రాజెక్టులకు చట్టపరమైన రక్షణ
రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి రాజధాని
పార్లమెంటులో పది సవరణలకు సంసిద్ధం?
న్యూఢిల్లీ, జనవరి 19: రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడేందుకు బీజేపీ సిద్ధమైంది. విభజన బిల్లుకు పార్లమెంటులో పది సవరణలు ప్రతిపాదించేందుకు రంగం సిద్ధం చేసింది. భద్రాచలం రెవెన్యూ డివిజన్‌ను సీమాంధ్రలోనే కలపడం.. పోలవరానికి బహుళార్థ సాధక ప్రాజెక్టు హోదా కల్పించడం.. సీమాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకు చట్టపరమైన రక్షణ కల్పించడం.. హైదరాబాద్‌లోని సీమాం«ద్రులకు, ఉద్యోగులకు భరోసా ఇవ్వడం తదితరాలు ఈ సవరణల్లో ప్రధానంగా ఉన్నాయి. ఈ సవరణలకు కాంగ్రెస్ ఆమోదించకపోతే బిల్లుకు మద్దతు ఇవ్వరాదని కూడా నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీ సీమాంధ్ర నేత హరిబాబు సూచించిన సవరణల్లో అధిక శాతం అంశాలను పార్లమెంటులో లేవనెత్తాలని బీజేపీ జాతీయ మండలి సమావేశాల్లో నిర్ణయించినట్లు తెలిసింది. వీటిని ఆమోదిస్తేనే సీమాంధ్రలో ముందుకు వెళ్లగలమని కూడా బీజేపీ భావిస్తోంది. బీజేపీ సూచించనున్న పది సవరణలు...
పోలవరం.. భద్రాచలం రెవెన్యూ డివిజన్: బిల్లులోని పార్ట్-2లోని క్లాజ్ 3, పార్ట్ 9లోని క్లాజు 9లో పోలవరానికి సంబంధించి బీజేపీ సవరణలు ప్రతిపాదించే అవకాశాలున్నాయి. బిల్లులో పోలవరాన్ని కేవలం నీటిపారుదల ప్రాజెక్టుగా మాత్రమే పేర్కొన్నారని, దాన్ని బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మార్చి కేంద్ర జల వనరుల సంఘం ఇచ్చిన అనుమతిని యథాతథంగా అమలు చేయాలని బీజేపీ భావిస్తోంది. లేకపోతే తెలంగాణ, కర్ణాటక దయాదాక్షిణ్యాలపై సీమాంధ్ర ప్రజలు ఆధారపడాల్సి వస్తుందని బీజేపీ పేర్కొంటోంది. ఇక భద్రాచలం రెవెన్యూ డివిజన్‌పై తెలంగాణకు హక్కు లేదని, అది 1820 నుంచి 1959 వరకు సీమాంధ్రలో ఉందని బీజేపీ వాదిస్తోంది. ఈ మేరకు జీవో 111, 27.6.2005లో పేర్కొన్నట్లుగా మొత్తం 134 గ్రామాలను భద్రాచలం రెవెన్యూ డివిజన్‌తో పాటు సీమాంధ్రలో చేర్చాలని ప్రతిపాదిస్తున్నారు.
ప్రాజెక్టులకు చట్టపరమైన పరిరక్షణ: తెలంగాణ, సీమాంధ్రలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులకు చట్టపరమైన రక్షణ కల్పిస్తూ పార్ట్ 9లో కొత్త క్లాజును చేర్చాలని, రాయలసీమకు గోదావరి బేసిన్ నుంచి 200 టీఎంసీల నీటిని పంపిణీ చేసేందుకు వీలుగా పార్ట్ 9లో కొత్త క్లాజును చేర్చాలని ప్రతిపాదిస్తున్నారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలకు భద్రత: తెలంగాణలో 50 లక్షల మంది సీమాంధ్ర ప్రజలున్నారని. అందులో సగం మందికి పైగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్నారని బీజేపీ పేర్కొంది. రాజధాని వీరి జీవితంలో భాగమని, వీరు రాజధాని అభివృద్దిలో కీలక పాత్ర పోషించారని, వీరిని ఉమ్మడి రాజధాని పేరుతో మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని, న్యాయస్థానాలు కూడా దీన్ని కొట్టివేసే అవకాశాలున్నాయి బీజేపీ వాదిస్తోంది.
