Thursday 16 January 2014

సీమాంధ్ర ఎంపీలకు హైకమాండ్ షాక్

ఆరుగురు సీమాంధ్ర ఎంపీలకు హైకమాండ్ షాక్

Published at: 16-01-2014 14:25 PM
 New  0  0 
 
 

న్యూఢిల్లీ, జనవరి 16 : సొంత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన ఆరుగురు సీమాంధ్ర పార్లమెంట్ సభ్యులకు కాంగ్రెస్ హైకమాండ్ షాక్ ఇచ్చింది. శుక్రవారం జరగనున్న ఏఐసీసీ సమావేశానికి పాస్‌లను నిరాకరించింది. వారు సమావేశానికి వచ్చి సమైక్యం పేరుతో గొడవ చేయవచ్చుననే అనుమానంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది.
పార్లమెంట్ సభ్యులు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, ఉండవల్లి అరుణకుమార్, సాయిప్రతాప్, హర్షకుమార్‌లను ఏఐసీసీ సమావేశాలకు దూరంగా ఉంచాలని హైకమాండ్ నిర్ణయించింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశాల్లో పాల్గొనడం  కాంగ్రెస్ నేతలు గౌరవంగా భావిస్తారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో వాడి, వేడిగా చర్చ కొనసాగుతున్న తరుణంలో ఢిల్లీ పెద్దలు ఈ మేరకు నిర్ణయం తీసుకోవటం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది.
- See more at: http://www.andhrajyothy.com/node/54639#sthash.sIqgfINk.dpuf

No comments:

Post a Comment