Wednesday 17 June 2015

కేసీఆర్‌పై ఏపీ ప్రభుత్వం కేసులు అర్థరహితం : హరీష్‌రావు

కేసీఆర్‌పై ఏపీ ప్రభుత్వం కేసులు అర్థరహితం : హరీష్‌రావు

హైదరాబాద్‌, జూన్‌ 17 : ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ అధికారులు తమ పని తాము చేస్తారని తెలంగాణ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం ఫోన్‌ట్యాపింగ్‌ జరుగలేదని ఏసీబీ స్పష్టం చేసిందని ఆయన తెలిపారు.
 
కేసీఆర్‌పై ఏపీ ప్రభుత్వం కేసులు అర్ధరహితమని వ్యాఖ్యానించారు. అరెస్ట్‌లపై ఏపీ మంత్రులు చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మమ్మల్ని అరెస్ట్‌ చేస్తామనే తాటాకుచప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని మంత్రి హరీష్‌రావ విమర్శించారు.

No comments:

Post a Comment