కొత్త రాజధాని: కొత్త రాజధాని విషయంలో మున్ముందు ఎలాంటి వివాదాలు లేకుండా ఉండాలంటే బిల్లులోనే సీమాంధ్రకు కొత్త రాజధాని పేరును ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రజల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి రాజధానిని ఏర్పర్చాలని బీజేపీ సీమాంధ్ర నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు ఆర్థిక ప్యాకేజీ ఎంతో బిల్లులోనే పేర్కొనాలని కోరుతోంది.
ఉపాధి అంశాలు: ప్రభుత్వోద్యోగులు విభజన తర్వాత ఎక్కడ కావాలంటే అక్కడ పనిచేసేందుకు అవకాశం కల్పించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
ఆర్థిక మెమోరాండం: అత్యంత కీలకమైన ఆర్థిక మెమోరాండంను బిల్లులో భాగంగా చేర్చాలి.
హైదరాబాద్ రెవెన్యూ: రాష్ట్ర రెవెన్యూలో 30 శాతం హైదరాబాద్ నగరం నుంచే లభిస్తోంది సీమాంధ్రకు ఈ ఆదాయంలో ఎంత వాటా లభిస్తుందో బిల్లులో స్పష్టంగా పేర్కొనాలి.
ఉన్నత సంస్థలు, ప్రాజెక్టులు: 13వ షెడ్యూలులోని 5వ అంశంలో ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ, కేంద్ర విశ్వవిద్యాలయాలు వంటి సంస్థలను 12, 13 వ ప్రణాళికలో సీమాంధ్రలో ఏర్పరుస్తామని చెప్పారు. కేవలం హామీలు సరిపోవు. నిర్ణీత కాలంలో ప్రణాళికాసంఘం ఆమోదంతో అమలు చేసేందుకు బిల్లులో స్పష్టత ఇవ్వాలి. అదే విధంగా క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్, విమానాశ్రయాల విస్తరణ పై ఉత్తుత్తి వాగ్దానాలు చేర్చారు. ఈమేరకు ఉత్తర్వులను బిల్లులో చేర్చాలి.
సీమలో స్టీలు ప్లాంట్: రాయలసీమలోని కడప జిల్లాలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు బ్రాహ్మణి స్టీల్స్ స్థానంలో ప్లాంట్‌ను నెలకొల్పాలి. దాని బదులు ఖమ్మంలో పెడతామని హామీ ఇవ్వడం సరి కాదు.
భారీ ప్యాకేజీ: ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు భారీ ఆర్థిక ప్యాకేజీని నిర్ణయించి బిల్లులో చేర్చాలి.
- See more at: http://www.andhrajyothy.com/node/55896#sthash.ka1G7Dy3.dpuf

Saturday 18 January 2014

Government is not a firecracker godown

M.J. AKBAR
BYLINE
MJ Akbar is the Editorial Director of The Sunday Guardian.
Government is not a firecracker godown
When Kejriwal threatens to sit in public protest against his own state’s police, then there are only a few stages left to chaos.
ny political party that rises from street turmoil must of necessity reflect the varied character of its origins. Everyone wearing a Gandhi cap does not become a Gandhi. But the very nature of an urban insurrection forces a primary test upon its leadership. If leaders cannot separate wheat from chaff, and do so quickly, the chaff takes over. Any diet of chaff can give politicians serious indigestion.
The last effective democratic uprising to enter the portals of power was the Janata Party in 1977. Its field was not limited to the municipal girth of a pampered capital. It ranged in every state north of the Vindhyas. It won, therefore, a comfortable majority in the Lok Sabha. It did not have to struggle into office on a tricolour crutch. But its experience is instructive.
