Monday 20 July 2015

ప్రత్యేకహోదా సాధనకై పార్లమెంట్ లోపల, బయటా పోరాటం - సుజనా చౌదరి

ఢిల్లీ: ప్రత్యేకహోదా సాధనకై పార్లమెంట్ లోపల, బయటా పోరాటం: కేంద్ర మంత్రి సుజనా చౌదరి

ఢిల్లీ, జూలై,20: ఏపీకి ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. విభజనచట్టం లోపాలపుట్టగా ఆయన అభివర్ణించారు. ప్రత్యేక హోదాకు పార్లమెంట్ లో కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. అవసరమైతే పార్లమెంట్ బయట కూడా ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. విభజన జరిగి చాలా కాలం అవుతున్నా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. వాటిని సరిదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఆయన సూచించారు. విభజన చట్టంలోని హామీల అమలుకు పట్టుబడతామని చెప్పారు. ఎవరూ తమ అంకితభావాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా మంచి సలహాలు ఇస్తే స్వీకరించడానికి సిద్దమని ప్రకటించారు. ప్రత్యేకహోదా సాధించడానికి అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేస్తామని చెప్పారు. పవన్ తమ మిత్రపక్షమని, ఆయన వ్యాఖ్యలలో మంచి ఉంటే తప్పనిసరిగా తీసుకుంటామని సుజనా చెప్పారు.

No comments:

Post a Comment