Thursday 6 August 2015

శేషాచలం ఎన్‌కౌంటర్‌ మృతుల కుటుంబాలకు... ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం

శేషాచలం ఎన్‌కౌంటర్‌ మృతుల కుటుంబాలకు...
ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం

చెన్నై, ఆగస్టు 6 : శేషాచలం ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఎర్రచందనం కూలీల కుంటుంబాలకు తమిళనాడు సర్కార్‌ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. 20 మందికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత గురువారం నియామక పత్రాలు అందజేశారు. ఒక్కొ కుటుంబానికి ఒక్కో ఉద్యోగం ఇచ్చారు. పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్న వారి కోరిక మేరకు జయలలిత ఈ నిర్ణయం తీసుకున్నారు. 17 మందికి వంటశాలలో సహాయకులుగా, ఇద్దరికి పోషకాహార భోజన పథకం కో-ఆర్డినేటర్లుగా, ఒకరికి అంగన్‌వాడి అసిస్టెంట్‌గా ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

No comments:

Post a Comment