The Janata Party exploded long before it could approach its potential, destroying hopes it had raised. Its leaders made a critical mistake in the first fortnight, from which the party never recovered. They pandered to irresponsible and irrepressible mavericks within the fold, instead of snuffing them out when they had the authority to do so.
{
The Aam Aadmi Party is encouraging street radicalism without possessing the courage to become Naxalites.It has become so holier-than-thou that when its minister is exposed by a judge then it is the judiciary that must be wrong.
The polar ends of Janata were represented by two men who could not have been more different, in personality and philosophy. Morarji Desai, a Congress stalwart, and a punctilious Gandhian, challenged the decision of the Congress high command to make Mrs Indira Gandhi PM after the sudden death of Lal Bahadur Shastri in 1966. Desai lost, but did not forget.
Desai dined on nuts [literally]. Raj Narain was nuts [equally literally]. Nominally aligned to the socialist movement started by Dr Ram Manohar Lohia, Raj Narain turned into a one-man firecracker godown, whose giggles became louder with each incendiary outburst. If Desai ever smiled, no one saw him do so. If Raj Narain was ever sober, no one noticed it. By 1979, Narain, by propping up Charan Singh, and scheming with Congress, had destroyed the Janata government, and with it the Janata Party.
Raj Narain became famous when his petition against Mrs Gandhi's 1971 election from Rae Bareli was struck down by the Allahabad High Court in 1975. Narain's lawyer was Shanti Bhushan, father of the Aam Aadmi leader Prashant Bhushan.
This by itself does not establish behavioural connect. But evidence is beginning to tell its own story.
Arvind Kejriwal wants to combine the rectitude of Morarji Desai with the free-wheeling manoeuvres of Raj Narain. Ministers have become schizophrenic, responsible for departments for some hours of the day, and leading protests against their officials at other times.
Populism is a dangerous temptation. It is not limited to offering free power to those who refused to pay bills. It extends to vigilante behaviour in which any complaint is always valid, police is always wrong, and officials are morally bankrupt. Overheated rhetoric can take you perilously close to boiling point very quickly. When Kejriwal threatens to sit in public protest against his own state's police, then there are only a few stages left to chaos. Delhi's citizens voted for change, not anarchy. The Delhi police have dozens of faults, most of which those living here have experienced in one form or the other. But can you replace them with party volunteers?
White-heat purists frown upon any effort to make distinctions, quite forgetting that this is not a Leninist revolution but a democratic challenge. You cannot cut off heads and stuff government offices with party cadres.
The Aam Aadmi Party is encouraging street radicalism without possessing the courage to become Naxalites. Its tendencies [one cannot quite call it a manifesto, since no one has put it together into an intelligent, logical framework yet] are towards socialisation of the system and nationalisation to increase the power of the political class over both bureaucracy and private sector. It has become so holier-than-thou that when its minister is exposed by a judge then it is the judiciary that must be wrong. The party cannot be mistaken.
Lenin and Mao would agree.
Power is a responsibility. Think about this: if all it took to solve Delhi's woes and become popular was the distribution of cheaper electricity and water, why would Sheila Dikshit not have done so?
The one sterling card that AAP continues to possess is the promise to eliminate corruption in administration. Obviously this is not easy, which is why people will accept that this could take time. But time is not eternal in politics. Power itself is time-bound, and when you are dependent on Congress support, the timeline does become tight. Kejriwal won seats because he claimed that he had 300-plus pages of proof against Congress corruption. Someone is bound to ask, soon enough, if he has had any time to read them after becoming Chief Minister.
It does not matter if AAP ends up like Janata. What does matter is the disillusionment it will leave behind.

A world which spun on the axis of the heart

M.J. AKBAR
BYLINE
MJ Akbar is the Editorial Director of The Sunday Guardian.
A world which spun on the axis of the heart
In the 1950s and 1960s there seemed to be no other news worth bothering about in Bengal except the enchanting Suchitra Sen.
Uttam Kumar and Suchitra Sen in a still from the film Saptapadi.
ostalgia is not very good news for the nostalgic. The elegy of age lies a layer below the surface, trying hard but unable to hide. As the present hurries along towards the future at its usual frenetic pace, the draw of the past persuades one to pause in contemplation, unredeemed by any practical definition of utility. But nostalgia is not the sadness of an end; it is search, melancholic maybe, for nuggets in the rubbish dump of time.
Suchitra Sen has entered the last days of her life, in some Calcutta hospital. This is no longer news. In the 1950s and 1960s there seemed to be no other news worth bothering about in Bengal except the enchanting Suchitra Sen, particularly when she appeared on screen with her great paramour and thespian partner Uttam Kumar. Suchitra Sen was married to someone. No one knew who, and no one cared: Suchitra and Uttam possessed chemistry beyond science. Marriage seemed irrelevant. Everyone was married, including all — unlike today, when the operative if ebbing word is most — parents. But how many gorgeous women and handsome men were in love that was both subversive and flagrant? The world spun on the axis of the heart.
I had not put razor to chin when I first saw them in a movie, in a cinema hall called Jyoti. The seats confirmed my knowledgeable view that bedbugs were misnamed; they had quite a life outside bed as well.
We lived, or were locked, in a hamlet outside a jute mill on the banks of the meandering river Hooghly; but the imagination always escaped into an interwoven collage of dreams unbridled by any boundary. Nothing set fantasy on fire more quickly than a Suchitra smile, subtle, mischievous, and in full command of the relationship. Uttam Kumar was happy to become an adult boy before the goddess.
I cannot recall the name of that film; perhaps Saptapadi, perhaps not. It would be easy to check through the smooth alleys of modern internet technology. But that is only as necessary as a shrug. It was a time of black-and-white. It was an age of grain and velvet, and the sheen of velvet became a separate colour. Memory is better served in diffusion than in the particular.
The 1960s were draped by a grainy peel of shifting dots: nothing was clear, not a job in sight, not a prospect in place, the economy as disconsolate as aspiration. Little wonder then that the decade was marked by insurrection and violence, some in a Maoist cause, others for ethnic or communal reasons. A large comfort zone was the company of Suchitra Sen — and, to be fair, Uttam Kumar.
It was not the only one, of course. Dev Anand's jaunt, his street-smart zigzag through petty crime [selling black market movie tickets, picking pockets, finding courage in a gambling den] as the only option for survival, was equally irresistible. I never understood why Suchitra Sen and Dev Anand looked so distant from each other in their one film, Bombai Ka Babu. Every part of the construct was separately perfect: hero and heroine at the top of their game; the music divine; the plot far better than the soporific nonsense that was the usual diet for scripts. There could be only one reason. Suchitra and Dev were cold. There was nothing personal. We who knew Bengali cinema felt relieved. It was Suchitra and Uttam and Suchitra or nothing. Suchitra and Uttam even did a Bengali rendition of Othello in one film. Through some human miracle, it worked.
Suchitra never adapted to Hindi cinema; and nor did Uttam. Suchitra succeeded only when she did not need a stand-in for Uttam, in films where she was stellar rather than co-star. If you have not seen her brilliant performance in Mamta, order a copy now. It is a moving story of love lost and life betrayed. Two songs are classics: Lata Mangeshkar's Rahte thhe kabhi jinke dil mein hum jaan se bhi pyaaron ki tarah/Baithey hain unhi ke mehfil mein hum aaj gunahgaaron ki tarah, and Hemant Kumar's immortal Chupa lo yeh dil mein pyaar mera. The second success was Aandhi, where Suchitra portrayed a politician modelled on Mrs Indira Gandhi. Suchitra belonged to Bengal and Bengali.
Uttam Kumar died, suddenly, more than three decades ago. I was editor of the newsweeklySunday then. The commemorative issue in his memory sold out the moment it reached the stands, and not just in Calcutta. His funeral had an element of insanity, as young crowds fought to touch their idol on his final trip through the city he loved. Suchitra is still with us, and may the inevitable be delayed as much as a generous Providence can manage. But her memory will not die, as long as admiration is alive.