Wednesday 26 August 2015

చనిపోయింది నా కుమార్తె: అంగీకరించిన సిఈఓ భార్య

చనిపోయింది నా కుమార్తె: అంగీకరించిన సిఈఓ భార్య

ముంబై, ఆగస్ట్ 26: స్టార్ ఇండియా సిఈఓ పీటర్ ముఖర్జీ భార్య ఇంద్రాణి ముఖర్జీ తన కుమార్తె షీనా బోరాను హత్య చేయించినట్లు ముంబై పోలీసుల ముందు అంగీకరించారని తెలిసింది. అయితే షీనా తన భార్య ఇంద్రాణికి గత వివాహం వల్ల కలిగినట్లుగా తనకు తెలియదని పీటర్ ముఖర్జీ తెలిపారు. తన భార్య ఇంత ఘాతుకానికి పాల్పడిందని తెలిసి ఆయన షాక్‌కు గురయ్యారు. తన భార్య ఇంద్రాణి ఎప్పుడూ షీనా తన సో్దరి అని చెప్పేదని ఆయన గుర్తు చేశారు. 24 ఏళ్ల షీనా బోరాను చంపేసి 2012లో ముంబైకి 84 కిలో మీటర్ల దూరంలోని రాయ్‌గఢ్ అడవుల్లో పడేశారు. ఇంద్రాణి ముఖర్జీ కారు డ్రైవర్ ద్వారా తన కుమార్తె షీనాను హత్య చేయించినట్లు ఆరోపణలున్నాయి. 

No comments:

Post a Comment