Friday 26 June 2015

ఏసీబీ చేతికి ఎఫ్ఎస్ఎల్ నివేదిక

టుకు నోటు కేసులో కీలక మలుపు
ఏసీబీ చేతికి ఎఫ్ఎస్ఎల్ నివేదిక

హైదరాబాద్, జూన్ 26: ఓటుకు నోటు కేసు మరో కీలక ఘట్టానికి చేరుకుంది. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఎఫ్ఎస్ఎల్) ఇచ్చిన నివేదిక ఏసీబీ చేతికి అందింది. ముందుగా ఎఫ్ఎస్ఎల్ అధికారులు తమ నివేదికను హైకోర్టులో సమర్పించారు. అయితే ఏసీబీ అధికారులు ఎఫ్ఎస్ఎల్ నివేదికను తమకు ఇవ్వాలని కోరుతూ దీనికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ అనుమతి లేఖతో కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ మేరకు హైకోర్ట ధర్మాసనం ఎఫ్ఎస్ఎల్ నివేదికతో పాటుగా మూడు హార్డ్ డిస్కులు, ఒక సీడీని ఏసీబీ అధికారులకు ఇచ్చింది. కాగా, ఈ నివేదిక ఆధారంగా ఓటుకు నోటు కేసులో ఏసీబీకి తదుపరి చర్యలకు రంగం సిద్ధం చేసింది

No comments:

Post a Comment