Saturday 8 August 2015

రాష్ర్టానికి ప్రత్యేక ప్యాకేజీ వస్తుంది - కేంద్రమంత్రి సుజనాచౌదరి

విశాఖ : ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం ఉంది - మంత్రి యనమల

 విశాఖ, ఆగస్టు 8 : ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా అభివృద్ధిపై దృష్టి పెట్టామని, అభివృద్ధి కోసం అప్పులు కూడా చేస్తున్నామని చెప్పారు. విశాఖ ఆర్కే బీచ్‌లో పంద్రాగస్టు వేడుకల నిర్వహణపై మంత్రి చర్చించారు. ఏపీ విజన్‌ను ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహిస్తామన్నారు.

విజయవాడ : రాష్ర్టానికి ప్రత్యేక ప్యాకేజీ వస్తుంది - కేంద్రమంత్రి సుజనాచౌదరి

విజయవాడ, ఆగస్టు 8 : రాష్ర్టానికి ప్రత్యేక ప్యాకేజీ వస్తుందని కేంద్ర మంత్రి సుజనాచౌదరి చెప్పారు. నిపుణుల కమిటీతో చర్చల తర్వాత ప్రత్యేక హోదాపై స్పష్టత వస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక ప్యాకేజీ, అదనపు నిధుల కోసం కృషి చేస్తున్నామని సుజనాచౌదరి వివరించారు.

No comments:

Post a Comment