Saturday 8 August 2015

ఏపీకీ ప్రత్యేక హోదా రాదు..

ఏపీకీ ప్రత్యేక హోదా రాదు..

అనంతపురం ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ఏపీకి ప్రత్యేక హోదా రాదని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుండబద్దలు కొట్టారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం డబ్బులిస్తుందని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాన మంత్రి మోదీ, హోం శాఖ మంత్రి రాజనాథ్‌ సింగ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలతో మాట్లాడినప్పుడు ప్రత్యేక హోదా రాదన్న విషయం వారి మాటల్లో స్పష్టమయిందన్నారు. అయితే కేంద్ర పాలకులకు రాష్ట్రంపై సానుభూతి ఉందన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీని ఆదుకుకోవాలన్న సంకల్పంతో ఉన్నారన్నారు.

No comments:

Post a Comment