Friday 19 June 2015

విచారణకు హాజరుకాలేను...ఏసీబీ ఏసీపీకి సండ్ర లేఖ

వెన్నునొప్పి, కాలి నొప్పితో బాధపడుతున్నా
విచారణకు హాజరుకాలేను...ఏసీబీ ఏసీపీకి సండ్ర లేఖ

హైదరాబాద్‌, జూన్‌ 19 : తాను తీవ్రమైన వెన్నునొప్పి, కాలినొప్పితో బాధపడుతున్నందున విచారణకు హాజరుకాలేకపోతున్నానని ఏసీబీ ఏసీపీ మల్లారెడ్డికి తెలంగాణ టీడీపీ నేత సండ్ర వెంకటవీరయ్య లేఖ రాశారు.
 
ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు విచారణకు రావాలని తనకు నోటీసులు పంపినట్లు తెలిసిందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నందున 10 రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు లేఖలో పేర్కొన్నారు.
 
10 రోజుల తర్వాత విచారణకు సహకరిస్తానని ఆయన తెలిపారు. లేదంటే మీరే ఆస్పత్రికి వచ్చి సమాచారం సేకరించుకోవచ్చని సండ్ర లేఖలో కోరారు. ఓటుకు నోటు కేసులో ఈరోజు సాయంత్రం 5 గంటల లోగా విచారణకు హాజరుకావాలని టి.ఏసీబీ సీఆర్పీసీ 160 సెక్షన్‌ కింద సండ్రకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment