Friday 5 June 2015

జగన్‌ చేసింది శ్మశాన దీక్ష : యరపతినేని

జగన్‌ చేసింది శ్మశాన దీక్ష : యరపతినేని
గుంటూరు, జూన్‌ 5 : మంగళగిరిలో జగన్‌ చేసింది శ్మశాన దీక్ష అని టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రౌడీలు, దొంగలు, దోపిడీదారులే ప్రజలను నిద్రపోనివ్వరని, ఆ కోణంలోనే చంద్రబాబును జగన్‌ నిద్రపోనివ్వనంటున్నారని మండిపడ్డారు. జైళ్లు, కోర్టుల చుట్టూ తిరిగే జగన్‌ లాంటి నేత ప్రతిపక్ష నేతగా ఉండటం ఏపీ ప్రజల దురదృష్టమన్నారు. జగన్‌, కేసీఆర్‌ గత ఎన్నికల్లో కుదుర్చుకున్న రహస్య ఒప్పందం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహిర్గతమైందని యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

No comments:

Post a Comment