Thursday 18 June 2015

ఫోన్‌ ట్యాపింగ్‌పై కేంద్రానికి ఆధారాలు అందించనున్న ఏపీ

ఫోన్‌ ట్యాపింగ్‌పై కేంద్రానికి ఆధారాలు అందించనున్న ఏపీ

హైదరాబాద్‌, జూన్‌ 18 : ఫోన్‌ ట్యాపింగ్‌పై ఏపీ సర్కారు సేకరించిన ఆధారాలను కేంద్రానికి సమర్పించనుంది. దీనిలో భాగంగా ఏపీ చీఫ్‌ సెక్రటరీ ఐవైఆర్‌ కృష్ణారావు ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. డీజీపీ రాముడు కూడా ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో ఏపీ సీఎస్‌, డీజీపీలు కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలిసి ఫోన్‌ ట్యాపింగ్‌పై ఆధారాలను అందజేయనున్నారు. సెక్షన్‌ -8 ను అమలు చేయాలని వారు కేంద్ర కార్యదర్శిని కోరనున్నట్లు సమాచారం.

No comments:

Post a Comment