Saturday 23 November 2013

పోరాటం చేసి పిచ్చివాళ్లుగా మిగిలాం: టీజీ

పోరాటం చేసి పిచ్చివాళ్లుగా మిగిలాం: టీజీ

Published at: 24-11-2013 03:00 AM
 New  0  0 
 
 

తాడేపల్లిగూడెం/మండపేట, నవంబర్ 23: సమైక్యాంధ్ర కోసం పోరాటంచేసి పిచ్చివాళ్లుగా మిగిలామని మంత్రి టి.జి.వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా మండపేట, ధవళేశ్వరం, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలోనే రాష్ట్ర రాజధానిని కోల్పోయిన అ భాగ్యులం తామేనన్నారు. విభజన అడ్డుకోవాలంటే ఎవరైనా ఢిల్లీలో తప్ప మరోచోట ఉద్యమం చేస్తే ప్రయోజనం ఉండదన్నారు. ఢిల్లీ వీధుల్లో నిజమైన పోరాటం చేయాల ని పిలుపు నిచ్చారు. అన్ని పార్టీలూ జెండాలను పక్కన ఢిల్లీ ముట్టడికి తరలిరావాలని కోరా రు. ఇప్పుడు తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా ఉందన్నారు. రాష్ట్ర విభజన విషయం లో అన్ని పార్టీల అధిష్ఠానాలు తప్పు చేస్తున్నాయని అన్నారు. విభజనపై మీడియా పా త్రనూ టీజీ తప్పుపట్టారు. సొంత అజెండాలతో మీడియా ముందుకు వెళుతున్నదని ఆ రోపించారు. సమైక్య ఉద్యమ ముసుగులో అరాచక శక్తులు ఎంపీ,ఎమ్మెల్యేలను లక్ష్యం గా చేసుకుని దాడులకు పాల్పడటంతో ఉద్యమం నీరుగారిపోయిందని విమర్శించారు.
- See more at: http://ec2-54-201-101-202.us-west-2.compute.amazonaws.com/node/32682#sthash.cs91647G.dpuf

No comments:

Post a Comment