Wednesday 19 August 2015

తిరుపతి : నీటి కోసం ఎస్వీయూ విద్యార్థుల ఆందోళన

తిరుపతి : నీటి కోసం ఎస్వీయూ విద్యార్థుల ఆందోళన

తిరుపతి, ఆగస్టు 19 : నీటి కోసం ఎస్వీయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం పెద్ద సంఖ్యలో విద్యార్థినీ, విద్యార్థులు యూనివర్శిటీలో భారీ ప్రదర్శనను నిర్వహించారు. పరిపాలనా భవనాన్ని ముట్టడించి ధర్నా చేపట్టారు. 5000 వేల మంది విద్యార్థులున్న యూనివర్శిటీ హాస్టల్‌లో కొంతకాలంగా తీవ్ర నీటి యెద్దడి నెలకొంది. 48 గంటలుగా తాగడానికి కూడా నీరు లేదని విద్యార్థులు మండిపడుతున్నారు. విద్యార్థుల ఆందోళనకు విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి.

No comments:

Post a Comment