Friday 5 June 2015

నిజాయితీ ఉంటే కెసిఆర్‌ను అరెస్టు చేయాలి: చంద్రబాబు

నిజాయితీ ఉంటే కెసిఆర్‌ను అరెస్టు చేయాలి: చంద్రబాబు
  • మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు
  • మంత్రి పదవి కూడా ఇచ్చారు
  • నన్ను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు
  • అయినా వీటికి భయపడేది లేదు
  • సీఎం చంద్రబాబు ఉద్ఘాటన
‘ఓటుకు నోటు’ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మొట్టమొదటిసారిగా, సూటిగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. ‘చంద్రబాబే సూత్రధారి’ అంటూ టీ-హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘తెలంగాణలో కేసీఆర్‌ ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను కొన్నారు. నిజాయితీ ఉంటే కేసీఆర్‌పైనే కేసు పెట్టాలి’ అని సవాల్‌ విసిరారు. తనను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని, వీటికి భయపడేది లేదని తేల్చి చెప్పారు.

No comments:

Post a Comment