Saturday 20 June 2015

బాహుబలి స్టోరీ ఇదేనా..?

బాహుబలి స్టోరీ ఇదేనా..?

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సినిమా బాహుబలి. జూలై 10న ఈ సినిమా విడుదలవుతోంది. అయితే బాహుబలి సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ స్టోరీ హల్‌చల్ చేస్తోంది.
ఇదీ కథ.. 
క్రీ.పూ. 540వ సంవత్సరంలో మహిష్మతి రాజ్యాన్ని ఓ రాజు పాలిస్తుండేవాడు. ఆయనకు ఇద్దరు కుమారులు అమరేంద్ర బాహుబలి (ప్రభాస్), భల్లలదేవ (రానా), ఓ కుమార్తె శివగామి (రమ్యకృష్ణ). అనంతరం ఆ రాజు మహిష్మతి రాజ్యనికి అమరేంద్ర బాహుబలిని అధిపతి చేస్తాడు. ఆయన భార్య దేవసేన (అనుష్క). వారి పాలనలో ప్రజలు సుఖశాంతులతో కాలం గడుపుతూ ఉంటారు. స్వార్థ పరుడైన మంత్రి బిజ్జలదేవ (నాజర్), బాహుబలి సోదరుడు భల్లలదేవ కలిసి అమరేంద్ర బాహుబలిని చంపి రాజ్యాన్ని తమ ఆధీననంలోకి తెచ్చుకుంటారు. రాజ్యం తమ అధీనంలోకి వచ్చాక తన విగ్రహాన్ని ప్రతిష్టించుకుంటాడు భల్లలదేవ. అంతే కాదు ప్రజలను తమ బానిసలుగా చూస్తాడు. పసివాడైన బాహుబలి కుమారుడుని కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు భల్లలదేవ. అయితే దేవసేన తన కుమారుడిని కాపాడి రాజ్యం దాటిస్తుంది. అనంతరం భల్లలదేవ సైన్యం దేవసేనను బంధిస్తారు. మరోవైపు బాహుబలి కుమారుడిని కొందరు గ్రామస్తులు కాపాడి.. పెంచి పెద్దచేసి అతనికి శివుడు (ప్రభాస్) అని పేరు పెడతారు. తన తండ్రి పోలికలతోనే ఉండే శివుడు అందర్నీ తన ధైర్య సాహసాలతో ఆకర్షిస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితులలో తన ప్రాంతానికి రాజకుమారి అవంతిక (తమన్నా) వస్తుంది. ఆమె అందం చూసి శివుడు తనని ప్రేమిస్తాడు. ఆ తర్వాత శివుడు అవంతికని వెతుక్కుంటూ మహిష్మతి రాజ్యానికి వెళ్తాడు. అక్కడ శివుడు తన గతం గురించి తెలుసుకొని క్రూరుడైన భల్లలదేవపై ప్రతీకారం తీర్చుకొని రాజ్యాన్ని, ప్రజలను, తన తల్లిని ఎలా సొంతం చేసుకొన్నాడు అనేదే "బాహుబలి" చిత్ర కధ.
ఇదీ బాహుబలి గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథ. అయితే ఇది ఎంతవరకు నిజమనేది మాత్రం సినిమా విడుదలైతేనే కాని తెలియదు. సో.. అప్పటి వరకూ వెయిట్ చేయండి.

No comments:

Post a Comment