Tuesday 16 June 2015

కేసీఆర్‌పై మత్తయ్య ఫిర్యాదు కేసు ఏపీ సీఐడీ విచారణ

కేసీఆర్‌పై మత్తయ్య ఫిర్యాదు కేసు ఏపీ సీఐడీ విచారణ

విజయవాడ, జూన్‌ 16 : తెలంగాణ సీఎం కేసీఆర్‌పై జెరూసలెం మత్తయ్య ఇచ్చిన ఫిర్యాదును ఏపీ పోలీసులు సీఐడీకి అప్పగించారు. ఫిర్యాదులో అనేక కోణాలు ఉన్నందున దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఓటుకు నోటు కేసులో ఏ-4 నిందితుడైన మత్తయ్య కేసులో ఏపీ సీఎం చంద్రబాబు పేరు చెప్పాలని టీఏసీబీ అధికారులు బెదిరించారని మత్తయ్య ఫిర్యాదు చేశారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని మత్తయ్య ఆరోపించారు. దీనిపై విజయవాడలో కేసు నమోదు చేశారు.

No comments:

Post a Comment