Wednesday 24 June 2015

రాష్ర్టాల వివాదాలపై కేంద్రం జోక్యం చేసుకోదు - వెంకయ్యనాయుడు

ఢిల్లీ : రాష్ర్టాల వివాదాలపై కేంద్రం జోక్యం చేసుకోదు - కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు

ఢిల్లీ, జూన్‌ 24 : రాష్ర్టాల వివాదాలపై కేంద్రం జోక్యం చేసుకోదని కేంద్రమంత్రి యం. వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. సెక్షన్‌-8పై రెండు రాష్ర్టాలు కేంద్రాన్ని సంప్రదిస్తే పరిశీలిస్తామన్నారు. వంద స్మార్ట్‌ సిటీలు, 500 అమృత నగరాలను అభివృద్ధి చేస్తామని మంత్రి ప్రకటించారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు నిర్మించే కార్యక్రమాలను రేపు ప్రధాని ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు. పట్టణ జనాభా ఆధారంగా స్మార్ట్‌ సిటీలను ఎంపిక చేశామన్నారు. పీపీపీ పద్ధతిలో స్మార్ట్‌సిటీల నిర్మాణం చేపడతామని కేంద్రమంత్రి వెంకయ్య వివరించారు.

No comments:

Post a Comment